Monday, April 21, 2014

when చిత్ర , శంకర్ మహదేవన్ & విద్యా సాగర్ collaborate - the result is bound to be awesome


 

Pullipulikalum Aattinkuttiyum
అనేది ఒక tongue  twister కాదు. ఒక మళయాళ చిత్రం (2013).  thanks to గూగులమ్మ & youtube అందులోని ఈ అద్భుతమైన పాట నా కంట/చెవిన పడింది. serendipity అంటే ఇదేనేమో. 

పాట బాణీ , చాయాగ్రహణం ,  శంకర్ మహదేవన్, చిత్రల గానం , దర్శకుడి , నటీ నటుల , editor ప్రతిభ, location  ఒకదానికొకటి తోడై మనసుకు హత్తుకుపోతాయి. the song picturisation oozes class. పాట మొత్తం backwaters లో  boat లో చిత్రీకరించటం ఎంతో బాగుంది. 

మరీ పాటలో  3. 00 నుంచి 3. 12 వరకు 4.23 నుంచి 4.46 వరకు మరీ గొప్పగా తీశాడు. దర్శకుడు, cameraman కు hatsoff . 

 దాదాపుగా ఇరవై సార్లు చూసినా నాకు ఇంకా చూడాలని వినాలని అనిపించిన పాట ఇది. 

తెలుగులో కూడా ఇటువంటి classy పాటలు వస్తే బాగుంటుంది అని ఆశ 
this gem of a song has sort of compelled me to write this post



Monday, March 31, 2014

మండుటెండల్లో మల్లెలు, మంచి గంధం ఇంకా కొంచెం మలయమారుతం .


మలయమారుతం ఉదయరాగం. మేలుకొలుపులకు అనువుగా ఉంటుంది. మల్లెమొగ్గలపై నిలిచిన నీటి తుంపరలంత నవ్యంగా ఉంటుంది.

ఒక్క పాట ను పునశ్చరణ చేసుకుంటాను.
ఈ పాట 'ఒరు ఓడై నదియాగిరదు' అన్న చిత్రం లోనిది. పాడినవారు కృష్ణ చంద్రన్, శశిరేఖ. సంగీతం ఇళయరాజా. ఈ పాట మలయమారుతానికి ఒక చక్కని ఉదాహరణ. పాటలో రఘువరన్ dance చేస్తే amusing గా అనిపిస్తుంది. ఇదే cinema లో ఇళయరాజా రీతిగౌళ లో ఒక  అద్భుతమైన పాట స్వరపరిచాడు.

మలయమారుతం  విన్న తరువాత వేసంకాలంలో తెల్లారగట్ల చన్నీటిస్నానం చేసినట్టుగానూ పునర్జన్మ ఎత్తినట్తుగానూ అనిపిస్తుంది.  కొత్తకుండలో నీళ్ళు తాగినట్టుగా కూడా ఉంటుంది. మంచిగంధం మైనలదికొన్నట్టుగా కూడా ఉంటుంది. 

వేసవి మధ్యాహ్న వేళ  చలివేన్దిర పెట్టినట్టుగా, మజ్జిగలో నిమ్మపండుపిండి, చిటికెడు ఉప్పు, కరివేపాకు వేసి తాగి సేదతీరినట్టుగా కూడా ఉంటుంది.

మలయమారుతంలోని 'కొండగాలి తిరిగింది పాటను, మేలుకో శృంగార రాయ' అన్నమయ్య పాటను పాత టపాలలో  చెప్పుకున్నాను. 

అయినా చైత్రంవచ్చీరాకముందే చిత్రంగా ఎండలు చిటపటమంటున్నాయి ఎందుకో. తొందరపడి ఏ కోయిలైనా ముందే కూసేసిందేమో. 



  

Sunday, March 2, 2014

ఇదివరకే విన్నానా- మళ్ళీ కొత్తగా వింటున్నానా



కొన్ని పాటలకు మనసును దేశ, కాలాంతర సంచారం చేయించే లక్షణం ఉంటుంది. పాటలు విన్నతరువాత కాలమాగినట్టు, నయగారా జలపాతం హిమంగా మారే మహిమ ఏదో జరిగినట్టు అనిపిస్తుంది.

'విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం,  నిజాంతర్గతం'  అన్నట్టుగాను కొండ అద్దమందు కొంచమై ఉండదా అనికూడా అనిపిస్తూ మనసులోనే విశ్వదర్శనం అవుతుంది. .

ఆత్మసౌందర్యం ఉట్టిపడే అలాంటి మూడు పాటలను ఒక్కసారి గుర్తు చేసుకుంటాను.
మూడింటికీ ఇళయరాజా సంగీతం.

1) 'జొతెయలి జొతె  జొతెయలి' ఈ పాట గీత  (1981) అన్న కన్నడ చిత్రంలోనిది.  పాటలో బాలుగొంతు ఎంతో బాగుంటుంది. ఇదే బాణీలో పాట    cheeni kum చిత్రంలో కూడా ఉంది.

2) పుత్తం పుదు కాలై అనే ఈ పాట 'అలైగళ్ ఓయ్వదిల్లై ' (1981) (తెలుగులో సీతాకోక చిలుక) చిత్రంలోనిది.  గానం  s జానకి గారు. పాటను ఎంతో గొప్పగా 'clean vocals ' తో పాడారు.

3) 'పూ మాలయే'  - పగల్ నిలవు (1985) చిత్రంలోనిది. పాడినవారు ఇళయరాజా, s జానకి గారు.

ఇళయరాజా best output 1980 నుంచి 1988 కాలంలో ఇచ్చాడని నా అభిప్రాయం. సినీ సంగీతాన్ని తన avant garde quality తో redefine చేసాడు అని చెప్పవచ్చు.

పై పాటలు వచ్చి ముప్పై ఏళ్ళు అయినా ఇంకా contemporary గా అనిపిస్తున్నాయి. అది  గొప్ప పాటల లక్షణం.  విన్నకొద్దీ sense of  deja vu.



Tuesday, December 24, 2013

నీవులేవు. నీ జడనుంచి జారిన మల్లెల పరిమళం నిచిచే ఉంది. - చారుకేశి.


చారుకేశి - చక్కని కురులు కల స్త్రీ. 'ప్రతిదినం  నీ దర్శనం'  దొరకినా మంచిదే. మద్రాసులో మార్గళి మాసపు సాయంత్రాలు చిరుచలిలో కచ్చేరీలు వింటూ మధ్యలో పొగలు కక్కే 'కాపి' తాగిన ఆనందం. 

 'కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్పి ఏమార్చేవు?'

' నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వున కద్దము చూపేను'.

 ఇటువంటి awesome lyrics కలిగిన 'ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ' పాట.
ఆత్రేయ వ్రాసిన ఈ  పాటలోని మాటలు మదురై మల్లెపూల పరిమళంలాగా  కమ్ముకుంటాయి.

త్యాగరాజు 'ఆడ మోడి గలదే' చారుకేశి కి ఒక పాఠ్య పుస్తకం వంటిది.  bombay జయశ్రీ గొంతులో.

పాటలో 'చదువులన్ని' దగ్గర నెరవులు కడిమి చెట్టును అల్లుకున్న అడవిమల్లెతీగల్లాగా అనిపిస్తాయి.

ఇదే పాట బాలమురళి గొంతులో ఇక్కడ.  ముఖ్యంగా ప్రవిస్తారమైన, అనితరసాధ్యమైన  ఆలాపన ఆకట్టుకుంటుంది. 

త్యాగరాజస్వామి మాటల్లోని purity , authenticity కొట్టవచ్చినట్టు కనపడుతాయి.

'సంక్షిప్తంగా పాటలో నాకు అర్థమైన  భావం:  చదువులన్ని తెలిసిన సాక్షాత్  శంకరాంశ సంభూతుడైన హనుమంతుడంతటి  వాడు  సుగ్రీవుని పనుపున వచ్చి నీకు మ్రొక్కి వివరమడిగితే నీవు నేరుగా భాషింపక అనుజుడైన లక్ష్మణుడితో చెప్పించావు. అలాగే నీవు నిన్నే నమ్ముకున్న నాతో ఏదో ఒక తీరున  మాటలాడుతావా రామా? '

చారులత మణి (ఒక gifted singer and columnist ) చారుకేశి గురించి ఇచ్చిన demo lecture ఇక్కడ వినవచ్చు. తమిళంలో ఉన్నా సులభంగా అర్థమవుతుంది. 

చారుకేశి రాగం విన్న తరువాత మనసుకు సాంత్వన గా ఉంటుంది.  పాట అయిపోయిన తరువాతకూడా పాటలోని పరిమళం జడనుంచి జారిపడిన మల్లెలా నిలిచే ఉంటుంది.













  

Monday, September 30, 2013

'ఘటాకాశం' లో 'కొంతకాలం' విద్యా విహారం

ఆకాశంలో కుండ ఉందా కుండలో ఆకాశం ఉందా అంటే రెండూ నిజమే. కానీ ఆకాశంలో ఘటం ఉంది అందులో శబ్దం ఉంది. అది ఇలాంటి పాటలో చెవులను తాకుతుంది అన్నది నిండునిజం. రాగం దాదాపుగా శుద్ధ ధన్యాసి. కొన్ని అన్య స్వరాలు వేయటం విద్యసాగర్ కు అలవాటే.

పాటలో ఘటం చక్కగా ఉపయోగించాడు విద్యసాగర్. పాడినది మధు బాలక్రిష్ణన్. బాగానే పాడాడు కానీ ఇదేపాటను జేసుదాసు గొంతులో 80 లలో  వినిఉంటే  ఇంకా బాగుండేది.

విద్యాసాగర్ చంద్రముఖి చిత్రానికి మంచి సంగీతం ఇచ్చాడు. ఇందులోని కొంతకాలం పాట చాలా బాగుంటుంది. పాట mostly శ్రీ రంజని లో ఉన్నది.పాట మొత్త్తం హాయిగా ఉంటుంది. ముఖ్యంగా రెండవచరణానికి ముందు వచ్చే interlude ఆకట్టుకుంటుంది

'both the above songs are contemporary in feel and

 traditional at the roots'  

ఇవి నా పదాలు కావు. ఒక ఆంగ్ల వ్యాసం లో నుంచి 

దించుకున్నాను.



సంప్రదాయ రాగాలు ఆలంబనగా ఆధునిక బాణీలను కట్టడం అనే ఈ విద్యను విద్యాసాగర్ బాగా నేర్చుకున్నాడు.


పాట లో ఒక finesse తో కూడిన  కల్పన చేయటం masters కే 

సాధ్యం అనిపిస్తుంది.


Saturday, July 20, 2013

మనసు పరిమళించెనే - తనువు పరవశించెనే- పాట మాధుర్యాన ప్రాణాలు కరిగెనే



తెలుగులో యుగళగీతాలకు  పరిపూర్ణత  తెచ్చినవారు  ఘంటసాల సుశీల. వారు పాడిన వందల  పాటలలో పది అత్యుత్తమమైనవి అని నాకు అనిపించినవి  ఒక జాబితా.
ఇవి మనతెలుగువారి అపురూప సంపద. 

పదే ఎందుకు ?  ఈ జాబితా  అవసరమా ? అంటే ఏమీ లేదు. ఉబుసుపోక అంతే.

ఈ పాటల ఎంపికలో నేను పాటించిన ప్రాథమ్యాలు 1) మాధుర్యం  2) పాట బాణీ 3) ఎన్నిమార్లు విన్నా హాయిగా ఉండటం   4) సాహిత్యం.

1) మనసు పరిమళించెనే -  శ్రీ కృష్ణార్జున యుద్ధంలోని ఈ పాట లో అణువణువునా  మాధుర్యం తొణికిసలాడుతుంది. సంగీతం పెండ్యాల . పాట వింటే చాలు పదిమాటలేల. నా మొదటి వోటు ఈ పాటకే 

2) కొండగాలి తిరిగింది. గుండె ఊసులాడింది. :  చిత్రం ఉయ్యాల జంపాల.  సంగీతం పెండ్యాల  పాటను మలయా మారుతంలో చక్కగా స్వరపరిచాడు. ఆరుద్ర మలయమారుతాన్ని అచ్చతెనుగులో కొండగాలిగా మార్చాడు. 

ఆరుద్ర ఈ పాటలో విశ్వరూపం చూపాడు. 'పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది'; 'మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది'; 'ప్రాప్తమున్న తీరానికి పడవ సాగి పోయింది'... 
3) మోహనరాగమహా మూర్తిమంతమాయే : చిత్రం మహామంత్రి  తిమ్మరుసు. సంగీతం పెండ్యాల  రచన పింగళీ. ఈ పాటలో ఘంటసాల సుశీల ఆలాపనలు విని పరవశించిపోవచ్చు. పెండ్యాల గీతాలలో ఆలాపనలకు తప్పక చోటు ఉంటుంది. ఆయన trademark అని  చెప్పవచ్చు.
4) ఎంతహాయి ఈ రేయి : చిత్రం గుండమ్మ కథ. సంగీతం ఘంటసాల. రచన పింగళి.  insominiac లకు చక్కటి మందు ఈ  పాట. పింగళి మార్కు brevity కి ఒక మచ్చుతునక. 
5) ప్రేయసీ మనోహరి వరించి చేరవే: చిత్రం వారసత్వం సంగీతం ఘంటసాల. ఘంటసాల ఎంతగొప్ప గాయకుడో అంతకుతగ్గ సంగీతకర్తకూడా. పాటను జనరంజకంగా బాణి కట్టడం ఆయనకున్న ప్రత్యేకత. 
6) నన్ను వదలి నీవు పోలేవులే : చిత్రం మంచి మనసులు. సంగీతం కె.వి. మహదేవన్. హిందోళం లో స్వరపరచిన ఐ పాట ఒక classic. 
7) ఆకాశ వీధిలో అందాల జాబిలి : చిత్రం మాంగల్య బలం. సంగీతం మాస్టర్ వేణు. రచన శ్రీ శ్రీ పాటలో ఒక simplicity, innocence ఉన్నాయి. 
8) నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని: చిత్రం గులేబకావళి కథ , రచన సినారె,  సంగీతం  విజయ కృష్ణ మూర్తి.  సినారె తొలిపాట. పాటనిండా అందమైన పదబంధాల గుంఫనం పొందుపరిచాడు. కర్పూరం గంధం  గుబాళింపు అనుభూతినిస్తుంది ఈపాట 
9) మాధవా మాధవా నన్ను లాలించరా :  చిత్రం  శ్రీరామకథ (?) సంగీతం s p  కోదండపాణి. ఇది ఒక విలక్షణమైన  పాట. రాగం కళ్యాణ వాసంతం . 
10) సంగమం సంగమం : చిత్రం కోడెనాగు. సంగీతం  పెండ్యాల. last but not the least. ఈ  పాట ఒక చక్కని యుగళగీతం. ఘంటసాల గొంతు  అప్పటికే  పాడయింది. కానీ సుశీల గారు తన గాన మాధుర్యంతో more than compensate చేసింది.  it is one of my personal favourites. 
almost there: ఐనదేమో అయినది , నీ జిలుగుపైట నీడలోన నిలువనీ, పాడవేల రాధిక, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే.. the list continues..
అమ్మయ్య. ఎప్పటినుంచో ఘంటసాల సుశీల గార్ల పాటలను ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ  ఒక టపా వ్రాయాలి అనుకున్నాను. ఆ కోరిక తీరింది. 

Thursday, February 14, 2013

కన కన రుచిరా ప్రహ్లాద కనక కశిపు కథ

హిరణ్యకశిపుని పాత్రకు కొంచెం హాస్యం కొంచెం మానవత్వం జోడిస్తే ఎలా ఉంటుందో అన్న ఊహతో ఈ క్రింది ఘట్టాలను  వ్రాయటం జరిగింది. ఎక్కడా కథౌచిత్య భంగం లేకుండా జాగ్రత్త పడ్డాను.

హిరణ్య కశిపుడు  చండామార్కుల  సంభాషణ:

హిరణ్య కశిపుడు (హి. క.) : చండామార్కుల వారూ: మీరు మన రక్ష: కుల చరిత్రలు మా అన్నగారి పోరాటపటిమ , రాకాసి పాటలు, పజ్యాలు నేర్పమంటే నారాయణ మంత్రం నేర్పటంలో మీ ఉద్దేశ్యం సెలవిస్తారా? కులగురువులని మీకు మన్నన చేసినందుకు ఇదా ఫలితం?


 గురువు గార్లు: ప్రభూ! మా ప్రయత్నలోపం ఇంచుకమాత్రంలేదు. పరిపరివిధముల రక్కసి పురాణాలు టక్కు టమార విద్యలు గరపడానికి ప్రయత్నం చేశాము. ప్రహ్లాదుడు మాకు సహకరించటం లేదు. పైపెచ్చు తోటి రాక్షసబాలలకు హరికథలు చెప్పుచూ పాటలు పాడుచు పాడు చేయుచున్నాడు. ఇతనికి చదువు చెప్పటం మాకు ఎంతమాత్రమూ వీలుపడదు. కావాలంటే తోటి పిల్లలను అడగండి

(హి. క.) : ఏమిరా బాలలు గురువుగారు చెప్పినమాటనిజమేనా ఏదీ హిరణ్యాక్ష స్తోత్రం ఒకమారు పాడండి

రాక్షస బాలలు: చీ అదేమీ బాగులేదు మాకు ప్రహ్లాదుడు నేర్పిన విష్ణుమూర్తి భజనలే నచ్చాయి. అవే పాడుతాము.
 అని ఒక మంచి సంకీర్తన పాడారు.
 (హి. క.) : పాట మాధుర్యాన ప్రాణాలు కరిగెనే అంటూ మైమరచిపోయి అంతలోనే తేరుకుని.

(హి. క.) : అయ్యో దేవుడా ఏమిటీ వైపరీత్యం.

ప్రహ్లాదుడు: తండ్రీ చూచితిరా! మీరుకూడా దైవస్మరణ చేసితిరి. అందరికీ ఆ హరే శరణాగతి

(హి. క.) : చీ. మీకోతిమూక నా బుద్ధినికూడా చెరుపుతున్నారు. గురువుగారు! వీళ్ళకి తగిన శాస్తి చేయవలసి ఉన్నది. ఇవ్వాల్టికి పిల్ల వెధవలందరికీ పండ్లు ఫలములు, మిఠాయిలకు మారుగా కాకరకాయలు, ముల్లంగి, వెల్లుల్లి, గన్నేరు  పప్పు పెట్టించండి. అలాగే వీరికి బంగాళదుంప , కంద, అరటి, చామ వేపుడుకూరలు అన్నీ నిషేధించి కేవలం ఆనపకాయ, పొట్లకాయ, బీరకాయ కూరలే వండించండి.  మాట విన్నవారికి పళ్ళరసాలు, విననివారికి కషాయాలు త్రాగించండి.

మరునాడు:

గురువులు : ప్రభు  మీరు చెప్పినట్టే చేశాము. పిల్లలు ఈ  ఆహారాలను తట్టుకోలేక పోతున్నారండి.
(హి. క.) :అయ్యో హిరణ్యాక్ష : ఏదో కోపంలో అలా పురమాయించాము. పాపం పిల్లలకు సరైన తిండి లేకపోతే ఎలా. అన్నీ పెట్టండి. మళ్ళి మళ్ళీ చెప్పి పిల్లలను దారిలోకి తెచ్చుకోవాలి. మేమేమీ పాషాణ పాక ప్రభువులం గాదు

 హిరణ్యకశిపుడు  రాక్షస భటులతో:                                                                                                                                                      

(హి. క.) : (ప్రహ్లాదుడు ఇక మారడని నిశ్చయించుకుని) వీడు మన మలయజవనం వంటి మన రాక్షసకులంలో తప్పబుట్టాడు. వీనిని పలువిధములుగా హింసించి చంపివేయండి.

రాక్షస భటులు: చిత్తం ప్రభూ.

(హి. క.) : ఏవిటి చిత్తం. నా శ్రాద్ధం. పోయినసారి ఇలాగే వెళ్లి ప్రహ్లాదుని పదిలంగా తీసుకువచ్చారు. ఈ తడవ విఫలమయ్యారో మీ గుడ్లు పెరికి వేస్తాను.

హిరణ్య కశిపుడు లీలావతుల సంభాషణ:


(హి. క.) : (బాధతో) అయ్యో దేవీ. మన ముద్దుల కుమారుణ్ణి ఏనుగులతో తొక్కించి బండరాళ్ళతో మోదించి, చంపించమని నేనే పురమాయించాను. ఏమి నా దురవస్థ.

లీలావతి : స్వామీ! మీకు మనస్సులో పిల్లవాడి పైన ఎంతో ప్రేమ ఉన్నా ఈ లాగున అఘాయిత్యం ఎందుకు చేస్తున్నారో బోధపడదు.

(హి. క.) : నేను దుష్టుడినీ, రాక్షసుడినీ అన్నమాట మరచిపోవద్దు. నా స్వభావ సహజంగా ప్రవర్తించవలసి ఉన్నది.

లీ : ఒకరు చెబితే వినేవారు కారు మీరు.

(హి. క.) : జగజ్జేతను. నేను ఎవ్వరి మాటా వినను. అందరూ నా మాట వినాలి అదంతే. హరి నా ఎదుటనిలచి శరణుకోరితే కరుణించగలవాడను.

లీ : ఏమి ఈ కనీ వినీ ఎరుగని మూర్ఖత్వం.

(హి. క.) :   నారదుడు ఇంతపని చేస్తాడనుకోలేదు గర్భములో ఉండగానే మన ప్రహ్లి కి హరిభక్తి నూరి పోశాడు. ఏనాటి నుంచో వెతుకుతున్నాను. మన ప్రహ్లాదుడు చెప్పే హరి నా ముందుకు రాడేమి. అతనికి నేనంటే చచ్చేంత భయం.

లీ : మీకు పోయేకాలం వచ్చినప్పుడు తప్పక మీకు హరి కనిపిస్తాడు.

(హి. క.) :ఏమిటి దేవి? నీవు కూడా విపరీత ప్రసంగం చేయుచున్నావు ?

లీ :మరి నా బిడ్డను చంపబూనిన మిమ్ములను నేను ఎలా మన్నించగలను.

(హి. క.) : (మనసులో) అయ్యో ! ఆ హరి దర్శనంకోసం నేను ఎంత తపించిపోతున్నానో, ఎంత త్వరగా వైకుంఠం చేరవలసి ఉన్నదో వీళ్ళకు ఒక్కనాటికీ బోధపడదు

కనక కశిపు ప్రహ్లాద సంభాషణ:


(హి. క.) :నాయనా ప్రహ్లాదా! ఏమైనా కొంచెం హరిపిచ్చి వదిలిందా?

ప్రహ్లాదుడు : లేదు తండ్రీ. మరికాస్త పెరిగింది.


(హి. క.) : పిచ్చి తండ్రీ! అతను మనకు కులశత్రువురా. నా ఎదుటికి రమ్మను. ఇట్టే వైకుంఠం పంపించి వేస్తాను.

ప్ర: అక్కడ ఇక్కడ వెదకుటేల ? హరి సర్వాంతర్యామి.

(హి. క.) : ఆలాగేం. అయితే ఈ స్తంభములో ఉన్నాడా నీ హరి. లేదంటే నిన్ను నా చేతులతోనే నీ హరివద్దకు పంపిస్తాను.

స్వగతం లో : (వీనికి హరిపిచ్చితో మతి చెడింది. ముందు స్తంభం పగులగొట్టి ఆనేకు వీనిపని పడతాను )

ప్ర: నిస్సందేహంగా ఉన్నాడు.

(హి. క.) : స్వగతంలో -(వీని ఆత్మ విశ్వాసం చూస్తే భయం వేస్తోంది.హరి బయటికి వచ్చే సూచనలు నాకు పోయే  సూచనలు ఉన్నాయి. నాకు మూడినట్టే తోస్తుంది. అయినా బాధ లేదు).

బయటికి:' ఏడిరా నీ హరి. ఎందైనా కలడేమో కానీ ఇందు మాత్రం లేడు' అంటూ స్తంభాన్ని గదతో పగలగొట్టాడు.

కదిరి నృసింహుడు కంబమునా వెడలె అన్నట్టుగా నరసింహస్వామి ఆ స్థంభ మధ్యంలోనుంచి ఆవిర్భవించాడు.

(హి. క.) : అయ్యో ప్రహ్లాదా! ఈ నరసింహము భీతి గొలుపుచున్నది నన్ను రక్షించు నాయనా.


ప్ర: తండ్రీ, ఇప్పుడైనా మించిపోయినది లేదు. హరిని శరణు వేడండి

(హి. క.) : ఎంతమాత్రం వీలుపడదు నేను దుష్టుడినీ రాక్షసుడినిన్నీ. ఆ ప్రకారం నడచుకోవలసి ఉంది.
ఈ మారువేషము దాల్చిన నరహరిని ఎదుర్కొంటాను

ప్ర: వినాశకాలే విపరీత బుద్ధి:

(హి. క.) : నేనిక్కడ విష్ణుమూర్తి తో కలబడుతుంటే ఏమిటా కుదురులేని మాటలు.

(హి. క.) : వచ్చావా స్వామీ. కోరినన్ను ఏలినట్టి కుల దైవమా. వైకుంఠ వియోగము భరింపలేకున్నాను. త్వరగా నాకు ముక్తిని ప్రసాదించు తండ్రీ. నీకు నాకూ ముఖారికీ భైరవి ఉన్నంత అంతరాన్ని కూడా భరింపలేకున్నాను.