Saturday, October 12, 2024

బొల్లోజు బాబా గారు సనాతన ధర్మం అంశం పై వ్రాసిన పోస్టు - నా సమాధానం

 

బాబా గారి పోస్టు లింకు -


సనాతన ధర్మం అంటే ఏమిటి? - కొన్ని చర్చనీయాంశాలు


ఆ బ్లాగులో పోస్టు చేసిన నా సమాధానం. మరికొన్ని అంశాలు జోడించడం జరిగింది.

-------

అయిష్టంగా నైనా సనాతన ధర్మం మానవాళికి అందించిన కొన్ని గొప్ప విషయాలను ఏకరువు పెట్టారు. సంతోషం.

అయితే సనాతన ధర్మాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం, బ్రాహ్మణ వ్యతిరేక భావనల వ్యాప్తి వ్యాసం ఉద్దేశ్యంగా కనబడుతుంది. 


1) వేదరాశిని పరమ పవిత్రంగా, పరమ ప్రామాణ్యంగా స్వీకరించడం, గోవులను మాతృ భావంతో వ్యవహరించడం, గోసంరక్షణ సనాతనధర్మంలో  అతి ముఖ్యమైన అంశాలు. 


2) పునర్జన్మ సిద్ధాంతం హిందువులు విశ్వసిస్తారు. మరణానంతరం జీవాత్మ  ప్రయాణం గురించి సనాతన ధర్మాన్ని ఆచరించేవారి విశ్వాసాన్ని చార్వాకులు అంగీకరించక పోతే పోనివ్వండి. సమాజం లో అందరూ ఏకాభిప్రాయం ఉండాలని లేదు  కదా. ఇందులో బలవంత మేమీ లేదు.


చాగంటి, సామవేదం వంటి సనాతన ధర్మ ఆచార్యుల ప్రవచనం అనేకమంది ఇష్టపడి సాత్విక ధార్మిక భావాలు అలవరచుకుంటున్నారు. ధర్మచార్యుల బోధనలతో హైందవ సమాజానికి ధర్మ మార్గ నిర్దేశ్యం చేస్తున్నారు. ప్రకృతిలోని అణువణువు లో పరమాత్మను దర్శించి ఆరాధించే దర్శనం సనాతన ధర్మం అందిస్తున్నది. అయితే


కొంతమందికి రాం గోపాల్ వర్మ వంటి వారి భావాలు ఇష్టం కావచ్చు. మరికొందరికి గోగినేని బాబు అభిప్రాయాలు ప్రియం కావచ్చు. ఎవరి స్వభావం అనుసరించి వారికి ఆయా మార్గాలు నచ్చుతాయి. లోకో భిన్న రుచి:


3) ప్రపంచ వ్యాప్తంగా శాఖాహారం పట్ల సానుకూల భావన, స్వీకరించే వారి సంఖ్య పెరుగుతున్నది. ఆరోగ్య రీత్యా, మానవ శరీర నిర్మాణ రీత్యా, జీవ హింస దృష్ట్యా మాంసాహారం కంటే శాఖాహారం మంచిది అన్న విషయం అనేక పరిశోధన లలో తెలుస్తుంది. మానవాళి సాత్విక ఆహార అలవాట్లు దిశగా మళ్లటం మంచిదే కదా. హిందువులకు పరమ పవిత్రమైన గోమాత ను హింసించడం, గోమాంస భక్షణ చేయడం  అత్యంత క్లేశం కలిగిస్తుంది. అందుకే రాజ్యాంగం లో కూడా గో సంరక్షణ కోసం ఇలా పొందుపరిచారు


Article 48 of the Constitution of India States that the State shall endeavour to organise agriculture and animal husbandry on modern and scientific lines and shall, in particular, take steps for preserving and improving the breeds, and prohibiting the slaughter, of cows and calves and other milch and draught cattle.


నిజానికి మేకలు, గొర్రెలు వంటి జంతువులను కూడా సంరక్షించుకోవడం బాగుంటుంది. అయితే సమాజం లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వీలైనంత తక్కువ జీవహింస చేయడం ధర్మం మానవాళికి శ్రేయోదాయకం అవుతుంది.


4) వర్ణ వ్యవస్థ : చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ: అని భగవద్గీత లో ఉంది. గుణము కర్మ బట్టి వర్ణ విభజన అని గీతాచార్యుడు తెలిపాడు. అయితే దేశ కాల పరిస్థితులను అనుసరించి వర్ణ వివక్ష జరిగి ఉండవచ్చు. ఒక్క భారత దేశం లోనే కాదు ప్రతి దేశం లో ప్రతి మతావలంబీకులలో కూడా ఏదో ఒక రూపంలో వివక్ష అనేది కనబడుతుంది. దానికి వ్యతిరేకంగా సంఘ సంస్కర్తలు చేసిన పోరాటం కనబడుతుంది. 

మనుస్మృతి లోని అభ్యంతర కరమైన విషయాలను హైందవ సమాజం నిరాకరిస్తుంది. Most of Hindu society has moved on by reforming  itself. A few leftist pseudo secular self declared  intellectuals refuse to acknowledge this and try to harp on non existent issues. ఆదిశంకరులు , రామానుజులు వంటి ఆచార్యులు కాలం నుండి, గాంధీ, అంబేద్కర్ వంటి నాయకులు కృషి వల్ల చాలావరకు వర్ణ వివక్ష అనేది ప్రస్తుత కాలంలో తగ్గిపోయింది. దళితులకు స్వతంత్ర భారత రాజ్యాంగంలో అనేక రక్షణలు కల్పించ బడ్డాయి. హైందవ సమాజంలో సమస్యలు లేవని కాదు. అయితే కొన్ని విభేదాలు, వైరుధ్యాలు ఉన్నప్పటికీ సూత్రే మణిగణా ఇవ అన్నట్లు సనాతన ధర్మం అంతస్సూత్రం గా ఒకటిగా ఉంచుతున్నది.


నిజానికి అనేక రాష్ట్రాలలో ప్రస్తుతం బ్రాహ్మణులు ఆర్థికంగా సామాజికంగా వివక్ష, దాడులకు గురి అవుతున్నారు. పౌరోహిత్యం  వృత్తి లో ఉన్న వారు, డిల్లీ వంటి చోట రిక్షా నడుపుకునే బ్రాహ్మణులు, ఎటువంటి రిజర్వేషన్లు లేక చిన్న చితక పనులు చేసుకుంటున్న బ్రాహ్మణులు, ఆర్థికంగా, సామాజికం గా దుర్భర పరిస్థితుల్లో ఉన్న GC కులాల వారు మేధావులకు కనిపించరా ?


GC Hindus and especially Brahmins are being discriminated against now. 


5) పితృ దేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు చేయడం అన్నది సనాతన ధర్మం లో ముఖ్య భాగం. ఏదో ఒక విధానం లో మరణించిన వారి పట్ల కృతజ్ఞతతో, వారికి ఆత్మ శాంతికోసం దాన ధర్మాలు, రిచువల్స్, ప్రార్థనలు చేయడం, అన్న సంతర్పణ చేయడం అన్ని మతాల లోనూ ఉంది. హిందువులలో వారి వారి సంప్రదాయం అనుసరించి శ్రాద్ధ కర్మలు నిర్వహించుకుంటారు. వారి విశ్వాసం పట్ల ఇతరులకు అభ్యంతరం ఎందుకు ? ఒక ప్రాణిగా కాకికి పిండం తినిపిస్తే తప్పేముంది. హిందువుల సంప్రదాయాలను చులకన చేయడం ఎందుకు ?


యోగి వేమన ఒక అవధూత స్థాయికి చెందిన వ్యక్తి. ఆయన చెప్పిన మాటను సందర్భం బట్టి అన్వయించుకోవాలి. ఆయన లాగా సర్వ సంగ పరిత్యాగి యైన వారికి  ఆచార వ్యవహార నియమాలు వర్తించవు. సామాన్యులు ఆచారాలను కట్టుబాట్లను వదిలివేస్తే సమాజం పతనమౌతుంది.


5) స్త్రీ మూర్తికి సనాతన ధర్మం అత్యున్నత స్థానం కల్పించింది. దైవాన్ని మాతృమూర్తి గా, శక్తి స్వరూపిణి గా భావన చేసి ఆరాధించే విధానం కేవలం సనాతన ధర్మం లో మాత్రమే ఉంది. స్వభావ, శారీరిక, సమాజ పరిస్థితుల దృష్ట్యా కొన్ని నియమాలు, ఆచారాలను ఏర్పరిచారు. అవి కాలానుగుణంగా మార్పులు చెందుతూ సంస్కరణలు జరిగాయి.


6) పురుషసూక్తములోని “ బ్రాహ్మణో స్య ముఖమాసీత్ బాహూ రాజన్య: కృతః/ఊరూ తథస్య యద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్ర: అజాయత" అనే శ్లోకం వివరిస్తుంది. బ్రాహ్మణుడు మహాపురుషుని ముఖంనుండి, క్షత్రియుడు భుజాలనుండి, వైశ్యుడు తొడలనుండి, శూద్రుడు పాదాల నుండి ఉద్భవించారని అర్ధం. More than in the literal meaning, it has to understood as a symbolic description.


ఈ శ్లోకాన్ని పరిశీలిస్తే సమాజం అనే పిరమిడ్ నిర్మాణం గోచరిస్తుంది. ఈ శ్లోకాన్ని కుల దృష్టితో చూడడం సరికాదు. శరీరం లోని అన్ని భాగాలు సమానమే. ముఖ్యమే.


ధర్మాన్ని బోధించి నిలబెట్టేవారు, సమాజానికి మార్గ నిర్దేశనం చేసే వారు ఒక వర్గం. దేశాన్ని ప్రజలను రక్షించి క్రమ శిక్షణతో ఉంచే వారు, శత్రువులను, దుర్మార్గులను శిక్షించే వారు ఒక వర్గం. వ్యవసాయం, వర్తకం చేసి ప్రజలను పోషించే వారు ఒక వర్గం, వివిధ మార్గాలలో శారీరిక శ్రమ, కృషి చేస్తూ సమాజానికి పునాది వంటి వారు ఒక వర్గం. పాదాల నుంచి ఉద్భవించిన వారు ముఖ్యమైన వర్గం. కార్మిక వర్గం లేని సమాజం కుప్ప కూలిపోతుంది. ఏ దేవతకైనా గురువుకైనా పాదాలకు నమస్కరించడం, పూజ చేయడం సనాతన ధర్మంలో  భాగం. పాదములకు సామాన్య లోక వ్యవహారం లోని అర్థాన్ని పై శ్లోకాన్ని అన్వయించడం సరికాదు. అందువల్ల పురుష సూక్తం లోని పై శ్లోకాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రోత్రియ బ్రాహ్మణులకు ధర్మ శాస్త్రాలు కఠినమైన నియమాలు, ఆచారాలు , విహితకర్మలు విధించాయి.


7) కర్మ సిద్ధాంతం అవగాహన చేసుకోవడం కష్టం. గహనా కర్మణో గతి: అని గీత లో ఉంది. కర్మ ఫలితం ఎప్పుడు లభిస్తుంది అన్నది చెప్పటం కష్టం. కర్మ సిద్ధాంతం హిందువులు నమ్ముతారు. ఆ విధంగా కష్టాలను సుఖాలను సమ దృష్టితో స్వీకరించే అవకాశం ఉంటుంది. బాధలు అనుభవిస్తున్న వారు నా కర్మ ఇంతే అని ఉండిపోరు. కష్టాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే పోరాటం చేస్తారు. కేవలం ఫలితం మీదే దృష్టి ఉంచకుండా కర్మలను కుశలత తో చేయమని గీత బోధిస్తుంది. ఫలితం ఒక్కోసారి అనుకూలం కావచ్చు కాకపోవచ్చు.

కర్మ సిద్ధాంతం పై నమ్మకం లేనివారు తమ అభీష్టం ప్రకారం జీవిస్తారు. ఇందులో వివాదానికి చోటెక్కడ.

8) వివిధ గ్రామ దేవతలు, గిరిజన దేవతలు కుల దేవతలు కూడా సనాతన ధర్మంలో భాగమే. ఈనాటికీ గిరిజనులు, గ్రామీణులు తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ సంప్రదాయాలను ఏ ధర్మాచర్యుడు నిరాకరించలేదు. అయితే గాసట బీసట గా ఉన్న ఆరాధనా పద్ధతులను ఒకరి కొకరు కలహించు కాకుండా ఆదిశంకరాచార్యులు పంచాయతనం పూజా విధానం స్థిరపరిచారు. షణ్మత స్థాపనాచార్య అని పిలిచారు. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య , సౌర, స్కంద అని ఆరు శాఖలు గా హిందూ దేవతల ఆరాధన ను వర్గీకరించారు. అయితే వేదాలు, పురాణాల ఆధారంగా ప్రధాన దేవతల ఆరాధన కొనసాగుతుంది. ఇతర దేవతా మూర్తులు వారి వారి సంప్రదాయం అనుసరించి చేసుకుంటున్నారు. హిందువులలో ఎవరికీ ఈ విషయం లో పేచీ లేదు. కేవలం కువిమర్శకులకు హిందూ వ్యతిరేకులకే సమస్యగా కనిపిస్తుంది.


హిందువులు మైనారిటీ గా మారితే భారత దేశం పరిస్థితి ఏమౌతుందో ఒకసారి ఊహించండి. India is secular in nature because of Hinduism and Sanatan Dharma. The so called critics cannot even raise a single issue about other religions.


సనాతన ధర్మం అందించిన జ్ఞానరాశి, అద్భుత సాహిత్యం, కళలు, గో సంరక్షణ, అన్య మతాలపట్ల సహనం, గౌరవం, యోగ, ఆయుర్వేదం, ఇత్యాది గొప్ప విషయాలు సకల మానవాళికి అందించిన అమూల్య సంపద . స్మృతులు లేక శాస్త్రాలలో అందించిన గొప్ప సమాజ హితమైన ధార్మికమైన భావనలను స్వీకరించుదాము. ఆమోదయోగ్యం కాని అంశాలను వదిలి వెద్దాము. న అన్య: పంథా అయనాయ విద్యతే.


నాకు చేతనైన విధంగా సనాతన ధర్మం పై మీ అపోహలను తొలగించే ప్రయత్నం చేశాను. అందులో తప్పులుంటే అంగీకరించడానికి, మార్చుకోవడానికి సిద్ధం.


Hope you read with open mind. Prejudice will blind one's vision.


సర్వే జనా సుఖినోభవంతు 🙏





Tuesday, October 1, 2024

దేవులపల్లి కృష్ణశాస్త్రి సినీ గీతాలు


Great masters.

Their work is laden with finesse. Emanates an unmissable radiance. Has a natural fragrance.

కృష్ణశాస్త్రి గారు వ్రాసిన సినీ గీతాలకు ప్రత్యేకత ఉంది.  దేవులపల్లి పల్లవులు వెంటనే ఆకట్టుకుంటాయి. ఎత్తుగడలు సంభాషణ రూపం లో విలక్షణంగా ఉంటాయి. 

సరళమైన భాష. లోతైన భావం.

సందర్భానికి తగినట్లుగా,  తెరపై కనిపించే పాత్రలు సహజంగా పాడుతున్నారు అనిపిస్తాయి. దర్శకుడి ఆలోచనను ఆవిష్కరించే విధంగా ఉంటాయి. 

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, మల్లాది రామకృష్ణశాస్త్రి గారు ఇరువురికి అచ్చ తెనుగు పదాలతో పాటలు అలవోకగా వ్రాయడం ఇష్టం కావచ్చు.  అయితే అద్భుత సంస్కృత గీతాలు కూడా వ్రాయగలిగిన మహా పండితులు.

ఆయనచేత మరిన్ని సినీ గీతాలు వ్రాయించుకొని ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది.

మల్లీశ్వరి చిత్రం లోని అన్ని పాటలు golden classics గా నిలిచి పోయాయి.

కొన్ని పాటల పల్లవులు 

--------------

తెరచి ఉంచేవు సుమా పొరబడి నీ హృదయము,  బిర బిరా ఏ సుందరియో చొరబడితే ప్రమాదము (ధనవంతులు గుణవంతులు)

 - who else can write such lines🙏

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు -(ఈ నాటి బంధం ఏనాటిదో ) 

ఎదుటనుంచి కదలను పదములింక వదలను కళ్లకు నా చిన్న తండ్రి కనిపించే తీరాలి (వాడే వీడు) - gem of a song. Excellent tune by satyam in suddha saranga /bangala ragam.

కుశలమా నీకు కుశలమేనా (బలి పీఠం)- probably GOAT.

ఘనా ఘన సుందరా, సడిసేయకో గాలి, రావమ్మా మహాలక్ష్మీ, ఆకులో ఆకునై, ముందు తెలిసినా ప్రభూ, ఈ గంగ కెంత దిగులు, ప్రతిరాత్రి వసంత రాత్రి, ఇది మల్లెల వేళయని, చీకటి వెలుగుల...

కొలువైతివా రంగశాయి గీతం కూడా దేవుల పల్లి రచన అని తెలుస్తుంది. ఇది సంప్రదాయ కీర్తన కాబోలు అనిపించేది.

కొలువైతివా... రంగశాయి...

చరణం 1:

సిరి మదిలో పూచి తరచి రాగము రేపి చిరునవ్వు విరజాజులేవోయి..ఏవోయి...

కొలువైతివా... రంగశాయి..

చరణం 2:

సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట

పరచేటి ఎలదేటులేవోయి... ఏవోయి

కొలువైతివా... రంగశాయి...

చరణం 3:

ఔరా.. ఔరౌరా......

రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి

వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి

సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి

ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి

జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి

ముజ్జగములు మోహంబున తిలకింపగ.. పులకింపగ

శ్రీ రంగ మందిర నవసుందరా పరా కొలువైతివా... రంగశాయి...హాయి..కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి

కొలువైతివా... రంగశాయి

----------------------

జయ జయ జయ ప్రియ భారత

జనయిత్రి - భరత మాత ను కీర్తిస్తూ రచించిన సుందర సుమధుర సంస్కృత గీతం. అందులో లాక్షారుణ పదయుగళా అన్న పదం అద్భుతం. పాదాలకు ఎర్రని పారాణితో భరతమాత ఎదురుగా వెలసిన భావన కలుగుతుంది 

పల్లవి :

జయ జయ జయ ప్రియ భారత

జనయిత్రి దివ్యధాత్రి

జయ జయ జయ శత సహస్ర

నరనారీ హృదయనేత్రి ||| జయ జయ జయ |||


చరణం 1 :

జయ జయ సశ్యామల

సుశ్యామచలచ్చేలాంచల

జయ వసంత కుసుమ లతా

చలిత లలిత చూర్ణకుంతల

జయ మదీయ హృదయాశయ

లాక్షారుణ పద యుగళ ||| జయ జయ జయ |||


చరణం 2 :

జయ దిశాంత గత శకుంత

దివ్యగాన పరితోషణ

జయ గాయక వైతాళిక

గళ విశాల పద విహరణ

జయ మదీయ మధుర గేయ

చుంబిత సుందర చరణ |||

జయ జయ జయ |||

దేవులపల్లిగారి విశాల సాహితీ క్షేత్రం లో సినీ గీతాలు మల్లె తీగల వంటివి.  పుస్తకంలో ఒక అధ్యాయం వంటిది అని చెప్పవచ్చు. 

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?చంద్రికలనేల వెదజల్లు చందమామ?ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను? 

(ఏల ప్రేమింతును? - కృష్ణ పక్షము)

🙏


Friday, August 2, 2024

తోబా తోబా - a peppy song - సంగీత కబుర్లు

Bad News అనే ఒక కొత్త హిందీ సినిమా లో ఒక పాట chartbuster అయ్యింది. కొత్త పాటలతో అంతగా టచ్ లో లేకపోయినా కొన్ని పాటలు ఏదో ఒక దారిలో చెవిని చేరుతుంటాయి. 

ఈ పాట విన్నాను. బాగుంది. పంజాబీ లిరిక్స్ అనుకుంటాను. పాట బాణీ బాగుంది. I really liked the musician singer's (Karan aujla) effort in creating  a peppy song without losing melody -turns out to be based on raag keer vani. Especially notable is the filler music bits. 

I always like the song to have gaps and music bits to complement the words. Nowadays we get to listen to rap style songs. వేగంగా మాటల మధ్య విరామం లేకుండా దండకం లాగా కంపోజ్ చేస్తున్నారు. 

అసలు ఈ  పాట గురించి నాకు తెలియదు. అయితే  క్రికెటర్ మురళీధరన్ డాన్స్ చేస్తున్నాడు అని ఒక  వీడియో వైరల్ అయ్యింది. తీరా చూస్తే అది మురళీ ధరన్ కాదు కిరణ్ అనే కొరియోగ్రాఫర్ అని తెలిసింది. చాలా బాగా డాన్స్ కంపోజ్ చేశాడు.

In fact this short video is beautiful. Everyone started searching for the name of the dancer. His moment of glory seems to have arrived now.

The original song in the movie.

కీరవాణి రాగం లో  రెండు all time classic Hindi పాటలు.

1) పుకార్ తా చలా హూ మై

Movie: Mere Sanam (1965) Song: Pukarta Chala Hoon Main Starcast: Asha Parekh, Biswajit Chatterjee Singer: Mohd.Rafi Music Director: O.P.Nayyar

2) కిసీ కే ముస్క్ రాహటో మే 

Movie: Anari (1959) Song: Kisi Ki Muskurahaton Pe Ho Nisar Starcast: Raj Kapoor, Nutan Singer: Mukesh

Music Director: Shankar Jaikishan

One of my all time favorites.

బహుశా ఈ పాట స్ఫూర్తి తోనేమో 

పాట్టు పాడవా అన్న ఈ తమిళ పాట వచ్చింది. 

Gemini Ganesan , Vaijayanti mala

Music and singer - A M Rajah.

Ten nilavu movie - 1961

A beautiful song indeed. We can observe the beautiful music bits and words following contiguosly.

Sunday, June 16, 2024

జేబులో బొమ్మ - అచ్చయిన ఒక కవిత - తాత్త్విక ముచ్చట్లు

16-6-2024 ఆదివారం సాక్షి ఫన్ డే లో కవితల పేజీలో నేను వ్రాసిన ఒక రచన అచ్చయింది.


--------------

జేబులో బొమ్మ


చీకటిని స్పష్టంగా చూడగల చూపు

అంతటా ఉన్న ఆకాశం కోసం వెతుకుతుంది.


వెనక వెలిగే జ్యోతి

ముందున్న తెరపై బొమ్మను చూపిస్తుంది.


కలలో ఆడిన బొమ్మ 

మెలకువలో కరిగిపోతుంది. 


ఎగసిపడిన అల 

సాగరంలో కలిసిపోతుంది.


జాగ్రత్ స్వప్నాలలో ఆడుకునే అజ్ఞానం 

సుషుప్తిలో బ్రేక్ తీసుకుంటుంది.


అజన్మాంతం మూడుముక్కలాట 

సాగుతూ ఉంటుంది


ఘటం లోకి ఆకాశం ఆకాశం లోనికి ఘటం

నిరంతరంగా దూరుతుంటాయి.


అద్దంలో తన పగటి వేషం చూసి 

ఆత్మ నవ్వుకుంటుంది.


ఆర్టిస్టు బహుముఖంగా  

సైంటిస్టు బహిర్ముఖుడై వెతికే సత్యం

చివరికి జేబులో బొమ్మై దొరుకుతుంది.

----------------


ఈ రచనలో భావాలు శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారి అద్వైత ప్రవచనాల స్ఫూర్తితో వ్రాసినవి. గురువుగారు వివరించే తీరు , తీసుకునే ఉదాహరణలు అద్భుతం.



ముఖ్యంగా బాహ్య ప్రపంచంలో సత్యం కోసం అన్వేషకులుగా అనేక మార్గాలలో ప్రయత్నం చేస్తున్నాము.


కళాకారుడు నాదంలో, నాట్యంలో, చిత్రలేఖనంలో ఇంకా ఏదో ఒక కళ ద్వారా వెతుకుతుంటాడు. 


భాషా పండితుడు, భావుకుడు సాహిత్యంలో కృషి చేస్తూ ఉంటాడు.


శాస్త్రవేత్త ఇంకో వైపు నుంచి చేసే అన్వేషణ పరమాణువు నుంచి విశాల విశ్వం దాకా సాగుతుంది. 


భక్తులు, యజ్ఞ కర్మలు, సమాజసేవ చేసేవారు, యోగ సాధకులు, కర్మిష్టులు వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. 


వీరికి భిన్నంగా తాత్వికులు, ఋషులు అంతర్ముఖులై సత్యాన్వేషణ సాగిస్తారు.


వారి వారి సాధనలకు అనుగుణంగా పాక్షిక సత్యాలు ఆవిష్కరింప బడతాయి. 


అంతటితో ఆగక universal truth అనుభవం అయ్యేదాకా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.


కొందరి ప్రయాణం నల్లేరు మీద బండి నడక లాగా, కొందరిది నత్త నడకన సాగినట్లు అనిపిస్తుంది.


తెలిసి సాగేవారు కొందరు. తెలియక ప్రవాహంలో పడి పోయేవారు కొందరు. ఊరి బయట కొండ ఎక్కి ఇదే బెస్టు, లేదు ఎవరెస్టు అనేవారు కొందరు. 


కొందరిది పురోగమనం కొందరిది తిరోగమనం. ఏది ఏమైనా ప్రయాణం తప్పదు. రంగుల రాట్నం ఎక్కి కూర్చున్నాక తిరగక తప్పదు. ఆట ముగిసిన తరువాత దిగక తప్పదు.


అలలు ఎంత ఎగసిపడినా చివరకు కడలి ఒడిలో చేరి విశ్రమించ వలసిందే.


చంకలో పిల్లాణ్ణి పెట్టుకుని ఊరంతా వెతుకుతూ ఉందాము. 


ఆనందంగా గజస్నానం చేసుకుందాము.


రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కు వేసుకుందాము.


Journey continues from lower truth to higher truth.








Wednesday, June 12, 2024

రామోజీ రావు గారు

తెలుగు ప్రజల దైనందిక జీవితాలలో దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రముఖ మీడియా అధిపతి, వ్యాపార వేత్త రామోజీరావు గారు ప్రభావం చూపారు.

ఆయన ఒక విజయవంతమైన వ్యాపారవేత్త, మీడియా అధిపతి, సంపాదకుడు, రాజకీయాలను, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చెయ్యగలిగిన శక్తి, చేసిన వ్యక్తి. 


Discipline, hard work,fierce ambition, chutzpah  and socio political clout and support. This is a unbeatable combination. Man with a Midas touch.


Some thoughts. These are only my observations as I understood them over a long period of time. Normally as is my wont, I like to see both sides of a coin. It is my endeavour to present a balanced view. 


ఈనాడు వార్తా పత్రిక , ఈ టీవీ, Film city: ఈ మూడింటినీ వ్యాపార పరంగా, సాంకేతికంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. ప్రజాదరణ పొందారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. మార్గదర్శి గా నిలిచారు. 


Was he politically neutral ? No. In fact, it may not be possible or even required for anyone  including a media house to maintain total neutrality. ఎంత లేదనుకున్నా ఎంతో కొంత bias అనేది ఉంటుంది. Nothing wrong in taking a political stance. At the same time, criticism should be based on issues and not personal dislike. Unfortunately the political narrative has vitiated the atmosphere and media started playing an unhealthy role.


There will be strengths and faults in every political party or leader. Criticize mistakes and appreciate good deeds irrespective of parties.


Instead Telugu media is often working like mouthpiece of particular political parties  and has lost credibility.


This tendency is not specific to any one paper or channel. Almost all media houses seem to be inclined to one  political party or the other due to some reasons which are best left unsaid.


Whether we like it or not that is how system runs. 


తెలుగు మీడియాలో ఉన్న ఈ పెడ ధోరణి వల్ల  విశ్వసనీయత కోల్పోయింది అనిపిస్తుంది. 


అయితే వినోద కార్యక్రమాలు,భక్తి, ఆధ్యాత్మికం, ఆరోగ్య, వైజ్ఞానిక, వ్యవసాయం, సాహిత్యం.. ఇటువంటి అంశాలలో తెలుగు చానెళ్లు, పత్రికల పనితీరు బాగానే ఉంది. శాస్త్రీయ సంగీతం విషయం లో ఒక్క ఆకాశవాణి, దూరదర్శన్ మాత్రమే ఆదరిస్తున్నాయి.


ఉషాకిరణ్ మూవీస్: ఈ బ్యానర్ పై అనేక చిత్రాలు నిర్మించారు. అందులో మయూరి, ప్రతిఘటన ఈ రెండు మాత్రమే చెప్పుకోదగ్గ చిత్రాలు అని నా అభిప్రాయం. 


Chit funds :  Somehow I am not convinced about either chit funds or stock market / shares business. But both are popular investment choices.  People are investing heavily in share market.


Certain issues were raised by Vundavalli Arun Kumar regarding Margadarshi chit funds. 


Pickles: No doubt Priya pickles are very popular ముఖ్యంగా బ్రహ్మచారులకు ప్రియ పచ్చల్లతో అనుబంధం ఉంటుంది. అయితే ఇంటి పచ్చళ్ళు అలవాటైన వారికి బయట అమ్మే ఊరగాయలు అంతగా నచ్చవు. 90s లో వామన్ పికిల్స్ అని వచ్చేవి. నిజానికి ప్రియ పచ్చళ్ళ కంటే రుచిగా ఉండేవి. ఎందుకో తెలియదు ఆ బ్రాండు ఆగిపోయింది.


Film city: సినీ పరిశ్రమకు, సంబంధించిన అన్ని సౌకర్యాలు స్టూడియోలు, ఒకే చోట పిలిం సిటీలో నెలకొల్పడం జరిగింది. అది విజయవంతంగా నడుస్తున్నది.


I never visited the film City as I felt the ticket price is high. I lost interest. In my opinion food should be included in the ticket price as it is quite high. 


I don't know why but I keep revisiting the following thought.


Why any individual or organisation or entity tends to be hegemonic? 

It boils down to the fundamental nature of consciousness which wants to expand infinitely, stay forever and be always happy. Scale of identification decides the effect.


Prof. నాగేశ్వర్ గారు రామోజీ గారిపై ఒక చక్కటి  వీడియో చేశారు. As per Nageshwar garu, Ramoji Rao garu used to maintain very good personal relations with many people. He was a true journalist.  He earned respect of even those who opposed him. He was a disciplined person and continued to work for his set goals even in ripe old age. He was interested in literature, Indian culture and traditions.


People may not agree with him on some  issues. Still they can learn many good things from the life of Ramoji garu. He was a great institution builder.


🙏

Tuesday, June 4, 2024

ఆంధ్ర శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు

ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం + జనసేన + బీజేపీ  కూటమి అపూర్వమైన ఘన విజయం సాధించింది. వైకాపాను జగన్ పాలనను ఆంధ్ర ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. 

కూటమి విజయం లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. కష్ట సమయం లో తెదేపాకు అండగా నిలిచాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు బీజేపీని కూటమిలో చేరేలా ఒప్పించాడు. అవమానాలు, నిందలు భరించి,  తక్కువ సీట్లు ఇచ్చినా ఒప్పుకుని రాజకీయ పరిణితితో, వ్యూహ రచన చేశాడు. జనసేన పోటీ చేసిన   21 స్థానాలలో 100 % విజయం సాధించాడు. కొత్త ప్రభుత్వంలో తనకు ముఖ్యమైన పదవి వస్తుంది. He totally deserves it.


ప్రొ. నాగేశ్వర్ చెప్పినట్లు ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ man of the match and man of the series  గా నిలిచాడు. He gave a fitting reply to all his critics including common people like me.


వైకాపా ఐదేళ్ల పాలన ప్రత్యక్షంగా తెలియదు కానీ కొన్ని + లు అలాగే - లు ఉన్నాయి అని స్పష్ట మవుతుంది.


విశ్లేషకులు జగన్ ప్రభుత్వ పనితీరు గురించి విశ్లేషణలు, సూచనలు చేస్తూనే ఉన్నారు. Some of the


+Ves

1. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దనే వాలంటీర్లు ద్వారా పెన్షన్లు ప్రతినెలా ఇవ్వడం ✔️

2. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు మెరుగు పరచడం✔️

3. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ద్వారా వివిధ ప్రభుత్వ సేవలు ✔️

4. Social Engineering ✔️


 -ves

1. Proposal of three capitals in place of Amaravati - himalayan blunder. ✖️


I think this is the single most unacceptable decision of Jagan which was rejected by one and all.

2. No real role to ministers, MLAs and MPs. ✖️ 

3. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు మధ్య అనుబంధం తగ్గిపోవడం. Disconnect between lawmakers and people.✖️

4. Sand, liquor policies land titling act etc. ✖️


There may be some other issues too.


ప్రొ. నాగేశ్వర్ గారు ఇలా అన్నారు. ప్రజలు అవినీతిని అయినా భరిస్తారు కానీ అహంకారాన్ని భరించలేరు.


అందరూ ఒప్పుకుని అమరావతి లో నిర్ణయించిన రాజధానిని మార్చాలని తీసుకున్న నిర్ణయం ప్రజలు ఎంతమాత్రం ఒప్పుకోలేదు.


గత ఐదేళ్ల గా ఇస్తున్న సంక్షేమ పథకాలకు సాలీనా సుమారుగా రు. 70000 కోట్లు అవుతున్నాయి అంటున్నారు. అయితే తెదేపా + జనసేన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఏడాదికి 1,25,000 కోట్లు అవసరం అవుతాయి అని అంచనా. Is it possible or desirable ? Welfare schemes and freebies have to be given only to deserving and needy individuals.


E.g. free bus travel to all women is not a good promise. 


A simple capital existing at Amaravati is enough. No need for unnecessary high rise buildings. The available excess land can be utilised for green cover, water harvesting etc.


అయితే ఇప్పుడు nda కూటమి ప్రభుత్వం ఏర్పాటులో తెలుగు దేశం, CBN ముఖ్య పాత్ర పోషించే అవకాశం వచ్చింది. Nda ప్రభుత్వం ఏర్పాటుకు తెలుగు దేశం ఎంపీ లు మద్దతు కీలకం. అందువల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం , ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం సరిదిద్దడానికి, నిధుల కేటాయింపులకు, స్టీలు ప్లాంటు, పోలవరం, ప్రత్యేక హోదా ఇత్యాది అంశాల విషయం లో ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగేలా కొత్త ప్రభుత్వం పట్టు పట్టాలి.


Jagan and YCP have to make a serious self introspection and may have to change some of their methods and policies. Should be receptive to genuine feedback and take corrective measures. Acceptance of failure and past mistakes done may be the right first step for a future comeback.


కేంద్రం లో బీజేపీ కూడా exit polls చెప్పిన ఫలితాలు అందుకోలేదు. అయితే భాగస్వాముల సహకారంతో nda ప్రభుత్వం ఏర్పడుతుంది. BJP doesn't have the magic figure of 272 on its own. It has to depend on allies for majority. This is where support of TDP + JS is critical for formation of government. 


Let's hope that Andhra Pradesh will progress under the the new government with the cooperation of central government.










Thursday, April 11, 2024

రేవతి రాగం - భో! శంభో ! గీతం - musical musings

రేవతి రాగం 70s నుంచి బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది.

సంగీత వాగ్గేయకార త్రిమూర్తులు ఈ రాగం లో కృతులు నిర్మించ లేదు అని తెలుస్తుంది.


స రి మ ప ని  

అన్న ఐదు స్వరాలు కలిగిన ఔడవ రాగం.

మధ్యమావతి రాగం లో చతుశ్రుతి రిషభం ఉండగా రేవతి రాగం లో శుద్ధ రిషభం ఉంటుంది.


ఈ రాగంలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు పాడిన నానాటి బ్రతుకు నాటకము అన్నమయ్య కీర్తన ప్రజలకు చేరువ అయ్యింది.


సినీ గీతాలలో విరివిగా వినిపించింది రేవతి రాగం.


ఓ బంగరు రంగుల చిలకా, మానస వీణ మధుగీతం, ఝుమ్మంది నాదం, ఉదయ కిరణ రేఖలో, నా గొంతు శ్రుతి లోనా, అభినవ శశి రేఖవో, మ్రోగింది డమరుకం... పాటలు ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా శ్రీ రామదాసు చిత్రం లోని ఏ మూర్తి పాట రేవతి రాగం లో ఉన్న అద్భుత గీతం అని చెప్పవచ్చు.


వేదమంత్రాలు వీణ పై పలికించడానికి రేవతి రాగం అనువుగా ఉంటుంది అని చెబుతారు. అలాగే విష్ణు సహస్రనామం, లలితా సహస్ర నామం.. ఈ రాగ ఛాయ లలో పాడిన స్తోత్రాలు సహస్రనామాలు వినసొంపుగా ఉంటాయి. భక్తి భావనలు  కలుగుతాయి. 


శ్రీనివాసా గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా అని రేవతి రాగంలో పారుపల్లి రంగనాథ్ గారు పాడిన గోవిందనామాలు బహుళ ప్రాచుర్యం పొందాయి


అనేక ఉపాధులలో ఒకే అంతర్యామి ఉన్నట్లుగా అనేక గీతాలకు ఒకే రాగం ఆధారంగా ఉంటుంది.



ఆర్ష విద్యా గురుకుల స్థాపకులు, అద్వైత వేదాంత ఆచార్యులు పూజ్య స్వామీజీ దయానంద సరస్వతి గారు రేవతి రాగంలో

భో !  శంభో!   శివ శంభో ! స్వయంభో ! 

అన్న ఒక అద్భుతమైన గీతం రచించారు.  ఈ గీతాన్ని ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు కీ . శే. మహారాజపురం సంతానం గారు సంగీత సభలలో విరివిగా పాడుతూ ప్రాచుర్యం లోకి తెచ్చారు.


పల్లవి.


భో శంభో శివ శంభో స్వయంభో


అనుపల్లవి.


గంగాధర శంకర కరుణాకర

మామవ భవసాగర తారక


భో శంభో శివ శంభో స్వయంభో

భో శంభో శివ శంభో స్వయంభో


చరణం 1.


నిర్గుణ పరబ్రహ్మ స్వరూప

గమాగమ భూత ప్రపంచరహిత

నిజగుహ నిహిత నితాంత అనంత

ఆనంద అతిశయ అక్షయలింగ


చరణం 2.


ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిటతోం

తోం తోం తిమికిట తరికిట కిటతోం

ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిటతోం

తోం తోం తిమికిట తరికిట కిటతోం


మతంగ మునివర వందిత ఈశా

సర్వ దిగంబర వేష్టితవేష

నిత్య నిరంజన నిత్యనటేశ

ఈశ సభేశ సర్వేశ


భో శంభో శివ శంభో స్వయంభో

భో శంభో శివ శంభో స్వయంభో

గంగాధర శంకర కరుణాకర

మామవ భవసాగర తారక



సాహిత్యం అర్థం:


పల్లవి:  ఓ శంభో, శుభకరుడిగా స్వయంభువుగా  వెలసిన  పరమశివా  


అనుపల్లవి: గంగాధర! శంకర! కరుణాకర!

భవసాగరం దాటించి ( మమ్ము ) రక్షించుము.


చరణం 1: 

నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైన నీవు (శంభో)

భూత భవిష్యత్ వర్తమాన కాలములలో  మార్పు చెందే జగత్తుకు అతీతుడైన వాడవు

 

శాశ్వతమైన హిమాలయ పర్వత గుహలో  అనంతమైన ఆనందంతో  శాశ్వతంగా నిలిచి ఉండే అక్షయలింగ స్వరూపుడవు.

(హృదయ కుహరం లో ఆత్మ జ్యోతి స్వరూపుడవై  నిరంతరం వెలుగుతూ వెలసి ఉంటావు)


చరణం 2: ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిటతోం, తోం తోం తిరికిట తరికిట కిటతోం .


మునులలో ముఖ్యుడైన మతంగ మునిచే స్తుతించబడిన ఓ ఈశ్వర!


ఆకాశమును వస్త్రంగా చుట్టూ ధరించి, ఎల్లప్పుడూ దోషం లేకుండా అవిరామంగా నాట్యం చేసే నటరాజ స్వామి వైన నీవు సభలకు అధిపతివి మరియు సర్వ లోకాలకు చక్రవర్తివి.


(గీతం యొక్క అర్థ వివరణ భావం అంజలి సుధీర్ గారి బ్లాగు ఆధారంగా)


చిదంబర నటరాజ స్వామి వారి పై వ్రాసిన ఈ  గీతం కూచిపూడి , భరతనాట్యం శాస్త్రీయ నృత్య కళాకారులు తరచుగా ప్రదర్శిస్తారు. చాలా అద్భుతం గా ఉంటుంది. ఒక అలౌకిక అనుభూతి కలిగిస్తుంది.


చిదంబర నటరాజ స్వామి చిత్ సభ, కనక సభ, నృత్త సభ, దేవ సభ, రాజ సభలనే పంచ సభలకు అధిపతి - సభేశుడు.


పూజ్య స్వామీజీ వారి పూర్వాశ్రమ నామం నటరాజన్. ఆ విధంగా ఈ గీతం ఎంతో సముచితంగా అనిపిస్తుంది.


అనేకమంది కళాకారులు ఈ గీతం ఆలపించారు. అందులో ఉన్ని కృష్ణన్ గారు పాడిన గీతం చాలా బాగుంది. విన్న ప్రతి సారి ఒక దివ్యానుభూతి కలుగ జేస్తూ ధ్యాన స్థితి లోకి తీసుకు వెళుతుంది.


Bho shambho in Trichur brothers voice


సమీప గతకాలంలో రేవతి రాగం లో రెండు కీర్తనలు ఆకట్టుకున్నాయి.


హేమచంద్ర పాడిన ధర్మాధర్మము లాలా దైవములాలా అన్న అన్నమాచార్య కృతి చాలా బాగుంది. చక్కగా పాడాడు. సంగీతం బాగుంది.


అలాగే నీవొక్కడవే సర్వాధారము ఈ కీర్తన కూడా చాలా బాగా స్వరపరిచారు. గాయకుడు చక్కగా పాడాడు.


ఓం నమః శివాయ 🙏