Tuesday, February 23, 2010

ఇళయరాజా టాప్ 10 పాటలలో ఒక్కటి

అవతారం(1995) అనే తమిళ్ చిత్రంలో ఒక ethnic/rustic flavourతో ఇసైగ్నాని స్వరపరచి జానకి గారితో కలిసి పాడిన ఈ పాట (తెండ్రల్ వందు తీండుం  బోదు-ఇళయరాజా -జానకి) . నా దృష్టిలో ఇది రాజా top 10లో ఉండాలి. ఈ సినిమాకు నటుడు నాజర్ దర్శకుడు. పాట చిత్రీకరణ కూడా బాగుంటుంది. ఇది ఏరాగమో నేను గుర్తించలేక పోయినాను. కానీ జాలంలో వెతికితే జోన్ పురి అని తెలిసింది. సువర్ణసుందరి సినిమాలో ’హాయిహాయిగా ఆమనిసాగే’ పాటలో ’చూడుమా చందమామ’ అన్న చరణం ఈ రాగంలో ఉన్నట్టు శంకా గారి లిస్టులో చూచాను. లోహాన్నైనా పుత్తడిగామార్చే ఆల్కెమీ రాజాకు తెలుసు.

Saturday, February 20, 2010

’హంసనాదం’ లో ఈ రెండు పాటలు

ముందు ’ఈ పాట’ (తెండ్రల్ వందు - జేసుదాసు, జానకి ) తదుపరి ’ఇదీ’  (సొర్గమే ఎండ్రాలుమ్ - ఇళయరాజా-జానకి-1990) వినండి. చిత్రీకరణను పట్టించుకోవద్దు.
హంసనాదం రాగాన్ని ఇళయరాజా చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా రాజా సంగీతంలో percussion instruments కు ఒక విశిష్టత కనిపిస్తుంది. ఎన్నిరకాల beats సృష్టించాడో. పైరెండు పాటలలో beat ను గమనించండి. హంసనాదంలో నాకు తెలిసి ’నీవు నేను వలచితిమీ’ అన్న బాలమురళి-సుశీల గార్లు పాడిన పాట కర్ణ సినిమాలో ఉంది. ఎమ్మెస్వీ సంగీతంలో. చాలా హృద్యమైన రాగం. బంటురీతి కొలువియ్యవయ్యరామ ప్రసిద్ధ కీర్తన.

ఒక చిన్నమాట:అంతగా హిట్టవ్వని ఒక చిరంజీవి సినిమాలో కూడా రాజా హంసనాదంలో ఒకగీతం స్వరపరిచాడు. tune బాగుంటుందికానీ వేటూరి మసాలా లిరిక్కులు బాగుండవు .

Thursday, February 18, 2010

బాలమురళి + ఇళయరాజా + రీతిగౌళ = ఒక మంచి పాట

ఈ అపురూపమైన పాట  బాలమురళీ, ఇళయరాజా ఇంకా కొన్ని పాటలకోసం కలిసి పనిచేసిఉంటే ఎంతబాగా ఉండేదో అనిపిస్తుంది. అసలు బాలమురళి గొంతును సినీపరిశ్రమ సరిగా వినియోగించుకోలేదు. అదొక తీరని వెలితి. ఒక విషయం ..
గొప్పగాయకులకు పాట (మధ్యలో వచ్చే సంగతులు కూడా) టేకాఫ్ ఎలా చేయాలి లాండింగ్ ఎక్కడచేయాలి అన్న విషయంమీద గట్టి పట్టు ఉంటుంది. నేను విన్నంతలో బాలమురళి, ఘంటసాల గారలకు ఈ విషయం లో సంపూర్ణ ఆధిపత్యం ఉంది.

ఈ రీతిగౌళ లోనే ఏదో లాగేసుకునే మాయ ఉంది (ఇదే విధంగా చాలా రాగాలవిషయంలో నాకు అనిపిస్తుంది). ఇప్పటికి ఇదిసత్యం. ఇదే సత్యం.

 ఇంతమంచి పాటలను కొత్తతరంవారు కూడా వినాలని నాకోరిక. ఏపాట అయినా సంగీతాన్ని, సాహిత్యాన్ని విడివిడిగానే ఆస్వాదించడం బాగుంటుంది. . టీనేజీలో వింటూ పెరిగిన తమిళ్/కన్నడ  పాటలు శాశ్వతంగా మనస్సులో తిష్ట వేశాయి. 

 :ఇదే  రాగంలో శేషశైలావాస గీతం, రామాకనవేమిరా పాట అందరికీ సుపరిచితమే.

Wednesday, January 27, 2010

ఒక కొంచెం మోదం ఇంచుక ఖేదం.




నేను అమితంగా అభిమానించే గొప్ప కళాకారులకు ’పద్మ’ బహుమతులు లభించటంతో ఆనందం పట్టలేకపోతున్నాను.
గత సంవత్సరం గానకోకిల ’సుశీల’ గారికి పద్మభూషణ్ లభించటంతో ఎంతోకాలంగా మనసులోఉన్న వెలితి తీరింది. అలాగే జానకి గారికి ఇవ్వాలి. ఆమెకు తమిళనాడు వారే బహుమతివచ్చేలా చూస్తారని నాకు నమ్మకమున్నది.

.
ఈ ఏడాది ఇసైగ్నాని ఇళయరాజాకు పద్మభూషణ్ ప్రకటించారు. చాలా సంతోషం. ఆయన స్థాయికి ఇంకా దాదాసాహెబ్ అవార్డు, భారత రత్న కూడా ఇవ్వాలి





అలాగే అన్నమయ్య పాటకే జీవితం అంకితం చేసిన శోభారాజు గారికి పద్మశ్రీ ఇవ్వటం ఆనందంగా ఉంది. ఇంకా బాలకృష్ణప్రసాద్ గారికి కూడా పద్మశ్రీ ఇవ్వల్సిఉంది.




అయితే ఒక వెలితి నాలో దాగిఉంది. కర్ణాటక సంగీత ప్రపంచానికే మహరాజు అయిన బాలమురళిగారికి భారతరత్న ఇవ్వటం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. వచ్చే ఏడాది కేంద్రప్రభుత్వం పై మన ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకురావాలి. ఆయన ఆనందంగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండి స్వంతంగా తీసుకోగలిగినప్పుడే భారతరత్న ఇవ్వాలి. పండిట్ భీమ్సేన్ జోశీకి ఇచ్చారు. ఆయనకంటే ఎంతో పైస్థాయికి చెందిన బాలమురళి కి ఇవ్వకపోవటం ఏమాత్రం ఆమోదయోగ్యంకాదు.


ప్ర్జజల రివార్డులే అవార్డులు అన్నమాట నిజమే అయినప్పటికినిన్నీ ఇటువంటి ఉత్తమశ్రేణి కళాకారులను సముచితంగా గౌరవించుకోవటం మనబాధ్యత. సరియైనసమయంలో వారిని సమ్మానించకపోవటం మహాపరాధమే.

Wednesday, January 20, 2010

సిక్కిం లో ఐదు రోజులు-1

గతవారంలో సిక్కిం రాష్ట్రానికి వెళ్ళటం జరిగింది. అక్కడి కొన్ని అంశాలు ప్రస్తావిస్తాను.

1) ముఖ్యంగా సిక్కింలోని cab drivers అక్కడి కొండలలోని బాగా దెబ్బతిన్న రోడ్లలో ప్రతిరోజూ జీవికకోసం బండిని నడపటం మనసుపై ముద్రవేసింది. ఒక రోజు చాంగో సరస్సు, నాధులా పాస్ వద్దకు వెళ్ళాము. our cab driver was quite a character. For no apparent reason, he was ecstatic. సగం గడ్డకట్టిన చాంగో సరస్సు ఒడ్డున అతన్ని చూడండి.

2) నాథులా బార్డర్ 14700 అడుగుల ఎత్తులో ఉంది. చలికాలం అవటం మూలాన -3 డిగ్రీలు ఉంది. అక్కడ మన ఆర్మీ వాళ్ళు కష్టమైన వాతావరణంలో పహరా కాస్తున్నారు. దగ్గరలోనే చైనా సైనికులు కొరకొరమని చూస్తున్నారు. వాళ్ళను photo తీయొద్దని మనవాళ్ళు చెప్పారు.

3)ఒహోం ఒహోం అనుకుంటూ గడ్డకట్టే చలిలో యం థాంగ్ లోయలోకి వెళుతూ
4) ఉత్తర సిక్కింలో తీస్తా నది వడివడిగా పరుగులు తీస్తూ..

సిక్కింకు వెళ్ళినతరువాతే టిబెట్ ఎంతముఖ్యమైన ప్రదేశమో కొంత అవగాహన వచ్చింది. తీస్తా, బ్రహ్మపుత్ర నదుల పుట్టినిల్లు టిబెట్. అపార ఖనిజవనరులకు స్థానంకూడాను. చైనావాడు అందుకే భల్లూకంపట్టు పట్టాడు. జలవిద్యుత్ ఉత్పత్తికి అపారమైన అవకాశం ఉంది ఈ పర్వత రాష్ట్రంలో. ఇప్పుడిప్పుడే మనవాళ్ళు రోడ్లు బాగుచేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పర్వత రహదారుల్లో ప్రయాణమంటే గుండెలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళాల్సిందే.