Sunday, June 16, 2024

జేబులో బొమ్మ - అచ్చయిన ఒక కవిత - తాత్త్విక ముచ్చట్లు

16-6-2024 ఆదివారం సాక్షి ఫన్ డే లో కవితల పేజీలో నేను వ్రాసిన ఒక రచన అచ్చయింది.


--------------

జేబులో బొమ్మ


చీకటిని స్పష్టంగా చూడగల చూపు

అంతటా ఉన్న ఆకాశం కోసం వెతుకుతుంది.


వెనక వెలిగే జ్యోతి

ముందున్న తెరపై బొమ్మను చూపిస్తుంది.


కలలో ఆడిన బొమ్మ 

మెలకువలో కరిగిపోతుంది. 


ఎగసిపడిన అల 

సాగరంలో కలిసిపోతుంది.


జాగ్రత్ స్వప్నాలలో ఆడుకునే అజ్ఞానం 

సుషుప్తిలో బ్రేక్ తీసుకుంటుంది.


అజన్మాంతం మూడుముక్కలాట 

సాగుతూ ఉంటుంది


ఘటం లోకి ఆకాశం ఆకాశం లోనికి ఘటం

నిరంతరంగా దూరుతుంటాయి.


అద్దంలో తన పగటి వేషం చూసి 

ఆత్మ నవ్వుకుంటుంది.


ఆర్టిస్టు బహుముఖంగా  

సైంటిస్టు బహిర్ముఖుడై వెతికే సత్యం

చివరికి జేబులో బొమ్మై దొరుకుతుంది.

----------------


ఈ రచనలో భావాలు శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారి అద్వైత ప్రవచనాల స్ఫూర్తితో వ్రాసినవి. గురువుగారు వివరించే తీరు , తీసుకునే ఉదాహరణలు అద్భుతం.



ముఖ్యంగా బాహ్య ప్రపంచంలో సత్యం కోసం అన్వేషకులుగా అనేక మార్గాలలో ప్రయత్నం చేస్తున్నాము.


కళాకారుడు నాదంలో, నాట్యంలో, చిత్రలేఖనంలో ఇంకా ఏదో ఒక కళ ద్వారా వెతుకుతుంటాడు. 


భాషా పండితుడు, భావుకుడు సాహిత్యంలో కృషి చేస్తూ ఉంటాడు.


శాస్త్రవేత్త ఇంకో వైపు నుంచి చేసే అన్వేషణ పరమాణువు నుంచి విశాల విశ్వం దాకా సాగుతుంది. 


భక్తులు, యజ్ఞ కర్మలు, సమాజసేవ చేసేవారు, యోగ సాధకులు, కర్మిష్టులు వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. 


వీరికి భిన్నంగా తాత్వికులు, ఋషులు అంతర్ముఖులై సత్యాన్వేషణ సాగిస్తారు.


వారి వారి సాధనలకు అనుగుణంగా పాక్షిక సత్యాలు ఆవిష్కరింప బడతాయి. 


అంతటితో ఆగక universal truth అనుభవం అయ్యేదాకా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.


కొందరి ప్రయాణం నల్లేరు మీద బండి నడక లాగా, కొందరిది నత్త నడకన సాగినట్లు అనిపిస్తుంది.


తెలిసి సాగేవారు కొందరు. తెలియక ప్రవాహంలో పడి పోయేవారు కొందరు. ఊరి బయట కొండ ఎక్కి ఇదే బెస్టు, లేదు ఎవరెస్టు అనేవారు కొందరు. 


కొందరిది పురోగమనం కొందరిది తిరోగమనం. ఏది ఏమైనా ప్రయాణం తప్పదు. రంగుల రాట్నం ఎక్కి కూర్చున్నాక తిరగక తప్పదు. ఆట ముగిసిన తరువాత దిగక తప్పదు.


అలలు ఎంత ఎగసిపడినా చివరకు కడలి ఒడిలో చేరి విశ్రమించ వలసిందే.


చంకలో పిల్లాణ్ణి పెట్టుకుని ఊరంతా వెతుకుతూ ఉందాము. 


ఆనందంగా గజస్నానం చేసుకుందాము.


రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కు వేసుకుందాము.


Journey continues from lower truth to higher truth.








Wednesday, June 12, 2024

రామోజీ రావు గారు

తెలుగు ప్రజల దైనందిక జీవితాలలో దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రముఖ మీడియా అధిపతి, వ్యాపార వేత్త రామోజీరావు గారు ప్రభావం చూపారు.

ఆయన ఒక విజయవంతమైన వ్యాపారవేత్త, మీడియా అధిపతి, సంపాదకుడు, రాజకీయాలను, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చెయ్యగలిగిన శక్తి, చేసిన వ్యక్తి. 


Discipline, hard work,fierce ambition, chutzpah  and socio political clout and support. This is a unbeatable combination. Man with a Midas touch.


Some thoughts. These are only my observations as I understood them over a long period of time. Normally as is my wont, I like to see both sides of a coin. It is my endeavour to present a balanced view. 


ఈనాడు వార్తా పత్రిక , ఈ టీవీ, Film city: ఈ మూడింటినీ వ్యాపార పరంగా, సాంకేతికంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. ప్రజాదరణ పొందారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. మార్గదర్శి గా నిలిచారు. 


Was he politically neutral ? No. In fact, it may not be possible or even required for anyone  including a media house to maintain total neutrality. ఎంత లేదనుకున్నా ఎంతో కొంత bias అనేది ఉంటుంది. Nothing wrong in taking a political stance. At the same time, criticism should be based on issues and not personal dislike. Unfortunately the political narrative has vitiated the atmosphere and media started playing an unhealthy role.


There will be strengths and faults in every political party or leader. Criticize mistakes and appreciate good deeds irrespective of parties.


Instead Telugu media is often working like mouthpiece of particular political parties  and has lost credibility.


This tendency is not specific to any one paper or channel. Almost all media houses seem to be inclined to one  political party or the other due to some reasons which are best left unsaid.


Whether we like it or not that is how system runs. 


తెలుగు మీడియాలో ఉన్న ఈ పెడ ధోరణి వల్ల  విశ్వసనీయత కోల్పోయింది అనిపిస్తుంది. 


అయితే వినోద కార్యక్రమాలు,భక్తి, ఆధ్యాత్మికం, ఆరోగ్య, వైజ్ఞానిక, వ్యవసాయం, సాహిత్యం.. ఇటువంటి అంశాలలో తెలుగు చానెళ్లు, పత్రికల పనితీరు బాగానే ఉంది. శాస్త్రీయ సంగీతం విషయం లో ఒక్క ఆకాశవాణి, దూరదర్శన్ మాత్రమే ఆదరిస్తున్నాయి.


ఉషాకిరణ్ మూవీస్: ఈ బ్యానర్ పై అనేక చిత్రాలు నిర్మించారు. అందులో మయూరి, ప్రతిఘటన ఈ రెండు మాత్రమే చెప్పుకోదగ్గ చిత్రాలు అని నా అభిప్రాయం. 


Chit funds :  Somehow I am not convinced about either chit funds or stock market / shares business. But both are popular investment choices.  People are investing heavily in share market.


Certain issues were raised by Vundavalli Arun Kumar regarding Margadarshi chit funds. 


Pickles: No doubt Priya pickles are very popular ముఖ్యంగా బ్రహ్మచారులకు ప్రియ పచ్చల్లతో అనుబంధం ఉంటుంది. అయితే ఇంటి పచ్చళ్ళు అలవాటైన వారికి బయట అమ్మే ఊరగాయలు అంతగా నచ్చవు. 90s లో వామన్ పికిల్స్ అని వచ్చేవి. నిజానికి ప్రియ పచ్చళ్ళ కంటే రుచిగా ఉండేవి. ఎందుకో తెలియదు ఆ బ్రాండు ఆగిపోయింది.


Film city: సినీ పరిశ్రమకు, సంబంధించిన అన్ని సౌకర్యాలు స్టూడియోలు, ఒకే చోట పిలిం సిటీలో నెలకొల్పడం జరిగింది. అది విజయవంతంగా నడుస్తున్నది.


I never visited the film City as I felt the ticket price is high. I lost interest. In my opinion food should be included in the ticket price as it is quite high. 


I don't know why but I keep revisiting the following thought.


Why any individual or organisation or entity tends to be hegemonic? 

It boils down to the fundamental nature of consciousness which wants to expand infinitely, stay forever and be always happy. Scale of identification decides the effect.


Prof. నాగేశ్వర్ గారు రామోజీ గారిపై ఒక చక్కటి  వీడియో చేశారు. As per Nageshwar garu, Ramoji Rao garu used to maintain very good personal relations with many people. He was a true journalist.  He earned respect of even those who opposed him. He was a disciplined person and continued to work for his set goals even in ripe old age. He was interested in literature, Indian culture and traditions.


People may not agree with him on some  issues. Still they can learn many good things from the life of Ramoji garu. He was a great institution builder.


🙏

Tuesday, June 4, 2024

ఆంధ్ర శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు

ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం + జనసేన + బీజేపీ  కూటమి అపూర్వమైన ఘన విజయం సాధించింది. వైకాపాను జగన్ పాలనను ఆంధ్ర ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. 

కూటమి విజయం లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. కష్ట సమయం లో తెదేపాకు అండగా నిలిచాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు బీజేపీని కూటమిలో చేరేలా ఒప్పించాడు. అవమానాలు, నిందలు భరించి,  తక్కువ సీట్లు ఇచ్చినా ఒప్పుకుని రాజకీయ పరిణితితో, వ్యూహ రచన చేశాడు. జనసేన పోటీ చేసిన   21 స్థానాలలో 100 % విజయం సాధించాడు. కొత్త ప్రభుత్వంలో తనకు ముఖ్యమైన పదవి వస్తుంది. He totally deserves it.


ప్రొ. నాగేశ్వర్ చెప్పినట్లు ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ man of the match and man of the series  గా నిలిచాడు. He gave a fitting reply to all his critics including common people like me.


వైకాపా ఐదేళ్ల పాలన ప్రత్యక్షంగా తెలియదు కానీ కొన్ని + లు అలాగే - లు ఉన్నాయి అని స్పష్ట మవుతుంది.


విశ్లేషకులు జగన్ ప్రభుత్వ పనితీరు గురించి విశ్లేషణలు, సూచనలు చేస్తూనే ఉన్నారు. Some of the


+Ves

1. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దనే వాలంటీర్లు ద్వారా పెన్షన్లు ప్రతినెలా ఇవ్వడం ✔️

2. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు మెరుగు పరచడం✔️

3. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ద్వారా వివిధ ప్రభుత్వ సేవలు ✔️

4. Social Engineering ✔️


 -ves

1. Proposal of three capitals in place of Amaravati - himalayan blunder. ✖️


I think this is the single most unacceptable decision of Jagan which was rejected by one and all.

2. No real role to ministers, MLAs and MPs. ✖️ 

3. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు మధ్య అనుబంధం తగ్గిపోవడం. Disconnect between lawmakers and people.✖️

4. Sand, liquor policies land titling act etc. ✖️


There may be some other issues too.


ప్రొ. నాగేశ్వర్ గారు ఇలా అన్నారు. ప్రజలు అవినీతిని అయినా భరిస్తారు కానీ అహంకారాన్ని భరించలేరు.


అందరూ ఒప్పుకుని అమరావతి లో నిర్ణయించిన రాజధానిని మార్చాలని తీసుకున్న నిర్ణయం ప్రజలు ఎంతమాత్రం ఒప్పుకోలేదు.


గత ఐదేళ్ల గా ఇస్తున్న సంక్షేమ పథకాలకు సాలీనా సుమారుగా రు. 70000 కోట్లు అవుతున్నాయి అంటున్నారు. అయితే తెదేపా + జనసేన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఏడాదికి 1,25,000 కోట్లు అవసరం అవుతాయి అని అంచనా. Is it possible or desirable ? Welfare schemes and freebies have to be given only to deserving and needy individuals.


E.g. free bus travel to all women is not a good promise. 


A simple capital existing at Amaravati is enough. No need for unnecessary high rise buildings. The available excess land can be utilised for green cover, water harvesting etc.


అయితే ఇప్పుడు nda కూటమి ప్రభుత్వం ఏర్పాటులో తెలుగు దేశం, CBN ముఖ్య పాత్ర పోషించే అవకాశం వచ్చింది. Nda ప్రభుత్వం ఏర్పాటుకు తెలుగు దేశం ఎంపీ లు మద్దతు కీలకం. అందువల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం , ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం సరిదిద్దడానికి, నిధుల కేటాయింపులకు, స్టీలు ప్లాంటు, పోలవరం, ప్రత్యేక హోదా ఇత్యాది అంశాల విషయం లో ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగేలా కొత్త ప్రభుత్వం పట్టు పట్టాలి.


Jagan and YCP have to make a serious self introspection and may have to change some of their methods and policies. Should be receptive to genuine feedback and take corrective measures. Acceptance of failure and past mistakes done may be the right first step for a future comeback.


కేంద్రం లో బీజేపీ కూడా exit polls చెప్పిన ఫలితాలు అందుకోలేదు. అయితే భాగస్వాముల సహకారంతో nda ప్రభుత్వం ఏర్పడుతుంది. BJP doesn't have the magic figure of 272 on its own. It has to depend on allies for majority. This is where support of TDP + JS is critical for formation of government. 


Let's hope that Andhra Pradesh will progress under the the new government with the cooperation of central government.










Thursday, April 11, 2024

రేవతి రాగం - భో! శంభో ! గీతం - musical musings

రేవతి రాగం 70s నుంచి బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది.

సంగీత వాగ్గేయకార త్రిమూర్తులు ఈ రాగం లో కృతులు నిర్మించ లేదు అని తెలుస్తుంది.


స రి మ ప ని  

అన్న ఐదు స్వరాలు కలిగిన ఔడవ రాగం.

మధ్యమావతి రాగం లో చతుశ్రుతి రిషభం ఉండగా రేవతి రాగం లో శుద్ధ రిషభం ఉంటుంది.


ఈ రాగంలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు పాడిన నానాటి బ్రతుకు నాటకము అన్నమయ్య కీర్తన ప్రజలకు చేరువ అయ్యింది.


సినీ గీతాలలో విరివిగా వినిపించింది రేవతి రాగం.


ఓ బంగరు రంగుల చిలకా, మానస వీణ మధుగీతం, ఝుమ్మంది నాదం, ఉదయ కిరణ రేఖలో, నా గొంతు శ్రుతి లోనా, అభినవ శశి రేఖవో, మ్రోగింది డమరుకం... పాటలు ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా శ్రీ రామదాసు చిత్రం లోని ఏ మూర్తి పాట రేవతి రాగం లో ఉన్న అద్భుత గీతం అని చెప్పవచ్చు.


వేదమంత్రాలు వీణ పై పలికించడానికి రేవతి రాగం అనువుగా ఉంటుంది అని చెబుతారు. అలాగే విష్ణు సహస్రనామం, లలితా సహస్ర నామం.. ఈ రాగ ఛాయ లలో పాడిన స్తోత్రాలు సహస్రనామాలు వినసొంపుగా ఉంటాయి. భక్తి భావనలు  కలుగుతాయి. 


శ్రీనివాసా గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా అని రేవతి రాగంలో పారుపల్లి రంగనాథ్ గారు పాడిన గోవిందనామాలు బహుళ ప్రాచుర్యం పొందాయి


అనేక ఉపాధులలో ఒకే అంతర్యామి ఉన్నట్లుగా అనేక గీతాలకు ఒకే రాగం ఆధారంగా ఉంటుంది.



ఆర్ష విద్యా గురుకుల స్థాపకులు, అద్వైత వేదాంత ఆచార్యులు పూజ్య స్వామీజీ దయానంద సరస్వతి గారు రేవతి రాగంలో

భో !  శంభో!   శివ శంభో ! స్వయంభో ! 

అన్న ఒక అద్భుతమైన గీతం రచించారు.  ఈ గీతాన్ని ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు కీ . శే. మహారాజపురం సంతానం గారు సంగీత సభలలో విరివిగా పాడుతూ ప్రాచుర్యం లోకి తెచ్చారు.


పల్లవి.


భో శంభో శివ శంభో స్వయంభో


అనుపల్లవి.


గంగాధర శంకర కరుణాకర

మామవ భవసాగర తారక


భో శంభో శివ శంభో స్వయంభో

భో శంభో శివ శంభో స్వయంభో


చరణం 1.


నిర్గుణ పరబ్రహ్మ స్వరూప

గమాగమ భూత ప్రపంచరహిత

నిజగుహ నిహిత నితాంత అనంత

ఆనంద అతిశయ అక్షయలింగ


చరణం 2.


ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిటతోం

తోం తోం తిమికిట తరికిట కిటతోం

ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిటతోం

తోం తోం తిమికిట తరికిట కిటతోం


మతంగ మునివర వందిత ఈశా

సర్వ దిగంబర వేష్టితవేష

నిత్య నిరంజన నిత్యనటేశ

ఈశ సభేశ సర్వేశ


భో శంభో శివ శంభో స్వయంభో

భో శంభో శివ శంభో స్వయంభో

గంగాధర శంకర కరుణాకర

మామవ భవసాగర తారక



సాహిత్యం అర్థం:


పల్లవి:  ఓ శంభో, శుభకరుడిగా స్వయంభువుగా  వెలసిన  పరమశివా  


అనుపల్లవి: గంగాధర! శంకర! కరుణాకర!

భవసాగరం దాటించి ( మమ్ము ) రక్షించుము.


చరణం 1: 

నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైన నీవు (శంభో)

భూత భవిష్యత్ వర్తమాన కాలములలో  మార్పు చెందే జగత్తుకు అతీతుడైన వాడవు

 

శాశ్వతమైన హిమాలయ పర్వత గుహలో  అనంతమైన ఆనందంతో  శాశ్వతంగా నిలిచి ఉండే అక్షయలింగ స్వరూపుడవు.

(హృదయ కుహరం లో ఆత్మ జ్యోతి స్వరూపుడవై  నిరంతరం వెలుగుతూ వెలసి ఉంటావు)


చరణం 2: ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిటతోం, తోం తోం తిరికిట తరికిట కిటతోం .


మునులలో ముఖ్యుడైన మతంగ మునిచే స్తుతించబడిన ఓ ఈశ్వర!


ఆకాశమును వస్త్రంగా చుట్టూ ధరించి, ఎల్లప్పుడూ దోషం లేకుండా అవిరామంగా నాట్యం చేసే నటరాజ స్వామి వైన నీవు సభలకు అధిపతివి మరియు సర్వ లోకాలకు చక్రవర్తివి.


(గీతం యొక్క అర్థ వివరణ భావం అంజలి సుధీర్ గారి బ్లాగు ఆధారంగా)


చిదంబర నటరాజ స్వామి వారి పై వ్రాసిన ఈ  గీతం కూచిపూడి , భరతనాట్యం శాస్త్రీయ నృత్య కళాకారులు తరచుగా ప్రదర్శిస్తారు. చాలా అద్భుతం గా ఉంటుంది. ఒక అలౌకిక అనుభూతి కలిగిస్తుంది.


చిదంబర నటరాజ స్వామి చిత్ సభ, కనక సభ, నృత్త సభ, దేవ సభ, రాజ సభలనే పంచ సభలకు అధిపతి - సభేశుడు.


పూజ్య స్వామీజీ వారి పూర్వాశ్రమ నామం నటరాజన్. ఆ విధంగా ఈ గీతం ఎంతో సముచితంగా అనిపిస్తుంది.


అనేకమంది కళాకారులు ఈ గీతం ఆలపించారు. అందులో ఉన్ని కృష్ణన్ గారు పాడిన గీతం చాలా బాగుంది. విన్న ప్రతి సారి ఒక దివ్యానుభూతి కలుగ జేస్తూ ధ్యాన స్థితి లోకి తీసుకు వెళుతుంది.


Bho shambho in Trichur brothers voice


సమీప గతకాలంలో రేవతి రాగం లో రెండు కీర్తనలు ఆకట్టుకున్నాయి.


హేమచంద్ర పాడిన ధర్మాధర్మము లాలా దైవములాలా అన్న అన్నమాచార్య కృతి చాలా బాగుంది. చక్కగా పాడాడు. సంగీతం బాగుంది.


అలాగే నీవొక్కడవే సర్వాధారము ఈ కీర్తన కూడా చాలా బాగా స్వరపరిచారు. గాయకుడు చక్కగా పాడాడు.


ఓం నమః శివాయ 🙏



 


Saturday, December 16, 2023

బలగం చిత్రం - a well made movie

Slice of Life  సినిమా అంటే - 

నిజ జీవితంలో ఒక ప్రదేశంలో స్వల్ప వ్యవధి లో జరిగిన సంఘటనలను సహజంగా తెరకెక్కించడం.

'The slice-of-life movies are essentially a depiction of the mundane. They will typically focus on character and relationships over things like genre elements, special effects, or the overall aesthetic. In short, they can be thought of as substance over style.'


వేణు సహాయ పాత్రలు, హాస్య పాత్రలలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. పెద్దగా ప్రభావం చూపినట్లు అనిపించలేదు. అతను బలగం అనే సహజమయిన, అర్థవంతమైన మంచి చిత్రం తో దర్శకుడు గా రచయిత గా మారాడు అంటే ఆశ్చర్యం కలిగింది. 


ఈ చిత్రం చూసిన తరువాత ఇతను ఎంత ప్రతిభావంతుడు అన్న విషయం తెలిసింది. Only a person with immense talent and passion can make such movie.


చిత్రంలో కథ, దర్శకత్వం, నటీ నటులు, లొకేషన్, సంగీతం, ఛాయాగ్రహణం , అన్నీ చక్కగా కుదిరాయి.


తెలంగాణా లోని ఒక గ్రామం లో ఉండి కళ్లముందు జరిగిన జీవితాన్ని చూస్తున్న భావన కలిగింది.


Customs and traditions may be region specific but human relations are universal.


వేణు కథను నడిపించిన విధానం బాగుంది. 


Though a serious subject, really liked his sense of humour throughout the movie. 


ఆగుతావా.. రెండు నిముషాలు అని ఒక నటుడు


అది పద్ధతేనాయే.. అని ఒకరు 


అంటుంటే మనకు పరిచయం ఉన్న వాళ్ళు మాట్లాడినట్టు అనిపిస్తుంది.


ఈ చిత్రంలో నటీ నటుల పేర్లు తెలియవు. అందరూ అత్యంత సహజంగా కనిపించారు. 


మద్యం, మాంసం అనేవి గ్రామీణ జీవితం ఆచార వ్యవహారాల్లో అతి సహజ అంతర్భాగం అన్న విషయం ఈ  చిత్రంలో కనిపిస్తుంది.


ఇంటి పెద్ద మరణం నుంచి పదకొండు రోజులలో కుటుంబ సభ్యుల మధ్య ఇగోలు,పంతాలు, మాట పట్టింపులు, నమ్మకాలు, స్వార్థం, వారిలో చివరికి కలిగిన పరివర్తన ..


director succeeds in making the viewers travel through the happenings. 


Even though the subject is not elaborate, the way director tells the story leaves an impact on viewers.


తెలంగాణా జానపద కళారూపాలు ఒగ్గు కథ ను ఉపయోగించిన తీరు బాగుంది. ముఖ్యంగా గా క్లైమాక్స్ లో కళాకారులు గీతం ద్వారా కుటుంబ సభ్యులను పేరు పేరునా వెళ్లిపోయిన పెద్దాయనకు ఉన్న వెలితిని తీర్చేలా పాడడం మనసును కదిలిస్తుంది.


తిథి అన్న కన్నడ చిత్రం ఇదే తరహా సబ్జెక్టు మీద తీశారు అని తెలుస్తుంది.

ఛాయా గ్రహణం బాగుంది. ముఖ్యంగా సంగీతం, పాటలు, సాహిత్యం బాగా కుదిరాయి. 


In my opinion this movie deserves awards in best movie, best direction, music and lyrics categories at National level.


Balagam is one of the rare meaningful movies in Telugu.


Producer Dil Raju deserves appreciation for backing the director and his vision.


వేణు భవిష్యత్తులో మంచి చిత్రాలు తీయగలడు అనిపిస్తుంది.





Friday, December 8, 2023

దక్షిణామూర్తి స్తోత్రం లోని తొలి రెండు శ్లోకాలు - గురూపదేశం

శ్రీ యల్లం రాజు గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు అద్వైత సిద్ధాంతం ప్రతిపాదనలు , ఆదిశంకరుల వారి భాష్యం ఆకళింపు చేసుకుంటే ' శాస్త్రజ్ఞులు నిశ్చేష్టులవుతారు, scientists will be baffled'  అని. 

దక్షిణా మూర్తి స్తోత్రం యొక్క అంతరార్థం గురువు గారు విడమరచి చెబుతుంటే ఆ మాట అక్షరాలా నిజం అనిపిస్తుంది.


మొదటి రెండు శ్లోకాలు సంపూర్ణంగా అవగతం చేసుకుంటే జీవ, జగత్, ఈశ్వరుల విషయం లో కలిగే అనేక సందేహాలకు సమాధానం దొరుకుతుంది. 


సృష్టి రహస్యాన్ని రెండు శ్లోకాలలో నిక్షిప్తం చేసిన జగద్గురువు శ్రీ శంకరాచార్య భగవత్పాదులయితే, ఆ శ్లోకాల అంతర్భావాన్ని అతి స్పష్టంగా వివరించి చెప్పిన సద్గురువు శ్రీ యల్లం రాజు శ్రీనివాసరావు గారు. 

-----------

విశ్వం దర్పణదృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని 

మాయయా బహిరివోద్భూతం 

యథా నిద్రయా ।

యస్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం

తస్మై శ్రీగురుమూర్తయే 

నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ।।


బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాఙ్నర్వికల్పం పునః

మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం ।

మాయావీవ విజృంభయత్యపి మాయాయోగీవ యః స్వేచ్ఛయా

తస్మై శ్రీగురుమూర్తయే 

నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ।।


--------------

It is bewildering to learn about the fundamental concepts of  Space, Time and Matter in the shloka. 


గురువు గారి వివరణ లో


దేశం - Space  - సత్త్వ గుణాన్ని


కాలం - Time - రజో గుణాన్ని


కలన - Matter - తమో గుణాన్ని 


సూచిస్తున్నాయి.


మాయాకల్పిత వైచిత్ర్యచిత్రీకృతం -


అమ్మవారు మాయచే వివిధ ఆకృతులలో, రీతులలో రచించిన త్రిగుణాత్మకమైన జగత్తు. శక్తి తత్త్వం.


అయితే ఈ సృష్టికి మూలం, ఆధారభూతం - అలాగే లయం చేసుకునేది త్రిగుణాతీతం అయిన నిర్వికల్ప స్థితి లోని అయ్యవారు. శివతత్త్వం.


బీజంలో అంకురం అంతర్గతంగా దాగి ఉన్నట్లు జగత్తు ఆత్మ చైతన్యం లో దాగి ఉండి బహిర్గతం అయినట్లు అనిపించి తిరిగి లీనమైపోతుంది.


అద్భుతం . ఒక్క శ్లోకం లో సృష్టి, స్థితి, లయ క్రమాన్ని అద్భుతంగా పొందుపరచడం జరిగింది .


మొదటి శ్లోకం లో దర్పణం, స్వప్నం అనే రెండు దృష్టాంతాల తో జగత్తు స్వరూపాన్ని వివరించడం జరిగింది. 


దర్పణం , దృశ్యం, ద్రష్ట, దృష్టి నాలుగు ఒకటే - అవి  ఆత్మ స్వరూపం కంటే భిన్నంగా లేవు అని గురువు గారు వివరించిన తీరు అద్భుతం.


స్వప్నం దర్శిస్తున్న సమయం లో అది కేవలం స్వప్నం మాత్రమే అన్న విషయం ఎరుక ఉండదు. మెలకువ కలిగిన తరువాత మాత్రమే తాను చూసినది స్వప్నం అంతేకానీ నిజం కాదు అన్న స్ఫురణ కలుగుతుంది.


అదే విధంగా జాగ్రత్ అవస్థలో చూస్తున్న జగత్తు, కలిగే అనుభూతులు ఆభాస మాత్రమే అన్న సత్యం ఆత్మ స్వరూప జ్ఞానోదయం కలిగిన తరువాత మాత్రమే అనుభవానికి వస్తుంది. 


జాగ్రదవస్థ, స్వప్న సమయాల్లో నేను నాది అన్న తలంపు ఉంటుంది. సుషుప్తి లో నేను నాది - ఈ రెండిటి ఎరుక ఉండదు. అవస్థ త్రయానికి అతీతమైన సమాధి లేక తురీయావస్థ లో కేవలం నేను అన్న అద్వైత స్థితి ఉంటుంది అని వివరించారు.


ఇంతకీ జగత్తు ఉందా లేదా ?

అద్వైతం చెప్పే మాట -  ఉంది , లేదు. ఆభాసగా ఉంది. వాస్తవంగా లేదు.


కనిపించే జగత్తును మాయగా అవ్యక్తమైన ఆత్మ చైతన్యాన్ని వాస్తవంగా నిరూపించడానికి ఇంత శాస్త్రం, చర్చ, బోధ అవసరమా, ఆ ఎరుక లేకపోయినా జీవన యానం సాగుతూనే ఉంటుంది కదా అన్న ప్రశ్న వస్తుంది.


అయితే సత్య వస్తువు స్వరూపం కోసం చేసే అన్వేషణ లో - to travel from lower truth to higher truth, to establish finality, Advaita is the chosen path of Acharyas and Upanishadic Rishis.


ద్వైతం ప్రతిపాదించే ప్రారంభ వాదాన్ని, విశిష్టాద్వైతం పరిణామ వాదాన్ని దాటిపోయి అంతిమ పరిష్కారం చూపుతుంది అద్వైతం. 


గురోస్తు మౌనం వ్యాఖ్యానం 

శిష్యాస్తు ఛిన్న సంశయాః 


శిష్యుల సందేహాలు పటాపంచలు అయ్యాయి. 


దక్షిణామూర్తి మౌనం లోని అంతరార్థం అవగతమవుతుంది.🙏