Tuesday, February 22, 2011

మలేషియా వాసుదేవన్ - కొన్ని మట్టి వాసనల గురుతులు.

మహా గాయకుడు కాదు. కానీ మంచి పాటగాడు. open voice తో,బలమైన గొంతుతో పాడేవాడు. ముఖ్యంగా మలేశియా + ఇళయరాజా + భారతి రాజా+ వైరముత్తు.. వీరి కలయికలో పల్లెటూరి పాట అంటే అది మట్టివాసన లాగా చుట్టుకుంటుంది. సహజంగా pretence లేకుండా పాడుతాడు.

వెళ్ళిపోయాడు. అయితేనేమి. పదుల సంఖ్యలో మంచిపాటలు పాడి వెళ్ళాడు.

నాకు అమితంగా నచ్చిన రెండు పాటలు గుర్తుచేసుకుంటాను.

తూరల్ నిన్ను పోచ్చి సినిమాలోని ’తంగ చంగిలి’ పాట ఒక గొప్ప యుగళగీతం.

out of this world orchestrization.

ఇళయరాజాకు కీరవాణి రాగం అంటే మహా ప్రీతి. మలేశియా, జానకి గారు పాటకు జీవం పోశారు.

కోళి కూవుదు చిత్రంలోని ’పూవే ఇళయపూవే’.  ఎంత గొప్ప పాట. ilayaraja  created such a masterpiece. మలేశియా చాలా చక్కగా పాడాడు.

ముదల్ మరియాదై చిత్రంలో పాటలు అజరామరాలు.

పత్రికలలో మలేశియా మరణవార్త చూశాక ఒక్కసారి ఆ ’పాత’ మధురాలు గుర్తుకొచ్చాయి.

thanks malaysia vasudevan గారు .

Friday, February 11, 2011

మల్లెతీగ ఒక్కనాటికీ వాడిపోదు మాండు రాగంలో

రాజన్-నాగేంద్ర-ఈ సంగీత దర్శక ద్వయం ఎన్నో జనరంజకమైన గీతాలు స్వరపరిచారు.

ఒకే చిత్రంలో దాదాపు అన్ని పాటలు hit songs' చేయటం వీరి ప్రత్యేకత.

పూజ cinema లో అన్నీ మంచి పాటలే ఉన్నాయి. అందులో
మాండు రాగం లో ఉన్న ’మల్లెతీగ వాడిపోగ మరల పూలు పూయునా’ ఒక చక్కటి పాట.

రహమాన్ అప్పుడప్పుడూ మాండ్ రాగం లోకి relapse అవుతుంటాడు. ఇరువర్ సినిమాలోని శశివదనే పాటలో interludes లోను చరణంలోనూ చాలా అందంగా మాండురాగచ్చాయలు అగపడతాయి. duet cinema లోని ’అంజలీ అంజలీ’ పాట లోని చరణాలు మరొక ఉదాహరణ.

చక్రవర్తి గొప్పగా సంగీతం ఇచ్చింది 70 లలోనే . అందులోని ఒక ఆణిముత్యం ’కుశలమా నీకు కుశలమేనా’-బలిపీఠం లోనిది.

ఎంత గొప్ప యుగళగీతమో మాటల్లో చెప్పలేను. ఆత్మ సౌందర్యం ఉన్న పాటలు అవి.

మాండు రాగ చాయలలో ఉన్నట్టు నాకు అనిపించింది.

శ్రీ మధ్వాచార్య అనే కన్నడ సినిమా తెలుగు అనువాదంలో బాలమురళి పాడిన ’నాదు హృదయ వీణ మీటి’ అనే గీతం link నాకు దొరకలేదు.