Thursday, July 17, 2014

గహనా మనసో గతి: అధునా హిందోళమే శరణాగతి.

మనసు చేసే మాయలు అన్నీ ఇన్నీ కావు.  ఉన్నతంగా కొన్ని సార్లు , నీచంగా అనేక మార్లు, ఎక్కువభాగం మామూలుగా ప్రవర్తిస్తుంది.
ఒకపరి శిష్టాన్నములు  ఒకపరి దుష్టాన్నములు  కోరుతుంది.

మంచి సంగీతం  వినటం మనసును  higher plane లో ఉంచుతుంది.

(preachy preachy అవుతోంది. lemme shift  gears  )


GBK గారు  అన్నమయ్య పదాలను జనరంజకంగా బాణీలు కట్టడంలో ఎంతో కృషి చేశారు వారు హిందోళంలో కట్టిన ఈ పాట వింటే మైమరచి పోవటం ఖాయం.' నారాయణ నీ నామమే గతి ఇక '..

ఒక శ్రోత ఇలా వ్యాఖ్యానించారు '  ప్రాణం పోయినా పరవాలేదు ఈ పాట విన్నాక' .  అని.
అంత గొప్పగా ఉంది ఈపాట బాణీ , ప్రసాద్ గారు పాడిన తీరు.
పాటలో అట్టే ఆకట్టుకునే మాటలు  'పైపై ముందట భవజలధి దాపు వెనుక  చింతా జలధి చాపలము నడుమ సంసార జలధి'

హిందోళమే అమృతతుల్యంగా ఉంటుంది. ఎన్నో గొప్ప పాటలు ఉన్నాయి.

సముద్రపు అలలు, నిండు చందమామ , చంటిపిల్లల నవ్వులు,  ఎంత చూసినా తనివితీరదు, విసుగు పుట్టదు.
ఈ పాట కూడా ఆ కోవ లోనిదే.

అలాగే 'మునుల తపమునదె మూలభూతి యదె'  పాట కూడా చాలా బాగుంది. ముఖ్యంగా  చరణాల ప్రారంభంలో ఉన్న మాధుర్యం మనసుకు హత్తుకుంటుంది.

మనసు మాట వినదు కాని పాట  వింటుంది. మనసు గతి ఇంతే.

అధునా 

Monday, April 21, 2014

when చిత్ర , శంకర్ మహదేవన్ & విద్యా సాగర్ collaborate - the result is bound to be awesome


 

Pullipulikalum Aattinkuttiyum
అనేది ఒక tongue  twister కాదు. ఒక మళయాళ చిత్రం (2013).  thanks to గూగులమ్మ & youtube అందులోని ఈ అద్భుతమైన పాట నా కంట/చెవిన పడింది. serendipity అంటే ఇదేనేమో. 

పాట బాణీ , చాయాగ్రహణం ,  శంకర్ మహదేవన్, చిత్రల గానం , దర్శకుడి , నటీ నటుల , editor ప్రతిభ, location  ఒకదానికొకటి తోడై మనసుకు హత్తుకుపోతాయి. the song picturisation oozes class. పాట మొత్తం backwaters లో  boat లో చిత్రీకరించటం ఎంతో బాగుంది. 

మరీ పాటలో  3. 00 నుంచి 3. 12 వరకు 4.23 నుంచి 4.46 వరకు మరీ గొప్పగా తీశాడు. దర్శకుడు, cameraman కు hatsoff . 

 దాదాపుగా ఇరవై సార్లు చూసినా నాకు ఇంకా చూడాలని వినాలని అనిపించిన పాట ఇది. 

తెలుగులో కూడా ఇటువంటి classy పాటలు వస్తే బాగుంటుంది అని ఆశ 
this gem of a song has sort of compelled me to write this post



Monday, March 31, 2014

మండుటెండల్లో మల్లెలు, మంచి గంధం ఇంకా కొంచెం మలయమారుతం .


మలయమారుతం ఉదయరాగం. మేలుకొలుపులకు అనువుగా ఉంటుంది. మల్లెమొగ్గలపై నిలిచిన నీటి తుంపరలంత నవ్యంగా ఉంటుంది.

ఒక్క పాట ను పునశ్చరణ చేసుకుంటాను.
ఈ పాట 'ఒరు ఓడై నదియాగిరదు' అన్న చిత్రం లోనిది. పాడినవారు కృష్ణ చంద్రన్, శశిరేఖ. సంగీతం ఇళయరాజా. ఈ పాట మలయమారుతానికి ఒక చక్కని ఉదాహరణ. పాటలో రఘువరన్ dance చేస్తే amusing గా అనిపిస్తుంది. ఇదే cinema లో ఇళయరాజా రీతిగౌళ లో ఒక  అద్భుతమైన పాట స్వరపరిచాడు.

మలయమారుతం  విన్న తరువాత వేసంకాలంలో తెల్లారగట్ల చన్నీటిస్నానం చేసినట్టుగానూ పునర్జన్మ ఎత్తినట్తుగానూ అనిపిస్తుంది.  కొత్తకుండలో నీళ్ళు తాగినట్టుగా కూడా ఉంటుంది. మంచిగంధం మైనలదికొన్నట్టుగా కూడా ఉంటుంది. 

వేసవి మధ్యాహ్న వేళ  చలివేన్దిర పెట్టినట్టుగా, మజ్జిగలో నిమ్మపండుపిండి, చిటికెడు ఉప్పు, కరివేపాకు వేసి తాగి సేదతీరినట్టుగా కూడా ఉంటుంది.

మలయమారుతంలోని 'కొండగాలి తిరిగింది పాటను, మేలుకో శృంగార రాయ' అన్నమయ్య పాటను పాత టపాలలో  చెప్పుకున్నాను. 

అయినా చైత్రంవచ్చీరాకముందే చిత్రంగా ఎండలు చిటపటమంటున్నాయి ఎందుకో. తొందరపడి ఏ కోయిలైనా ముందే కూసేసిందేమో. 



  

Sunday, March 2, 2014

ఇదివరకే విన్నానా- మళ్ళీ కొత్తగా వింటున్నానా



కొన్ని పాటలకు మనసును దేశ, కాలాంతర సంచారం చేయించే లక్షణం ఉంటుంది. పాటలు విన్నతరువాత కాలమాగినట్టు, నయగారా జలపాతం హిమంగా మారే మహిమ ఏదో జరిగినట్టు అనిపిస్తుంది.

'విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం,  నిజాంతర్గతం'  అన్నట్టుగాను కొండ అద్దమందు కొంచమై ఉండదా అనికూడా అనిపిస్తూ మనసులోనే విశ్వదర్శనం అవుతుంది. .

ఆత్మసౌందర్యం ఉట్టిపడే అలాంటి మూడు పాటలను ఒక్కసారి గుర్తు చేసుకుంటాను.
మూడింటికీ ఇళయరాజా సంగీతం.

1) 'జొతెయలి జొతె  జొతెయలి' ఈ పాట గీత  (1981) అన్న కన్నడ చిత్రంలోనిది.  పాటలో బాలుగొంతు ఎంతో బాగుంటుంది. ఇదే బాణీలో పాట    cheeni kum చిత్రంలో కూడా ఉంది.

2) పుత్తం పుదు కాలై అనే ఈ పాట 'అలైగళ్ ఓయ్వదిల్లై ' (1981) (తెలుగులో సీతాకోక చిలుక) చిత్రంలోనిది.  గానం  s జానకి గారు. పాటను ఎంతో గొప్పగా 'clean vocals ' తో పాడారు.

3) 'పూ మాలయే'  - పగల్ నిలవు (1985) చిత్రంలోనిది. పాడినవారు ఇళయరాజా, s జానకి గారు.

ఇళయరాజా best output 1980 నుంచి 1988 కాలంలో ఇచ్చాడని నా అభిప్రాయం. సినీ సంగీతాన్ని తన avant garde quality తో redefine చేసాడు అని చెప్పవచ్చు.

పై పాటలు వచ్చి ముప్పై ఏళ్ళు అయినా ఇంకా contemporary గా అనిపిస్తున్నాయి. అది  గొప్ప పాటల లక్షణం.  విన్నకొద్దీ sense of  deja vu.



Tuesday, December 24, 2013

నీవులేవు. నీ జడనుంచి జారిన మల్లెల పరిమళం నిచిచే ఉంది. - చారుకేశి.


చారుకేశి - చక్కని కురులు కల స్త్రీ. 'ప్రతిదినం  నీ దర్శనం'  దొరకినా మంచిదే. మద్రాసులో మార్గళి మాసపు సాయంత్రాలు చిరుచలిలో కచ్చేరీలు వింటూ మధ్యలో పొగలు కక్కే 'కాపి' తాగిన ఆనందం. 

 'కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్పి ఏమార్చేవు?'

' నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వున కద్దము చూపేను'.

 ఇటువంటి awesome lyrics కలిగిన 'ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ' పాట.
ఆత్రేయ వ్రాసిన ఈ  పాటలోని మాటలు మదురై మల్లెపూల పరిమళంలాగా  కమ్ముకుంటాయి.

త్యాగరాజు 'ఆడ మోడి గలదే' చారుకేశి కి ఒక పాఠ్య పుస్తకం వంటిది.  bombay జయశ్రీ గొంతులో.

పాటలో 'చదువులన్ని' దగ్గర నెరవులు కడిమి చెట్టును అల్లుకున్న అడవిమల్లెతీగల్లాగా అనిపిస్తాయి.

ఇదే పాట బాలమురళి గొంతులో ఇక్కడ.  ముఖ్యంగా ప్రవిస్తారమైన, అనితరసాధ్యమైన  ఆలాపన ఆకట్టుకుంటుంది. 

త్యాగరాజస్వామి మాటల్లోని purity , authenticity కొట్టవచ్చినట్టు కనపడుతాయి.

'సంక్షిప్తంగా పాటలో నాకు అర్థమైన  భావం:  చదువులన్ని తెలిసిన సాక్షాత్  శంకరాంశ సంభూతుడైన హనుమంతుడంతటి  వాడు  సుగ్రీవుని పనుపున వచ్చి నీకు మ్రొక్కి వివరమడిగితే నీవు నేరుగా భాషింపక అనుజుడైన లక్ష్మణుడితో చెప్పించావు. అలాగే నీవు నిన్నే నమ్ముకున్న నాతో ఏదో ఒక తీరున  మాటలాడుతావా రామా? '

చారులత మణి (ఒక gifted singer and columnist ) చారుకేశి గురించి ఇచ్చిన demo lecture ఇక్కడ వినవచ్చు. తమిళంలో ఉన్నా సులభంగా అర్థమవుతుంది. 

చారుకేశి రాగం విన్న తరువాత మనసుకు సాంత్వన గా ఉంటుంది.  పాట అయిపోయిన తరువాతకూడా పాటలోని పరిమళం జడనుంచి జారిపడిన మల్లెలా నిలిచే ఉంటుంది.













  

Monday, September 30, 2013

'ఘటాకాశం' లో 'కొంతకాలం' విద్యా విహారం

ఆకాశంలో కుండ ఉందా కుండలో ఆకాశం ఉందా అంటే రెండూ నిజమే. కానీ ఆకాశంలో ఘటం ఉంది అందులో శబ్దం ఉంది. అది ఇలాంటి పాటలో చెవులను తాకుతుంది అన్నది నిండునిజం. రాగం దాదాపుగా శుద్ధ ధన్యాసి. కొన్ని అన్య స్వరాలు వేయటం విద్యసాగర్ కు అలవాటే.

పాటలో ఘటం చక్కగా ఉపయోగించాడు విద్యసాగర్. పాడినది మధు బాలక్రిష్ణన్. బాగానే పాడాడు కానీ ఇదేపాటను జేసుదాసు గొంతులో 80 లలో  వినిఉంటే  ఇంకా బాగుండేది.

విద్యాసాగర్ చంద్రముఖి చిత్రానికి మంచి సంగీతం ఇచ్చాడు. ఇందులోని కొంతకాలం పాట చాలా బాగుంటుంది. పాట mostly శ్రీ రంజని లో ఉన్నది.పాట మొత్త్తం హాయిగా ఉంటుంది. ముఖ్యంగా రెండవచరణానికి ముందు వచ్చే interlude ఆకట్టుకుంటుంది

'both the above songs are contemporary in feel and

 traditional at the roots'  

ఇవి నా పదాలు కావు. ఒక ఆంగ్ల వ్యాసం లో నుంచి 

దించుకున్నాను.



సంప్రదాయ రాగాలు ఆలంబనగా ఆధునిక బాణీలను కట్టడం అనే ఈ విద్యను విద్యాసాగర్ బాగా నేర్చుకున్నాడు.


పాట లో ఒక finesse తో కూడిన  కల్పన చేయటం masters కే 

సాధ్యం అనిపిస్తుంది.


Saturday, July 20, 2013

మనసు పరిమళించెనే - తనువు పరవశించెనే- పాట మాధుర్యాన ప్రాణాలు కరిగెనే



తెలుగులో యుగళగీతాలకు  పరిపూర్ణత  తెచ్చినవారు  ఘంటసాల సుశీల. వారు పాడిన వందల  పాటలలో పది అత్యుత్తమమైనవి అని నాకు అనిపించినవి  ఒక జాబితా.
ఇవి మనతెలుగువారి అపురూప సంపద. 

పదే ఎందుకు ?  ఈ జాబితా  అవసరమా ? అంటే ఏమీ లేదు. ఉబుసుపోక అంతే.

ఈ పాటల ఎంపికలో నేను పాటించిన ప్రాథమ్యాలు 1) మాధుర్యం  2) పాట బాణీ 3) ఎన్నిమార్లు విన్నా హాయిగా ఉండటం   4) సాహిత్యం.

1) మనసు పరిమళించెనే -  శ్రీ కృష్ణార్జున యుద్ధంలోని ఈ పాట లో అణువణువునా  మాధుర్యం తొణికిసలాడుతుంది. సంగీతం పెండ్యాల . పాట వింటే చాలు పదిమాటలేల. నా మొదటి వోటు ఈ పాటకే 

2) కొండగాలి తిరిగింది. గుండె ఊసులాడింది. :  చిత్రం ఉయ్యాల జంపాల.  సంగీతం పెండ్యాల  పాటను మలయా మారుతంలో చక్కగా స్వరపరిచాడు. ఆరుద్ర మలయమారుతాన్ని అచ్చతెనుగులో కొండగాలిగా మార్చాడు. 

ఆరుద్ర ఈ పాటలో విశ్వరూపం చూపాడు. 'పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది'; 'మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది'; 'ప్రాప్తమున్న తీరానికి పడవ సాగి పోయింది'... 
3) మోహనరాగమహా మూర్తిమంతమాయే : చిత్రం మహామంత్రి  తిమ్మరుసు. సంగీతం పెండ్యాల  రచన పింగళీ. ఈ పాటలో ఘంటసాల సుశీల ఆలాపనలు విని పరవశించిపోవచ్చు. పెండ్యాల గీతాలలో ఆలాపనలకు తప్పక చోటు ఉంటుంది. ఆయన trademark అని  చెప్పవచ్చు.
4) ఎంతహాయి ఈ రేయి : చిత్రం గుండమ్మ కథ. సంగీతం ఘంటసాల. రచన పింగళి.  insominiac లకు చక్కటి మందు ఈ  పాట. పింగళి మార్కు brevity కి ఒక మచ్చుతునక. 
5) ప్రేయసీ మనోహరి వరించి చేరవే: చిత్రం వారసత్వం సంగీతం ఘంటసాల. ఘంటసాల ఎంతగొప్ప గాయకుడో అంతకుతగ్గ సంగీతకర్తకూడా. పాటను జనరంజకంగా బాణి కట్టడం ఆయనకున్న ప్రత్యేకత. 
6) నన్ను వదలి నీవు పోలేవులే : చిత్రం మంచి మనసులు. సంగీతం కె.వి. మహదేవన్. హిందోళం లో స్వరపరచిన ఐ పాట ఒక classic. 
7) ఆకాశ వీధిలో అందాల జాబిలి : చిత్రం మాంగల్య బలం. సంగీతం మాస్టర్ వేణు. రచన శ్రీ శ్రీ పాటలో ఒక simplicity, innocence ఉన్నాయి. 
8) నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని: చిత్రం గులేబకావళి కథ , రచన సినారె,  సంగీతం  విజయ కృష్ణ మూర్తి.  సినారె తొలిపాట. పాటనిండా అందమైన పదబంధాల గుంఫనం పొందుపరిచాడు. కర్పూరం గంధం  గుబాళింపు అనుభూతినిస్తుంది ఈపాట 
9) మాధవా మాధవా నన్ను లాలించరా :  చిత్రం  శ్రీరామకథ (?) సంగీతం s p  కోదండపాణి. ఇది ఒక విలక్షణమైన  పాట. రాగం కళ్యాణ వాసంతం . 
10) సంగమం సంగమం : చిత్రం కోడెనాగు. సంగీతం  పెండ్యాల. last but not the least. ఈ  పాట ఒక చక్కని యుగళగీతం. ఘంటసాల గొంతు  అప్పటికే  పాడయింది. కానీ సుశీల గారు తన గాన మాధుర్యంతో more than compensate చేసింది.  it is one of my personal favourites. 
almost there: ఐనదేమో అయినది , నీ జిలుగుపైట నీడలోన నిలువనీ, పాడవేల రాధిక, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే.. the list continues..
అమ్మయ్య. ఎప్పటినుంచో ఘంటసాల సుశీల గార్ల పాటలను ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ  ఒక టపా వ్రాయాలి అనుకున్నాను. ఆ కోరిక తీరింది.