Tuesday, February 22, 2011

మలేషియా వాసుదేవన్ - కొన్ని మట్టి వాసనల గురుతులు.

మహా గాయకుడు కాదు. కానీ మంచి పాటగాడు. open voice తో,బలమైన గొంతుతో పాడేవాడు. ముఖ్యంగా మలేశియా + ఇళయరాజా + భారతి రాజా+ వైరముత్తు.. వీరి కలయికలో పల్లెటూరి పాట అంటే అది మట్టివాసన లాగా చుట్టుకుంటుంది. సహజంగా pretence లేకుండా పాడుతాడు.

వెళ్ళిపోయాడు. అయితేనేమి. పదుల సంఖ్యలో మంచిపాటలు పాడి వెళ్ళాడు.

నాకు అమితంగా నచ్చిన రెండు పాటలు గుర్తుచేసుకుంటాను.

తూరల్ నిన్ను పోచ్చి సినిమాలోని ’తంగ చంగిలి’ పాట ఒక గొప్ప యుగళగీతం.

out of this world orchestrization.

ఇళయరాజాకు కీరవాణి రాగం అంటే మహా ప్రీతి. మలేశియా, జానకి గారు పాటకు జీవం పోశారు.

కోళి కూవుదు చిత్రంలోని ’పూవే ఇళయపూవే’.  ఎంత గొప్ప పాట. ilayaraja  created such a masterpiece. మలేశియా చాలా చక్కగా పాడాడు.

ముదల్ మరియాదై చిత్రంలో పాటలు అజరామరాలు.

పత్రికలలో మలేశియా మరణవార్త చూశాక ఒక్కసారి ఆ ’పాత’ మధురాలు గుర్తుకొచ్చాయి.

thanks malaysia vasudevan గారు .

No comments:

Post a Comment