Saturday, April 16, 2011

వేణువై తాను భువనానికి వచ్చి గాలిలా గగనంలో కలిసిపోయిన చిన్నారి.



చిత్రగారు. మధుర గాయని. స్వచ్చమైన నవ్వుతో చూడగానే పవిత్రభావం కలిగే ముఖం ఆమెది. ఆమె తెలుగు ఉచ్చారణ ఎంత బాగా ఉంటుంది! పెను విషాదం. వివాహమైన పదిహేనేళ్ళకు పుట్టిన అమ్మాయి తొమ్మిదేళ్ళ చిన్నారి మరణం ఆమె అభిమానుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తోంది.

చిన్నారి నందన. అందరికీ అమృతం పంచిన మీ అమ్మ ను ఎలా ఓదార్చ గలమమ్మా?

చిత్రగారు ఎన్నో వందల పాటలు పాడారు. ఆమె కర్ణాటక సంగీతం క్షుణ్ణంగా నేర్చుకున్నవారు. అందుకే ఆమె గొంతులో శ్రుతి, శ్రావ్యత ఉత్తమ స్థాయిలో ఉంటాయి.

రెండు మంచి పాటలు గుర్తు చేసుకుంటాను.

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో-- ఈ పాటకు తప్పకుండా జాతీయ బహుమతి ఇవ్వవలసిన పాట. చిత్రగారు తప్ప ఇంకెవ్వరూ ఈ పాట పాడలేరు.

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి. శుభపంతువరాళి లోని విషాదం చిత్రగారిని కమ్ముకుంది. ఆమె దు:ఖం ఎవరూ తీర్చలేనిది.

Thursday, April 7, 2011

సుజాత-కమల హాసన్-ఇళయరాజా-ఒక పడవ పాట

సుజాత. వెళ్ళిపోయింది. సముద్రం లోకి సూరీడు అస్తమించినంత సహజంగా. మనకున్న dignified నటులలో ఆమె ఒకరు.

ఒక మంచిపాట ద్వారా ఒకసారి స్మరించుకుంటాను.

పడవపాటలు చాలా వరకు ఆకట్టుకుంటాయి. ఆ నెమ్మదితనం, మద్యలో నావికుడో, సరంగో చేసే ex tempore ఆలాపనలు. ఇలాంటిపాటలు సంగీతదర్శకులు పాడితే మరీ బాగుంటాయి.

ఈ పాట ఇళయరాజా స్వరపరచిన ఒక classic. గానం జయచంద్రన్, జానకి గారు. interludes ఎంతో మాధుర్యంతో,ఒకేసారి simple గానూ, intricate గానూ అనిపిస్తాయి. చాలా చక్కగా చిత్రీకరించారు కూడాను.

కమల హాసన్ కంటె పెద్దదానిలాగా సుజాత అనిపిస్తుంది.

ఈ పాట నాకు ఎంతో ఇష్టం. దాదాపు 30 ఏళ్ళయినా retro effect ఏమీ పడలేదు. చాలా హాయిగా సాగుతుంది.