Friday, November 17, 2023

బహుదారి రాగం కృతులు - కొన్ని సంగీత విశేషాలు.

కొన్ని రాగాలకు ఒక్క కృతి ద్వారా ప్రాచుర్యం వస్తుంది. ఆయా రాగాల ప్రస్తావన వచ్చినప్పుడు ప్రసిద్ధమైన కీర్తనలు ప్రథమంగా తలపుకు వస్తాయి.

Eg. బ్రోవ భారమా - బహుదారి రాగం.

రఘువంశ సుధాంబుధి - కదన కుతూహల రాగం

వందనము రఘు నందన - శహన రాగం

బంటు రీతి కొలువు - హంస నాద రాగం

బహుదారి రాగంలో బ్రోవ భారమా అన్న త్యాగరాజ స్వామి కృతి బహుళ ప్రాచుర్యం పొందినది.

బహుదారి రాగం హరికాంభోజి రాగ జన్యము. షాడవ- ఔడవ రాగము. అనగా ఆరోహణలో ఆరు స్వరములు, అవరోహణలో ఐదు స్వరములు కలిగి ఉండును. రిషభము ఉండదు. 


పోలికలు ఉంటూనే విలక్షణమైన రూపం, స్వభావం కలిగి ఉండే ఏకోదరుల లాగా బహుదారి, నాగస్వరాళి, గంభీర నాట, తిలాంగ్ రాగాలకు కొంత సామ్యం ఉంటుంది. అయితే దేనికదే తమదైన ముద్ర, నడక, సొగసు కలిగి ఉంటాయి.


ఎన్. రమణి గారి వేణుగానం లో బ్రోవ భారమా కృతి. మధురంగా, రాగం ఆస్వాదించే విధంగా ఉంది.

----------

బ్రోవ భారమా రఘురామ !


భువనమెల్ల నీవై యుండ నన్నొకని 

బ్రోవ భారమా


శ్రీవాసుదేవ! అండకోట్లు 

కుక్షిని యుంచుకొనలేదా 


కలశాంబుధిలో దయతో నమరులకు 

గోపికలకై కొండలెత్తలేదా కరుణాసాగర 


త్యాగరాజుని బ్రోవ భారమా రఘురామ

-----------

భువనమెల్ల తానై యుండి,

చతుర్దశ భువనాలను కుక్షిలో నిలుపుకున్న, క్షీర సాగర మథనంలో దేవతల కోసం కూర్మ రూపం దాల్చి మందర పర్వతాన్ని మోసిన, గోపికలను, గోపకులాన్ని, గోవులను కుంభ వృష్టి నుంచి రక్షించుటకై గోవర్ధన గిరిని అలవోకగా చిటికెన వ్రేలుపై నిలిపిన స్వామికి నన్నొకని బ్రోవ భారమా అని ఈ కృతిలో త్యాగరాజ స్వామి భావన కనిపిస్తుంది.

----------

బహుదారి రాగం లో ఉన్న ఒక మంచి గీతం తారస పడినది.


శ్రీ యనమండ్ర శ్రీనివాస శర్మ గారు శ్రీ ఆది శంకరాచార్యుల వారిపై రచించి, స్వరపరచి గానం చేసిన సంస్కృత గీతం. 


జయ జయ శంకర హర భయమీశ్వర అన్న ఈ కృతి చాలా బాగా వచ్చింది. పాట సాహిత్యం అద్భుతం. 


న కర్మణా న ప్రజయా ధనేన

త్యాగేనైకే అమృతత్వమానశు:


అన్న కైవల్యోపనిషత్తు లోని సన్యాస సూక్తం లోని భావాన్ని ఈ కృతిలో అందంగా పొందుపరచారు.


శ్రీనివాస శర్మ గారు కర్ణాటక సంగీతంలో నిష్ణాతులు,వేద పండితులు ,సంస్కృత సాహితీ వేత్త , వాగ్గేయకారులు, సనాతన ధర్మ ప్రవచన కర్త,  బహుముఖ ప్రజ్ఞాశాలి అని వారి యూట్యూబ్ చానెల్ లో ఉన్న అనేక వీడియోల ద్వారా అవగతం అవుతుంది. 

--------

ఇరబేకు హరిదాసర సంగ - పురందర దాసు కీర్తన - బహుదారి రాగం - గానం రంజని గాయత్రి sisters . Pleasant rendition.

-----------

పక్క వాయిద్యాలు తగినంత మేరకు వినిపించినప్పుడు శ్రోతలకు మరింత ఆనందం కలుగుతుంది. ప్రధాన సంగీత కారుని పక్కవాయిద్యం అనుగమించాలి కానీ అధిగమించ కూడదు. ఇది ప్రధాన మైన అంశం.


Setting the audio volume for the main artist and supporting instrumentalists plays a very important role in the concert. Sometimes we see the main artist voice getting drowned in the din of the accompanying instruments. This mars the experience of listeners. Auditorium with good acoustic quality, sound system, and experienced artistes with perfect understanding will enhance the experience of listeners.







 


 





No comments:

Post a Comment