Friday, December 30, 2022

నారాయణ తీర్థులు - శ్రీ కృష్ణ లీలా తరంగిణి


నారాయణ తీర్థుల వారి కృష్ణ లీలా తరంగిణి పుస్తకము (వావిళ్ళ వారి ప్రచురణ) పుస్తక ప్రదర్శన ఉత్సవంలో లభించినది.  ఆంధ్ర తాత్పర్య సహితము. 

త్యాగరాజు - అన్నమయ్య - రామదాసు - నారాయణ తీర్థులు - సదా శివ బ్రహ్మేంద్ర స్వామి - క్షేత్రయ్య ....

ఎంతటి మహనీయులు వారు ? ఎటువంటి గొప్ప అనుభూతి తో, భక్తితో సంగీత సాహిత్య సృష్టి చేశారు. 

వారు మనకు అందించిన అమూల్య సంపదను భక్తితో కాపాడుతూ, కొనసాగిస్తూ వస్తున్న వారి శిష్య ప్రశిష్యులు, రస హృదయులు, మహారాజ పోషకులు - ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.🙏🙏🙏

ఈ పుస్తకము నుంచి కొన్ని విశేషములు.

కృష్ణ భక్తాగ్రేసరులలో నారాయణ తీర్థుల వారిది ఉన్నత స్థానము . మాధవానలుడను వైష్ణవుడు వెనుకటికి బిల్హణుడు గా, లీలా శుకుడు గా, జయదేవుడు గా నవతరించి చివరికి నారాయణ తీర్థులుగ నుదయించి ముక్తి చెందిరి. వీరు కాశీ క్షేత్రము లో గంగా తీరమున బహు కాలము నివసించి బ్రహ్మ విద్యా ప్రచారము గావించిరి. తదుపరి దక్షిణ దేశమును చేరి 1745 వ సంవత్సరములో కావేరీ తీరమునందు ఒక గ్రామమున సిద్ధిపొందిరి. వారు డెబ్బది సంవత్సరములు జీవించిరి అని యూహ చేయబడుచున్నది. 

శ్రీ కృష్ణ లీలా తరంగిణి సంస్కృత భాష లో వ్రాయబడిన సంగీత రూప కావ్యము. భాగవతమున ద్వాదశ స్కంధములు యున్నట్లే ఈ కావ్యమున పన్నెండు తరంగములు కలవు. కృష్ణుని లీలలు తరంగముల వలె సుందర లలిత మృదు మధుర పదముల తో వర్ణింప బడుటచే శ్రీ కృష్ణ లీలా తరంగిణి యను కావ్య నామము ఎంతైన సార్థకము యగుచున్నది.

జయదేవుని గీత గోవిందము శృంగార రస ప్రధానము కాగా కృష్ణ లీలా తరంగిణి కావ్యము భక్తి రస ప్రధానముగా నిర్మించబడినది.

నారాయణ తీర్థులు ఆంధ్రులు. తల్లావజ్ఝల వంశము. వీరి పూర్వాశ్రమ నామము గోవింద శాస్త్రి. గుంటూరు సీమ లోని కాజ గ్రామ వాసులు అని యూహించిరి.

వీరి కృతులలో నారాయణ తీర్థ ముద్రను చూపినారు.

గీత గోవిందము, శ్రీ కృష్ణ కర్ణామృతము, శ్రీ కృష్ణ లీలా తరంగిణి -- ఈ మూడు కావ్యములు కృష్ణ భక్తి సాహిత్యము లో అత్యుత్తమ రచనలు గా ప్రసిద్ధి పొందినవి.

ఈ కావ్యము యొక్క  ప్రథమ తరంగము కృష్ణుని జనన వృత్తాంతము తో ప్రారంభించి కృష్ణుని బాల్యము, లీలలు, గోవర్ధనోద్ధారము, రాస క్రీడ, అక్రూర వృత్తాంతము, కంస వధము, ద్వాదశ తరంగమున రుక్మిణీ కల్యాణముతో పూర్ణమవుతున్నది. కావ్యము అంతయు రమణీయ వర్ణనలతో, అత్యంత మనోహరముగా నిర్మింప బడినది.

ఈ కావ్యము లోని శబ్ద సౌందర్యము , భావ వైచిత్రి, పరమాత్మ తత్త్వ నిరూపణము, భక్తి పారమ్యము లను వర్ణించుట కంటే అనుభూతి చెందుట ఆనంద దాయకముగా తోచును. 

---------

ఒక ప్రసిద్ధ తరంగము. రాగము. ముఖారి. ఆది తాళము.

పల్లవి. 

కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం

అనుపల్లవి.

కృష్ణం గత విషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా

బాలకృష్ణం కలయ సఖి సుందరం

చరణములు.

1. నృత్యంతమిహ ముహురత్యంత మపరిమిత భృత్యానుకూలం  అఖిలసత్యం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

2. ధీరం భవజలధిపారం సకలవేదసారం సమస్తయోగితారం సదా 

బాలకృష్ణం కలయ సఖి సుందరం

3. శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరీ ఖేల సంగం సదా 

బాలకృష్ణం కలయ సఖి సుందరం

4.రామేణ జగదభి రామేణ బలభద్రరామేణ సహావాప్త కామేన సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం

5. రాధారుణాధర సుధాపం సచ్చిదానందరూపం జగత్త్రయ భూపం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం

6.దామోదరమఖిల కామాకరం         ఘన శ్యామాకృతిమసుర భీమం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం

7.అర్థం శిధిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థ పరమపురుషార్థం సదా 

బాలకృష్ణం కలయ సఖి సుందరం

-----------

తాత్పర్యము ఇచ్చిన తీరు :

ఓ చెలీ సుందరాకారుడగు నా బాలకృష్ణుని జూడుము.

సకల లోకములకు గారణ భూతుడైనను, రాక్షసులకు శత్రువగు శ్రీమన్నారాయణుడయ్యును, విషయము లందు ఇచ్ఛ లేని వాడయ్యును, బాలుని వలె నటించు చున్నాడు.

----------

షష్ఠ, సప్తమ, అష్టమ తరంగములలో గోపికలు, కృష్ణుడు, రాధా దేవి  జరిపిన సంభాషణలు, రాసక్రీడ అత్యంత రమణీయంగా కృతుల రూపంలో కూర్చబడినవి. గోపికా బృందమునకు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమును గురించి సగుణ బ్రహ్మ రూపముగా కృష్ణుడు చేసిన యుపదేశములు, యథార్థమును గ్రహించి వారు చేసిన స్తుతులు,   ఈ తరంగములకు ఆంధ్రము నందు ఇచ్చిన తాత్పర్యము, వ్యాఖ్య  ద్వైత అద్వైతముల సమన్వయము, వివిధములుగా కనిపించే ఒకే పరమ సత్యమును అద్భుతంగా  ఆవిష్కరించినది. 

ఆద్యంతమూ శ్రీకృష్ణుడు పరబ్రహ్మ స్వరూపుడే యను నుత్తమాశయము పోషింపబడినది. 

-------

కృష్ణం కలయ సఖి సుందరం, 

నీల మేఘ శరీర, 

ఆలోకయే శ్రీ  బాలకృష్ణం, 

గోవర్ధన గిరిధర గోవింద,

బాల గోపాల కృష్ణ పాహి,

ఏహి ముదం కృష్ణ దేహి,

జయ జయ దుర్గే జితవైరి వర్గే 

---------

ఇత్యాది తరంగములు బహుళ ప్రచారము పొందినవి.

ఈ తరంగములు పాడుకొనుటకే గాక నృత్య రూపకములకు కూడా అనువుగా ఉన్నవి. ఈ గ్రంథమును పరిశీలనాత్మక దృష్టితో చదివి అందలి సారమును గ్రహించవలసి ఉన్నది.

కృష్ణం కలయ సఖి సుందరం - తరంగం

నీల మేఘ శరీర - కూచిపూడి నృత్యం

శ్రీ వేంకటేశ్వర భక్తి ప్రసార వాహిని వారు ప్రతి వారం ఒక కృష్ణ లీలా తరంగమును శిక్షణా పూర్వకమైన కార్యక్రమం ద్వారా ప్రసారం చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం.

కృష్ణం వందే జగద్గురుమ్.

వందే పరమానంద మాధవం.

🙏🙏🙏









Sunday, December 18, 2022

నేపథ్య గాయకుడు పి. జయచంద్రన్ - భావగాయకన్

మళయాళ చిత్ర సంగీత జగత్తులో జేసుదాసు తరువాత అంత పేరున్న గాయకుడు పి. జయచంద్రన్. 

గంభీరమైన గాత్రం, స్పష్ట మైన ఉచ్చారణ, భావ యుక్తమైన గానం కలిగిన ఆయనను భావగాయకన్ అని వారు గౌరవిస్తారు. 

80 -90 లలో ఆయన తమిళ, తెలుగు, కన్నడ పాటలు కూడా పాడారు.

ఒకవైపు ఎవరెస్ట్ శిఖరం లాగా జేసుదాసు గారు ఉంటే, జయ చంద్రన్ గారు కూడా  బలమైన గాత్రంతో  ప్రత్యేక స్థానాన్ని అశేష అభిమానులను సంపాదించుకున్నారు. 

జయచంద్రన్ గారికి పి. సుశీల గారు అంటే అమిత అభిమానం, ఆరాధనా భావం. ఆయన  ఇంటర్వ్యులలో సుశీల గారి గురించి గొప్పగా చెప్పారు. వారు ఇరువురు కలిసి అనేక మధుర యుగళ గీతాలు పాడారు.

పూ తెన్డ్రల్ కాట్రే వా  - (1982 manjal Nila ) when we listen to some songs we cannot but look in awe at the genius of the composer (Ilayaraja). Add mesmerizing voice of P susheela Amma and P Jayachandran. A beautiful song with avant-garde touch results.

తమిళం లో మాంజోలై కిళిదానో ( kizhakku pogum rail  1978 - Ilayaraja) పాటతో ఆయన గాత్రం అందరికీ చేరువయ్యింది. The semi classical song in suddha dhanyasi ragam  was a huge hit.

కొడియిలే మల్లియపూ - this was a fine duet in the voice of P jayachandran - s Janaki. (1986 - కడలోర కవిదైగళ్ - ఇళయరాజా). A brilliant composition.

జయచంద్రన్ గారి పాటలలో నేను అమితంగా ఇష్టపడే పాట తాలాట్టుదే వానం - (kadal meengal -1981 - ఇళయరాజా - ఎస్. జానకి, జయచంద్రన్)

An all time classic with great music and interludes.

A magical song which can transport the listener to a different world. కాసేపు మనసు గాలిపటంలా ఎక్కడికో ఎగిరిపోతుంది

Iconic song రాసాత్తి ఉన్నే కాణాద నెంజే (1984 వైదేహి కాత్తిరుందాళ్).    This was a blockbuster hit song. ఈ పాట తెలుగులో జాబిల్లి కోసం ఆకాశమల్లే కూడా పెద్ద హిట్. 

తమిళంలో జయచంద్రన్ సుశీల గారు విడివిడిగా పాడారు. అలాగే తెలుగులో బాలు జానకి గారు పాడారు.

గొప్ప సంగీతం ఎందుకు వింటాము అన్న ప్రశ్న వేసుకుంటే

Great music can lead us to inner silence. Absolute stillness deep in the recesses of heart - It is our real nature. Our real identity.🏔️🌌🌧️⛅










Sunday, December 4, 2022

హంసానంది రాగం - కొన్ని సంగీత ముచ్చట్లు.

హంసానంది రాగం గురించి అనుకుంటే వెంటనే సాగర సంగమం చిత్రం లోని  వేదం అణువణువున నాదం పాట తలపుకు వస్తుంది. సంగీత పరంగా సాహిత్య పరంగా కొంచెం bumpy ride లాగా అనిపించినా బాగుంటుంది. పాట సాహిత్యం, సంగీతం, గానం, చిత్రీకరణ, అభినయం అన్నీ అద్భుతంగా కుదిరాయి.

నాలో రేగే నెన్నో హంసానందీ రాగాలై అని  రాగం పేరు జొప్పించడం ఎందుకు ? అనిపిస్తుంది. ఉద్విగ్నత తో పాడుతున్న వారు నేను హంసానంది రాగం లో పాడుతున్నాను అంటూ పాడతారా?

అయితే సినిమాలో పాట చిత్రీకరణలో భావోద్వేగాలు పండాయి.

ఈ రాగానికి హంసానంది అన్న పేరు ఎలా వచ్చింది తెలియదు. బహుశ:  హంస అంటే పరమాత్మ యొక్క ఆనందస్వరూపము  అయి ఉండవచ్చు.

ఈ రాగం గమనాశ్రమ అన్న మేళకర్త రాగం జన్యము. రాగం లో పంచమం వినియోగం లేదు.  ఈ రాగం హిందూస్తానీ సంగీతంలో సోహిని అన్న పేరు కలిగి ఉంది.

ఈ రాగం లో కర్ణాటక సంగీత trinity కృతులు లేవు. 

కొన్ని మంచి సినీ గీతాలు ఉన్నాయి.

1) Iconic song హాయి హాయిగా ఆమని సాగే - ( ఆదినారాయణ రావు - సువర్ణ సుందరి 1957 - ఘంటసాల - జిక్కి - సముద్రాల సీనియర్) Great composition in raga maalika. Majestic voice of Ghantasala. ఈ పాట హిందూస్తానీ రాగాల ఆధారంగా స్వరపరచబడినది.

పల్లవి - అనుపల్లవి - హంసా నంది / సోహిని 

చరణం -1 - బహార్ రాగం - ఏమో తటిల్లతిక మే మెరుపు

చరణం -2 -  జౌన్ పురి రాగం - చూడుమా చందమామ

చరణం 3 - యమన్ - కనుగవా తనియగా

మల్లాది రామకృష్ణశాస్త్రి, సముద్రాల, దేవులపల్లి కృష్ణశాస్త్రి గార్లు ఉభయ భాషా ప్రవీణులు. అయితే అచ్చ తెనుగు పదాలతో పాటలు అల్లడం వారికి ఇష్టం. 

Probably one of the all time great songs in Telugu. ఈ పాట హిందీలో రఫీ - లతా పాడారు. అయితే ఘంటసాల mesmerizing  గాత్రం లో ఉన్న majesty, magic తెలుగు వెర్షన్ లో స్పష్టం గా తెలుస్తుంది.

2) తంగమగన్ (1983) అన్న చిత్రం లో

రాతిరియిల్ పూత్తిరుక్కుం అనే పాట  (ఇళయరాజా - బాలు - జానకి) అద్భుతం. హంసానంది రాగం ఈ పాటలో చక్కగా ఆవిష్కృతమైంది. A beautiful song in the golden voice of SPB - S Janaki garu.

3) సోహిని రాగం యొక్క వివరణ ఈ

 lec-dem వీడియోలో వినవచ్చు.

4) బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన అన్నమయ్య కీర్తన - ఉన్నతోన్నతుడు ఉడయవరు - ఉడయవర్లు అంటే రామానుజాచార్యుల వారు. అన్నమయ్య వైష్ణవమత ప్రధాన ఆచార్యుల మీద వ్రాసిన కీర్తన.

ఈ రాగం అంటే దర్శకుడు రాఘవేంద్ర రావు గారికి ఇష్టం అని ఎక్కడో చదివాను. అన్నమయ్య చిత్రం లో 

తెలుగు పదానికి జన్మదినం పాట లో హంసానంది  వినిపిస్తుంది.

A good lec dem on hamsa nandi ragam by Smt. Radha Bhaskar .

హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి।
తన్నో హంసః ప్రచోదయాత్॥ 🙏









Wednesday, November 23, 2022

గాడ్ ఫాదర్ తెలుగు చిత్రం

ఈ సినిమా మాతృక లూసిఫర్ మలయాళం లో ఎందుకు హిట్ అయ్యిందో అది మళ్లీ తెలుగు లో తీయాలి అని ఎందుకు అనుకున్నారో..

స్వామి శరణం. 

కథ,  కథనం సహజం గా అనిపించ లేదు.  చిరంజీవి కొన్ని సీన్లలో బాగా నటించాడు.  అయితే మరికొన్ని సీన్లలో నటన స్తబ్దుగా డల్ గా అనిపించింది. సంభాషణలు పలకడంలో ఎనర్జీ, ఫ్లో తగ్గినట్లు అనిపిస్తుంది. 

విలన్ గ్యాంగ్ సభ్యులు ఒక్కరొక్కరు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి హీరో కొట్టిన ఒక్క పిడిగుద్దుతో అమాంతం గాల్లోకి లేచిపోయి దభీమని భూమిపై పడిపోవడం లాంటి ఎలివేషన్ సీన్లు హిలేరియస్ గా అనిపిస్తాయి. Such scenes wont come to an end anytime soon in Telugu movies.

Unpopular opinion:

చిరంజీవి గారు ఇక మీద lead roles కంటే impactful cameo roles, lighter vein roles వేస్తే బాగుంటుంది. The stage has come where he should enjoy the role. 

సల్మాన్ ఖాన్ పాత్ర,  చిరంజీవి - సల్మాన్ పాట ఏమాత్రం ఆకట్టుకోదు. Music, lyrics and choreography for this song is very poor. 

Without a proper role, Salman Khan is totally wasted in the movie.

సినిమా లో సత్యదేవ్  అందరికంటే బాగా చేశాడు అనిపించింది. He seems to be a good actor with good screen presence.

అసలు సిఎం అల్లుడు గా ఉన్న సత్యదేవ్ సి ఎం అవడం కోసం చేసే ప్రయత్నాలు, ప్లాన్లు హాస్యాస్పదం గా ఉన్నాయి. చక్కని రాజ మార్గముండగా..  విలన్ లేకపోతే బాగుండదని బలవంతం గా విలన్ పాత్రను దర్శకుడు సృష్టించినట్లు అనిపించింది.

బ్రహ్మం పాత్ర జైలుకు అంత తొందరగా ఎలా వెళ్లిందో, మళ్లీ అంతే వేగంగా బయటికి ఎలా వచ్చిందో అర్థం కాదు. దర్శకుడు జైలు లో కొన్ని సీన్లు తీయాలి కాబట్టి అందరూ కో ఆపరేట్ చేసి ఉంటారు.

ఎమ్మెల్యే లతో నడిపించే సీన్లు కూడా ఏమీ ఆకట్టుకోవు. 

పూరి జగన్ లాప్ టాప్ లో vlogger గా బాగున్నాడు. అయితే జైలోకి వచ్చి బ్రహ్మం ను కలిసే సీన్లో అతని నటన, body language తేలిపోయింది.

బ్రహ్మం చెల్లెలిని ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేస్తూ ఇచ్చిన ముగింపు బాగుంది.

మిగిలిన నటులలో సునీల్ భార్యగా వేసిన అమ్మాయి , అనసూయ వీళ్లిద్దరూ సహజంగా నటించారు. In their limited screen time both leave their mark.

Thaman music is a big let down. Songs and score not good. So called item song is so bad.

అయితే సినిమా బోర్ కొట్టదు. కాలక్షేపం కోసం చూడవచ్చు.

చిరంజీవి సినిమా చూసి ఎన్నో ఏళ్ళు అయ్యింది అన్న ఉద్దేశ్యం తో చూశాను. Without any expectations చూస్తే OK movie.



Sunday, November 20, 2022

కొన్ని combinations - magic చేస్తాయి



రాజమౌళి - కీరవాణి 
మణి రత్నం - రహమాన్ 
సుకుమార్ - DSP 

we know that if they collaborate, magic is created. Output వేరే లెవెల్ లో ఉంటుంది. 

ఇలాంటి జోడీ ఒకటి మలయాళ చిత్ర పరిశ్రమలో ఉంది --   

లాల్ జోస్  - విద్యా సాగర్. 

వీరి కలయికలో వచ్చిన చిత్రాలు ప్రజాదరణతో పాటు సంగీతపరంగా కూడా విజయం సాధించాయి. నీలతామర, మీస మాధవన్, డైమండ్ నెక్లెస్ ఇత్యాది చిత్రాలలో విద్యాసాగర్ సూపర్ హిట్స్ ఇచ్చాడు. 

మళయాళ చిత్రాల పేర్లు కొన్ని tongue twisters లాగా ఉంటాయి.
 
ఉదా.Pullipulikalum Aattinkuttiyum - Hey. it is quite difficult to pronounce..🐢🙊. 

ఈ చిత్రం లోని పాటపై కొన్నేళ్ల క్రితం ఒక పోస్ట్ వ్రాశాను.

ఇటీవల Solamante Theneechakal అనే చిత్రం కోసం LJ - VS కలిసి పనిచేశారు.

vidya sagar is a unique composer. He has composed some great melodies in Malayalam and Tamil movies. He is rated highly but rather under utilised. It can be said  that he is one if the finest intellectual classy music directors. 

తనకు కేరళ లో అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

కొన్నేళ్లుగా విద్యాసాగర్ చిత్రాల సంఖ్య తగ్గింది. నదిలో కొత్త నీరు పారడం సహజం. 

This  is sort of comeback movie for both lal Jose and Vidya.

ఈ కొత్త చిత్రం లో పాటలు ఎలా ఉన్నాయో విందాము. 

1) విరల్ తొడట్టే - విద్యా సాగర్ సంగీతం ముప్పై ఏళ్లుగా evolve అవుతూ రావడం గమనించాను. finesse, subtlety, smoothening పెరుగుతూ వచ్చింది. Now he has reached the next level of composing which very few other composers have achieved. His music feels like an abstract painting now. This song corroborates it. 


Instant coffee రుచి కొన్ని పాటలకు ఉంటుంది. ఈ చిత్రం లో పాటలు filter coffee లాగా అనిపిస్తాయి.

పాడుకొనే కంటే వినడానికి బాగుంటాయి ఈ తరహా పాటలు. 


ఏదో లోకం లోకి ప్రయాణం చేసినట్లు అనిపిస్తుంది పాట వింటుంటే .గాయకుడు నకుల్ అభయంకర్ బాగా పాడాడు.
 -
2) ఆనందమో - another beautiful soft melody.  

ఈ పాటలు pastels లేత రంగులతో గీసిన చిత్రాలు. Orchestrization లో ఒక sublime touch కనిపిస్తుంది.

3) పంజారక్కో - a song composed in retro style of 50-60s. Uses  instruments like clarinet, Spanish Guitar etc. జాణవులే ( ఆదిత్య 369 ), నా సిరిచా దీబావళి (నాయకన్) పాటల కోవలో సాగుతుంది. అయితే విద్యాసాగర్ మార్కు సంగతులు పాటలో వినవచ్చు. 

He is still capable of creating good music if elements conspire and inspire him. 


Tuesday, November 15, 2022

సూపర్ స్టార్ కృష్ణ గారు 🙏🙏🙏

రామారావు గారు, నాగేశ్వర రావు గారి తరువాత తరం లో  ( 70s-80s)  కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు గార్లు  సమకాలీన కథానాయకులు, పెద్ద హీరోలుగా వెలుగొందారు. 

The last big hero of this trio, Superstar Krishna Garu passed away today. 

Krishna Garu is a doyen of Telugu film industry.

To act as a lead hero in  more than 300 movies is  phenomenal.

He introduced cinemascope, 70mm, cowboy, James bond genre movies in Telugu movies.

కృష్ణగారు మంచి అందగాడు, పసిమి చాయ, నిండైన  వాచకం కలిగిన మంచి నటుడు. అంతకుమించి మంచి మనసు ఉన్న మనిషి గా పేరు తెచ్చుకున్నారు. Though he had limitations in terms of range of roles he could assay, he had a tremendous screen presence. He has good command over Telugu language. A very dignified person. He was a born hero.

కృష్ణ - విజయ నిర్మల గారు 60-70 ల లో దాదాపు 48 చిత్రాలలో నటించారు.

కృష్ణ - శ్రీదేవి, కృష్ణ - జయప్రద గార్ల కాంబినేషన్ అంటే ప్రేక్షకులు చాలా ఇష్టపడేవారు.

As a teenager, I used to be Krishna Garu fan. After NTR, krishana garu used to enjoy mass following.

కృష్ణ గారి చిత్రాలు ఎన్నో చూశాను. వాటిలో నాకు బాగా నచ్చిన మూడు చిత్రాలు 

1) అల్లూరి సీతారామరాజు -1974 iconic movie. No other actor can replicate Krishna garu performance. Magnum opus movie. Probably the best of his career. ఆయనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వవలసిన చిత్రం. He owned the role and gave life to the movie.

2) కృష్ణావతారం -  (1982) బాపు తీసిన చిత్రం. ఈ చిత్రం లో కృష్ణ విలక్షణంగా ఒక రౌడీ పాత్రలో కనిపిస్తాడు. I feel that this  was one of the best performances of Krishna garu.

3) కృష్ణార్జునులు - (1982) ఈ చిత్రం లో కృష్ణ శోభన్ బాబు కలిసి నటించారు. This was a well written role by the director Dasari. The conflict between two heros was well presented. Krishna mesmerized with his natural acting and dialogues in this movie.

కృష్ణ గారు మంచి టైమింగ్ ఉన్న నటుడు అని చెప్పలేము. అయితే free flowing roles  combination scenes ఇస్తే అద్భుతంగా నటించేవారు. అలాగే dances were not his cup of tea. There used to be some stiffness while he danced. Nevertheless viewers enjoyed his dances.

అందరూ హీరోలకు అభిమానులు ఉంటారు. అయితే  కృష్ణ గారి అభిమానులు ప్రత్యేకం. ఎందుకంటే ఎంతో మంది కృష్ణ గారిని స్వంత కుటుంబ సభ్యుడుగా భావిస్తారు. ఆయన కూడా వారిని అంతలా ప్రేమించేవారు.

తనయుడు మహేశ్ బాబు తనను మించిన పెద్ద స్టార్ అవటం కృష్ణ గారికి ఎంతో సంతృప్తిని కలిగించి ఉంటుంది.

రిటైర్ అయిన తరువాత హాయిగా ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. ఇంతలో విజయనిర్మల గారు, సతీమణి ఇందిరమ్మ గారు, పెద్ద కుమారుడు రమేశ్ బాబు దూరం కావడం కృష్ణ గారికి తీవ్రమైన బాధ కలిగించింది. 

రాజకీయ నాయకులు, నటులు, అభిమానులు, సామాన్య ప్రజలు అందరికీ ఆత్మీయ వ్యక్తి, అభిమాన నటుడు శ్రీ కృష్ణ గారికి నమస్సుమాంజలి. A True legend. వారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటిస్తే సముచితంగా ఉంటుంది.🙏



Wednesday, November 9, 2022

వెండికొండ పై విధుబింబం - ధర్మావతి

కర్ణాటక సంగీతం లోని రాగాలపై , మెలోడీ పాటలపై ఉన్న అభిమానం తో 2007 లో బ్లాగులలో ప్రవేశించినప్పటి నుంచి అడపా దడపా సంగీత రాగాలను ప్రస్తావిస్తూ కొన్ని పోస్టులు వ్రాస్తూ వచ్చాను. కర్ణాటక సంగీతం తో కొద్దిపాటి పరిచయం , శ్రవణ, సంచిత జ్ఞానమే తప్ప విశేష పరిజ్ఞానం ఏమీ లేదు. తేనెటీగ మకరందాన్ని పువ్వుల నుంచి సేకరించినట్లు public domain లోని వివిధ మూలాలనుంచి సమాచారం సేకరించి పోస్ట్ లు వ్రాయడం జరుగుతుంది. 

నాకు తెలిసి 2006-7 లలో వ్రాసే బ్లాగర్లు ఇప్పుడు అంతగా వ్రాయడం లేదు. Maybe they moved on to greener pastures. Or simply got bored. 

ఒక మంచి పాటను వెంటనే గుర్తించగలిగే దృష్టి కొంతవరకు ఉంది. 

ప్రతి భారతీయుడికి మాతృ భాషతో పాటు, సంస్కృత సాహిత్యం, శాస్త్రీయ సంగీతం, రామాయణ భాగవతాలు, ఉపనిషత్తులు, భగవద్గీత తో కొద్దిపాటి పరిచయమైనా ఉండాలి అనిపిస్తుంది.  To enrich our lives. 

పుష్కరకాలం క్రిందట ధర్మావతి రాగం లోని పాటలపై ఒక పోస్టు వ్రాశాను. 

మరొకసారి పుష్కర స్నానం చేస్తే పుణ్యం వస్తుంది.

మేళకర్త రాగాలు 72. అవి సంపూర్ణ రాగాలు. అందులో 36 రాగాలు  శుద్ధ మధ్యమం కలిగి ఉంటాయి. ( శంకరాభరణం, చారుకేశి, గౌరి మనోహరి, హరికాంభోజి, కీరవాణి ఇత్యాది రాగాలు)

36 ప్రతిమధ్యమం తో కూడినవి. ( కల్యాణి, చక్రవాకం, ధర్మావతి,వాచస్పతి, సింహేంద్ర మధ్యమం ఇత్యాది రాగాలు).

వెంకట మఖి అనే ఒక సంగీత శాస్త్రవేత్త, పండితుడు (1600-1650 కాలం) కర్ణాటక సంగీతం లోని రాగాలను శాస్త్రీయంగా విభజించి 72 మేళకర్త రాగాలను స్థిరపరచాడు. ఆ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతున్నది. 

ఆ రాగాలకు సంఖ్యక్రమం కటపయాది పద్ధతిలో ఏర్పాటు చేశాడు. కటపయాది పద్ధతి గురించిన వివరణ ఈ వీడియోలో చక్కగా ఉన్నది.

జాజి, సంపెంగ, విరజాజి, పారిజాతం, గులాబి, చేమంతి.. వివిధ రకాల పూలు ప్రత్యేకమైన స్వాభావిక సుగంధం కలిగి ఉన్నట్లు, వివిధ రాగాలు వాటి. ప్రత్యేక స్వభావం, స్వరూపం, అస్తిత్వం కలిగి ఉన్నాయి. 

రాగాలు అన్నీ గొప్పవే. అయితే ఆ రాగాలు ఉపయోగించి మధుర గీతాలను సృజించిన వారు స్వరకర్తలు , వాగ్గేయకారులు. 

We are fortunate that we have huge body of outstanding and everlasting compositions created by vaggeyakaras.

Dharmavaati is the prati madhyama equivalent of Gouri Manohari ragam.

ధర్మావతి రాగం లో చక్కగా స్వరపరచిన మరి కొన్ని గీతాలు...

1) చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో 

ఈ గీతం శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల కోసం ప్రత్యేకంగా వ్రాసి స్వరపరచ బడిన గీతం అనుకుంటాను. ఈ పాట చాలా బాగుంది. పాడిన వారు టిప్పు ,హరిణి. రచయిత, సంగీత దర్శకుడు ఎవరో తెలియలేదు.  This is a beautiful composition with very good lyrics. 

చరణం లో సాహిత్యం ఎంతో బాగుంది.

------------

చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేదవేద్యుడు 

వదనము విధుబింబమై మధురోహల మూలమై మదిమదిలో కొలువుతీరి మన మొక్కులు తీర్చుచు

చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో 

------------

2) కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ  వాన మబ్బు లాంటి వాటం నీదయా ( తారక రాముడు - 1997- కోటి - సీతారామ శాస్త్రి - బాలు - చిత్ర )

చక్కని పాట. పాట పల్లవి  ఆకట్టుకుంటుంది. కోటి సంగీతం చాలా బాగుంది. సౌందర్య, శ్రీకాంత్ జోడీ బాగుంది. 

ఈ రాగం లో నా all time favourite పాట

మన్మథ లీల చిత్రం లోని హలో మై డియర్ రాంగ్ నంబర్ - ( 1976 - బాలు, ఎల్ ఆర్ ఈశ్వరి, ఎం.ఎస్. విశ్వనాథన్, ఆత్రేయ).బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి గారు అద్భుతం గా పాడారు. Beautiful tune. 

అందెలరవమిది పదములదా (స్వర్ణ కమలం) ధర్మావతి రాగంలో ప్రాచుర్యం పొందిన పాట.

శ్రీ పూర్ణిమ కృష్ణ ఈమని - వేణుగానం - భజన సేయ రాదా ( మైసూరు వాసుదేవాచార్య కృతి ) . చెవులకి ఇంపుగా ఉంది.

ఆనంద భైరవి చిత్రం లో చైత్రము కుసుమాంజలి అనే అద్భుతమైన పాట ఉంది. ఈ పాటలో రమేశ్ నాయుడు గారు అమృత వర్షిణి, ధర్మావతి / రంజని రాగాలను చక్కగా ఉపయోగించాడు. వేటూరి సాహిత్యం, బాలు గానం అత్యుత్తమం గా ఉన్నాయి.

చైత్రము కుసుమాంజలి 

పంచమ స్వరమున ప్రౌఢ కోకిలలు

పలికే మరందాల అమృత వర్షిణీ.


వేసవిలో అగ్నిపత్రాలు రాసే

విరహిణి నిట్టూర్పులా కొంత సాగి

జలద నినాదాల పలుకు మృదంగాల

వార్షుక జలగంగలా తేలిఆడే 

నర్తనకీ, కీర్తనకీ, నాట్య కళాభారతికీ 

చైత్రము కుసుమాంజలి 


శయ్యలలో కొత్త వయ్యారమొలికే

శరదృతుకావేరి లా తీగ సాగి

హిమజల పాతాల, సుమశర బాణాల

మరునికి మర్యాదలే చేసి చేసి చలి ఋతువే, 

సరిగమలౌ నాద సుధా మధువనికీ

చైత్రము కుసుమాంజలి 

ఎంత గొప్ప సాహిత్యం. వేటూరి గారు🙏












Saturday, November 5, 2022

సింధుభైరవి - నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి

కాలం తెలిసి ఆగిపోవడం తెలియకుండా  పరుగులు తీయడం ఒకేసారి జరిగితే ?

మనసు బరువెక్కడం తేలికపడటం రెండూ ఏకకాలం లో జరిగితే ?

హృదయం మంచు ముద్దలా ఘనీభవించి అంతలోనే కరిగిపోతే ?

సింధు భైరవి రాగానికి ఈ శక్తి ఉంది. There is some mystic ethereal transcendental quality to this ragam. 

ఆకాశం లాగా ఉందో లేదో తెలియనట్టు ఉంటుంది. ఘటం లో ఆకాశం , ఆకాశం లో ఘటం ఏకకాలం లో ఉన్నట్లు.

ప్రముఖ హిందూస్తానీ సంగీత విదుషీమణి శ్రీమతి అశ్విని భిడే గారి గానం ఇందుకు ఒక నిదర్శనం. మహా గాయకురాలు కీ. శే. కిశోరి అమోంకర్ , అశ్విని భిడే గార్ల గానం అనుభవైక వేద్యం.

హిందుస్తానీ సంగీతం లో ఈ రాగం భైరవిగా చెబుతారు. హిందూస్తానీ సంగీతం కచేరీ లలో భైరవి రాగం కచేరీ ముగింపులో పాడటం సంప్రదాయం గా ఉంది.

This raaga lends itself to many variations and embellishments. 

ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే. 

పాటలో ఉన్న immortal words ' నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి'. సింధు భైరవి రాగానికి కూడా అన్వయిస్తాయి అనిపిస్తుంది.

అలాగే కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే (పింగళి) - ఈ మాటలు కూడా సింధు భైరవికి సరిపోతాయి 

అలతి పదాలలో అనల్పమైన అర్థాలను చెప్పడం ఆత్రేయ లాగా ఎవరూ చేయలేరేమో.

'ఈ జీవన తరంగాలలో ' పాట  ఆత్రేయ  వ్రాసిన విధానం అనితర సాధ్యం.  brevity of words + gravity of meaning. (ఈ పాట సింధు భైరవి లో లేదు ) ఈ పాట లోని భావాలు మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. 

He has this uncanny ability to convey profound meaning in  simple words. ఆత్రేయ గారు. 

సింధు భైరవి రాగం ఆధారం గా చేసుకొని స్వరపరచిన రెండు మంచి  పాటలు

1) వలయోసై (ఇళయరాజా - ఎస్పీ బాలు - లతా మంగేష్కర్). This is a song forever. All-time classic. Legends come together to deliver a masterpiece.

2) మిలే సుర్ మేరా తుమ్హారా - (iconic song on Doordarshan which presented a kaleidoscopic vision of the Indian languages music and cultures through renowned artistes).

ఎన్నో మంచి గీతాలు సింధు భైరవి రాగం లో ఉన్నాయి. అయితే ప్రధాన వాగ్గేయకారుల కృతులు  ఈ రాగం లో  లేవు.

ఈ రాగం pathos కు బాగా సూటవుతుంది. అయితే ఒక కామెడీ పాటకు కూడా ఈ రాగం ఉపయోగించడం  జీవిత చక్రం చిత్రం లో వినవచ్చు. This is one of my all-time favourite songs.

సువ్వీ సువ్వీ చూడే ఓలమ్మీ (జీవిత చక్రం - శంకర్ జై కిషన్ - సుశీలమ్మ -బాలు ).

ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు

ఆ కన్నీళ్లకు చితి మంటలారవు.

- unbelievable and unforgettable lyrics by athreya. They haunt us and gnaw at the heart. 









Sunday, October 30, 2022

సంగీత దర్శకుడు చక్రవర్తి - nostalgia నుంచి massteria దాకా



సంగీత దర్శకుడు చక్రవర్తి. - Yes. He composed music for close to 1000 movies. Astonishing feat indeed.

His tunes had an instant appeal for common man. He was well aware of his limitations and played to his strengths. 

ఆయన స్వరపరచిన పాటలు 

తొలి నాళ్లలో - Class గా మొదలై

మలి దశలో -  Mass గా మారాయి.

He was very popular and prolific in the 80s. ఆ కాలంలో అతను కొన్ని వందల చిత్రాలకు సంగీతం ఇచ్చాడు. చక్రవర్తి, వేటూరి కలిసి కొన్ని వందల పాటల తో తెలుగు అభిమానులను ఒక ఊపు ఊపారు.

చక్రవర్తి ఇచ్చే మాస్ బాణీ లకు, వేటూరి మసాలా లిరిక్స్ జత కలిస్తే, ఆ పాటలకు  హీరో హీరోయిన్లు స్టెప్పులు వేస్తే  అభిమానులు ఊగిపోయేవారు. డ్రైవర్ రాముడు, యమగోల లాంటి కొన్ని సినిమాలలో  కొన్ని పాటల పల్లవులు విని వేటూరిని నిలదీసిఫై చేయాలి అనిపిస్తుంది. అయితే అనేక గొప్ప గీతాలు కూడా వ్రాశాడు కనుక అదంతే అనుకోవాలి. 

Quite early in career as composer శారద చిత్రం లో మంచి సంగీతం ఇచ్చాడు. వ్రేపల్లె వేచెను, శారదా నను చేరగా పాటలు evergreen hits. బాబు చిత్రం లో పాటలు కూడా బాగుంటాయి. 

మల్లెపూవు (1978) చిత్రం లో చక్కని సంగీతం అందించాడు. ముఖ్యంగా చిన్నమాట ఒక చిన్నమాట పాట అద్భుతం. (వేటూరి, సుశీలమ్మ) . 

మల్లెపూవు చిత్రం లో ఓహో లలితా నా ప్రేమ కవితా అన్న పాట విలక్షణంగా ఉంటుంది. వేటూరి విశ్వరూపం చూపాడు. ముఖ్యంగా చరణాలలో పాట బాణీ నడక చాలా బాగుంటుంది. ధర్మావతి రాగాన్ని స్పృశిస్తూ సాగుతుంది. All-time classic song.

చక్రవర్తిని mass movies hijack చేశాక మెలోడీ పాటలకు కేవి మహదేవన్, సత్యం, రమేశ్ నాయుడు, రాజన్ నాగేంద్ర, ఇళయరాజా ఉండేవారు. అలాగే కే. విశ్వనాథ్ గారి చిత్రాలలోని సంగీతం వీనుల విందుగా ఉండేది. 

1981 లో ప్రేమాభిషేకం చిత్రం లో చక్రవర్తి జనరంజకమైన చక్కని పాటలు ఇచ్చాడు. ఈ చిత్రం లో అన్ని పాటలు super duper hits. క్రమేపీ ఆయన సంగీతం commercial, mass, crude గా మారిపోయింది. 

నిర్మాతలు, ప్రేక్షకులు, దర్శకులు, రచయితలు, నటులు, అప్పట్లో వచ్చిన కమర్షియల్ చిత్రాలు - ఇవన్నీ కూడా కారణం కావచ్చు.

అయితేనేమి. ఆయన 70లలో కొన్ని గొప్ప పాటలు స్వరపరిచారు. వాటిలో నాకు బాగా ఇష్టమైన కొన్ని పాటలు.

1) కుశలమా నీకు కుశలమేనా - 1975 (బలిపీఠం- దేవులపల్లి - బాలు -సుశీల ) -a beautiful song forever. Great orchestration, soulful lyrics and singing. A true masterpiece. Interludes are so beautiful in this song. Probably the best song of Chakravarthy garu.

2) ప్రతి అందం జంటకోసం కలవరించి పోతుంది (ఊర్వశి చిత్రం - 1974 - సినారె. - బాలు - వాణీ జయరాం).- ఈ పాటలో second interlude is so beautiful and captivating. సంజీవ్ కుమార్ గారు శారద గారు .a classy song. Lip sync is good in the song.

3) గుండెలోన ఒకమాటుంది -(1976-రాజా - సుశీలమ్మ - బాలు - ఆత్రేయ ).- beautiful song. Particularly notable is సుశీలమ్మ గారు rendition.

4) నీకు నాకు పెళ్ళంట - (జ్యోతి - 1976 - సుశీలమ్మ - బాలు - ఆత్రేయ ) -  lyrics, music, singing, picturization - 👌👌

చరణం చివర్లో వచ్చే ఆలాపన 👌👌

5) చీకటి వెలుగుల కౌగిటిలో -  ( చీకటి వెలుగులు 1975 - బాలు - సుశీలమ్మ - దేవులపల్లి కృష్ణశాస్త్రి) - తెలుగుదనానికి కేరాఫ్ అడ్రస్ లాగా అనిపించే పాట. స్వచ్ఛమైన ప్రేమను ఉదాత్తంగా చిత్రీకరించిన పాట. All time classic. దర్శకుడి అభిరుచి 👌

6) చిన్నమాట ఒక చిన్న మాట  - ( మల్లెపూవు, 1978, వేటూరి, సుశీలమ్మ) - a lovely song. సుశీలమ్మ గానం,లక్ష్మి నటన 👌👌

(7) కెరటానికి ఆరాటం తీరం చేరాలని - (జీవన తీరాలు 1977 , సినారె, బాలు, సుశీల ) - మంచి సాహిత్యం, మృదువైన సంగీతం, హాయి గా ఉన్న గానం 👌👌

ప్రాణం ఖరీదు, ( ఎలియల్లో ఎలియల్లో ఎందాకా ) పదహారేళ్ళ వయసు ( పంటచేలో పాలకంకి నవ్వింది ) చిత్రాలలోని పాటల్లో అసలు చక్రవర్తి కనిపిస్తాడు. తరువాతి కాలంలో  ఆయనకు అలాంటి natural, rustic songs compose చేసే అవకాశం రాలేదు అనిపిస్తుంది.

రాజ్ కోటి, కీరవాణి చక్రవర్తి గారి దగ్గర సహాయకులుగా ఉండి మంచి శిక్షణ పొందారు.

చంటబ్బాయ్ చిత్రం లో ఉత్తరాన లేవంది ధ్రువ నక్షత్రం పాట లో vintage చక్రవర్తి వినపడతాడు. A lovely song beautifully picturised by jandhyala. ఈ పాట చిత్రీకరణ చూసి దర్శకులు ఎంతో నేర్చుకోవచ్చు. 

అత్యధిక చిత్రాలకు సంగీతం ఇచ్చిన వారిలో ఇళయరాజా, ఎం. ఎస్. విశ్వనాథన్, చక్రవర్తి గార్ల రికార్డు పదిలంగా ఉంటుంది. 

🙏










Thursday, October 27, 2022

సింహేంద్ర మధ్యమం - కొన్ని సంగీత కబుర్లు

ప్రతిమధ్యమ మేళకర్త రాగాలలో  ఒక ప్రముఖమైన రాగం సింహేంద్ర మధ్యమం. లేదా సింహేంద్ర మధ్యం.

శుద్ధ మధ్యమం కలిగి ఉన్న కీరవాణి రాగానికి దగ్గరగా ఉంటుంది. 

ఒక పోలిక.

ప్రకృతి లో ఇప్పటి దాకా 118 మూలకాలు గుర్తించబడ్డాయి. ప్రతి మూలకానికి స్వాభావిక, ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అయితే అన్ని మూలకాలు అతి సూక్ష్మ స్థాయి లో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనే పరమాణువులు కలిగి ఉంటాయి అని చదువుకున్నాము. 

అలాగే కర్ణాటక సంగీతం లో 72 మేళకర్త రాగాలు ఉండగా అన్నింటికీ సప్త స్వరాలు లేక వాటి variants తో కలిసి 12 లేదా 16 స్వరాలు building blocks గా ఉన్నాయి.

ప్రతి రాగమూ విశిష్ట లక్షణాలు, ప్రత్యేక అస్తిత్వం కలిగి ఉన్నది. 

That was a  wild comparison to visualise how different arrangement of the same building blocks results in formation of distinct entities.

శాస్త్రీయ రాగాలకు సినిమా పాటలు bench mark కాదు కానీ తేలికగా గుర్తించడానికి అనువుగా ఉంటాయి.

సింహేంద్ర మధ్యమం రాగం లో ఇళయరాజా కొన్ని మంచి పాటలు బాణీ కట్టాడు.

(1) The iconic song  ఆనందరాగం  అమిత ప్రాచుర్యం పొందింది. 

( పన్నీర్ పుష్పంగళ్ 1981 - ఉమా రమణన్). Breathtaking music which runs like a wild stream. 

(2) రాజ్ కోటి - బావ బావమరిది చిత్రం లో బాణీ కట్టిన  పాట ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో కీరవాణి రాగం తో పాటు --సింహేంద్ర మధ్యమం రాగాన్ని స్పృశిస్తూ సాగుతుంది. A beautiful song. పాట పల్లవి బాగుంది. అయితే చరణాలు typical veturi పద్ధతిలో ఉన్నాయి. వేటూరికి పాలు, వెన్న, జున్ను, మీగడ ఈ పదార్థాలు అంటే మక్కువ. అందుకే ఆయన పాటల్లో వాటి ప్రయోగం ఎక్కువ.

ఈ పాట బాణీ చాలా హాయిగా మధురంగా ఉంది. పాట వింటున్నప్పుడు అందులో ఏ పదాలు వస్తున్నాయో అసలు చూపు సారించలేము. మంచి బాణీ గల పాట లోని సాహిత్యం విడిగా చదువు కోవాలి. Words get drowned in melody of the tune.

అన్ని కళల పరమార్థమొక్కటే. అందరినీ రంజింపజేయుటే అని వేటూరి ఒక పాటలో వ్రాశాడు.

(3) గోపుర వాసలిలే అనే చిత్రం లోని ఈ పాట కూడా బాగుంటుంది. (ఇళయరాజా - ఎస్. జానకి)

సంప్రదాయ సంగీతం లో త్యాగరాజ స్వామి కృతి నీదు చరణములే గతి యని నెర నమ్మిన వాడను

( బాలమురళి మృదు గాత్రంలో 1958)

తమిళ సంగీత దర్శకులు అసకృత్తుగా ఈ రాగంలో పాటలు స్వరపరిచారు. అయితే తెలుగు స్వరకర్తలు అరుదుగా ఉపయోగించారు అనిపిస్తుంది.

సంప్రదాయ రాగాలను అనువుగా ఉపయోగించి పాటలు స్వరపరిచే అలవాటు క్రమేపీ తగ్గిపోతున్నది. మేని తోనే ఆగిపోయే పాట మనసు చేరుకోలేదు. మనసును దాటి ఆత్మను అందుకునే నాదం శాస్త్రీయ సంగీతం లోనే సాధ్యం.









 

Sunday, October 23, 2022

కాంతార చిత్రం లో ప్రస్తావించిన కొన్ని ముఖ్య విషయాలు

కన్నడ చిత్రం కాంతార ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఈ చిత్రం ద్వారా రచయిత దర్శకుడు నటుడు అయిన రిషభ్ శెట్టి భారత దేశంలో Native cultures, pagan traditions ఎదుర్కొంటున్న సమస్యలను  నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశాడు.

It is good movie. Honest, raw, rustic, unapologetic in its premise and presentation. 

Shetty has done a good job in weaving a commercial story that shows respect to native tradition, with forest deities at its core.

అన్యమత వలస పాలనలో దాడికి గురి అయిన హైందవ భారతీయ సంస్కృతి ,మన పండుగలు, మన ఆలయాలు, గ్రామీణ, వనవాసులు , గ్రామీణ ఉత్సవ సంప్రదాయాలు, కట్టు బాట్లు, సంప్రదాయ కళలు, సాహిత్యం ...

స్వాతంత్య్రం అనంతరం సమున్నతి, అభ్యదయం పొందలేక secularism పంజరం లో బందీగా మిగిలాయి. 

In general, మన మీడియా, సినిమా, పాఠ్య పుస్తకాలు మహోన్నతమైన మన సనాతన ధర్మం పట్ల నకారత్మక, తిరస్కార ధోరణి తో వ్యవహరిస్తున్నాయి అన్నది  కఠోర వాస్తవం.

ముఖ్యంగా ప్రకృతి శక్తులు, గ్రామ దేవతలు, వనదేవతలు, వారితో అవినాభావ సంబంధం, అనుబంధం, భక్తి కలిగి ఉన్న ప్రజలు... 

పై విషయాలపై అవగాహనాలేమి, తిరస్కార భావంతో అహంకార పూరితంగా వ్యవహరించే, అధికార వ్యవస్థలలోని కొందరు వ్యక్తులు.

దేవతల, ప్రకృతి శక్తుల అనుగ్రహం  ఆగ్రహం అర్థం చేసుకోలేని అహంకార పూరిత, స్వార్థ పరులకు ఈ చిత్రం ఒక  సమాధానం చెబుతుంది.

Government institutions, certain faiths and officials often function with holier than thou attitude . They think that it is their right to reform  native people whereas many a time it is such instituitions, officials and faiths  which need reform.

వందల ఏళ్లుగా ఎవరికీ ఏ సమస్యా లేకుండా టపాకాయలు పేల్చి చిన్నా పెద్దా ఆనందంగా హిందువులు జరుపుకునే  పండుగలపై ఆంక్షలు పెట్టడం.- The movie subtly raises such issues.

There is an important lesson in the movie.

The way the adament forest official eventually understands the significance of native traditions and respects them shows the writer- director's vision.

దేవతల ఆగ్రహం, అనుగ్రహం ఆ దేవతలతో, ప్రకృతి శక్తులతో మమేకమైన ప్రజలకు తెలుస్తుంది. మట్టితో, అడవితో,  జంతువులతో స్థానికులకు ఉన్న మమకారం, అనుబంధం,  so called refined, educated , intellectuals, officials, అర్థం చేసుకోవాలి అన్న సందేశం ఉంది.

విశ్వాసం, భక్తి ఉన్నవారికి దేవతల, ప్రకృతి శక్తుల, వన దేవతల రక్షణ, అనుగ్రహం తప్పక ఉంటుంది. 

అలాగే స్వార్థ పూరిత వ్యక్తులు, land lords, అమాయకులకు అన్యాయం చేస్తే దేవతల ఆగ్రహం ఎలా ఉంటుందో .. చిత్రం లోని చివరి 20 నిముషాలు చూస్తే తెలుస్తుంది.

Great performance by Rishabh Shetty in the climactic moments. Audience will feel the presence of the Deity in the Bhuta kola.

The music, photography and acting of lead actors is natural and in keeping with the tenor of the movie.

వరాహరూపం పాట సంగీతం, చిత్రీకరణ విస్మయం కలిగిస్తుంది. అయితే taikkudam bridge అనే musical band వారి నవరసం అనే పాటను పోలిఉంది అని తెలిసింది.  Yes. Varaharoopam is inspired from the navarasam song. They should have given credit to taikkudam bridge.

భూత కోల, పోతురాజులు, గణాచారులు, రంగం, అమ్మోరు, ఆవహించడం ..ఈ సంప్రదాయాలు మన దేశ ప్రజల విభిన్న సంస్కృతిలో అంతర్భాగం. ఈ సంప్రదాయం తరతరాలుగా ఆచరించే కుటుంబాలు, వారిని విశ్వసించే, గౌరవించే ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ఒక మంచి చిత్రాన్ని అందించిన రిషభ్ శెట్టి అభినందనీయుడు. క్షేత్రం, మూల దేవత, క్షేత్ర పాలక దేవతల ప్రాధాన్యం గురించి చెప్పడం బాగుంది.

Within the commercial format, the movie showcased the native tradition with honesty.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మరిన్ని చిత్రాలు ఇదే ఒరవడి లో వస్తే బాగుంటుంది.

దేవీ మాహాత్మ్యం పురాణం ఆధారంగా ఒక అద్భుత చిత్రం నిర్మాణం జరిగితే బాగుంటుంది అని నా ప్రగాఢ ఆకాంక్ష.🙏




Tuesday, October 18, 2022

ఏది తెలుపు ఏది నలుపు - కొన్ని ఆలోచనలు

ఓ మహాత్మా….ఓ మహర్షి

ఏది చీకటి ఏది వెలుగు

ఏది జీవితమేది మృత్యువు

ఏది పుణ్యం ఏది పాపం

ఏది నరకం ఏది స్వర్గం

ఏది సత్యం ఏదసత్యం

ఏదనిత్యం ఏది నిత్యం

ఏది ఏకం ఏదనేకం

ఏది కారణమేది కార్యం

ఓ మహాత్మా..ఓ మహర్షి


ఏది తెలుపు ఏది నలుపు

ఏది గానం ఏది మౌనం

ఏది నాది ఏది నీది

ఏది నీతి ఏది నేతి

నిన్న స్వప్నం నేటి సత్యం

నేటి ఖేదం రేపు రాగం

ఒకే కాంతి ఒకే శాంతి

ఓ మహర్షి….ఓ మహాత్మా……శ్రీ శ్రీ


ఈ కవిత లో లోతైన భావం ఉంది.

పెద్ద వేదాంత చర్చ  చేయగల అవకాశం

ఉన్న రచన. 


This short verse is laden with profound meaning.

Some thoughts.

It makes sense to ponder over one's stated position on any issue contentious or otherwise. It is not always easy to to step back and change one's stand though.

Sometimes we may evaluate our past action or words in hindsight which may present us with a different perspective. Maybe we were too close to see things clearly back then. 

Things under water appear clearer after the ripples settle down. 

On  different occasions, our reactions were probably not equal to the matter at hand. 

Either  we 

went overboard / or

were stupefied /

were arrogant/

were late to react /

jumped to conclusions /

looked the other way /

were too timid or selfish to react /

were not so fair but sailing with the mob /

were biased in some way /

acted in a fair and just manner /

did the right thing but were in minority /

were in the right and received support as well...

So many possibilities are there.

Many a time our conditioned minds don't allow us to view things in the right perspective.

Every person is endowed with this capacity in varying degrees to evaluate his / her past actions .

Many times our actions tend to be impulsive even when unnecessary.

పండితులు, పామరులు, మాన్యులు, సామాన్యులు.. Anyone can act in haste on a few occasions. They may or may not repent or repeat later.

On a few occasions we listen to our inner voice. 

It can be said that the frequency of one paying heed to the inner voice is proportional to one's spiritual sadhana. A person who made a fair amount of spiritual progress may not lose balance easily. He /she may quickly regain composure even in a trying situation. Also he may not harbour a lasting ill will or dislike towards anyone per se.

If we introspect our actions in the life gone by, we may recall both unpleasant and happy occasions. We may feel angry, proud, happy or guilty about our past actions.

We should never lose the ability to accept our mistakes, stick to or revise our opinions or thought processes.  Adherence to Dharma is the key. Sadhana will lead us nearer to Dharma. Our inner voice certainly guides us, if we are prepared to listen to it. 

తెలుపు నలుపు లను చూపే కాంతికి ఏ వర్ణం అంటుకోదు. 🙏





Saturday, October 1, 2022

పొన్నియిన్ సెల్వన్-1 చిత్రం - ఒక సమీక్ష



పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఎలా ఉంది ? Jury is still out. 

తమిళ వార పత్రిక కల్కి 1941లో ప్రారంభం అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ పత్రిక సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ' కల్కి ' కృష్ణమూర్తి 1950-54 కాలం లో ' పొన్నియిన్ సెల్వన్ ' అనే ధారావాహిక వ్రాశాడు. అది బహుళ ప్రజాదరణను నోచుకుంది. 1955 సం. లో 2210 పేజీల బృహన్నవల ఐదు సంపుటాలుగా ప్రచురించ బడింది. 

చోళ సామ్రాజ్యపు రాజుల జీవితం ఆధారంగా వ్రాయబడిన ఒక కాల్పనిక గాధ.

ఈ బృహత్కథ ను సినిమా గా తీయాలని ప్రఖ్యాత దర్శకుడు మణి రత్నం చాలా ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్నేళ్ల ప్రయత్నాలు ఫలించి ఇప్పటికి ఈ కథను చిత్ర రూపం లోకి తీసుకు వచ్చాడు. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి గొప్ప విజయం సాధించడం ఒక మార్గం చూపింది.

ఈ చిత్రం రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించాడు. మొదటి భాగం నిన్న విడుదల అయ్యింది. 

సినీ దిగ్గజాలు పనిచేసిన Period movie అన్న కుతూహలం కొద్దీ PS-1 తెలుగు అనువాద చిత్రం చూశాను. కొన్ని అభిప్రాయాలు.

సినిమా చూసిన తరువాత కలిగిన అభిప్రాయం. బాగుంది. అయితే కొంత అస్పష్టత ఉంది. మూల కథ, పాత్రలు మనకు తెలియక పోవడం వల్ల కొంత గందరగోళానికి గురి అవుతాము. 

వెంట వెంటనే వచ్చే పాత్రలు వారి backstories ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్పడం వారి బాధ, ఆకాంక్ష లను ప్రేక్షకుడు feel అయ్యేలా చేయగలగడం చాలా ముఖ్యం. అది కొంత miss అయ్యాడు మణి రత్నం అనిపించింది. అయితే ప్రముఖ నవల ఆధారం గా తీయడం వలన కథ విషయంలో deviate  అయితే చాలా విమర్శ వస్తుంది. నవలలను సినిమాలు గా adapt చేయడం అంత తేలిక కాదు. Writer's vision and director's vision may not always match. This happened in case of the iconic movie Guide. It was a very well made movie. Still RK Narayan felt that the movie was a poor adaptation of his novel.

Mani wanted to be faithful to the novel.  

కథలోని పాత్రల ఉద్వేగాలను ప్రేక్షకుడు అనుభవించే లాగా చేసే ఒడుపు, పాత్రలతో పాటు travel చేయించే నేర్పు రాజమౌళికి బాగా తెలుసు. 

ఒక interview లో పొన్నియన్ సెల్వన్ ఒక వెబ్ సీరీస్ గా తీయాలని అనుకున్నట్లు కూడా చెప్పాడు రాజమౌళి. అయితే మణి రత్నం ముందుగా ప్రకటించాడు.  రాజమౌళి was right. This elaborate and complex story is more suitable for web series. Still finding producer for a Magnum opus web series may not be easy. 

సినిమా లో విక్రమ్, శరత్ కుమార్, ఐశ్వర్య రాయ్, రహమాన్ వంటి 50-65 ఏళ్ల నటులను యువకుల పాత్రలకు ఎంచుకోవడం అతకలేదు

The actors, though very competent, are too old to play those characters. 

కొన్నేళ్ల క్రితం వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా ఒక మంచి చిత్రం. అయితే balakrishna was too old to play the character of a young warrior king in that movie.

కొన్నేళ్ల క్రితం విజయ్,  మహేశ్ బాబు లతో ఈ చిత్రం తీయాలని మణి రత్నం అనుకున్నాడు అని తెలుస్తోంది.

కార్తీ, జయం రవి వారి పాత్రలకు బాగా సూటయ్యారు. Both did really well. Another notable performer is veteran actor Jayaram as Vaishnava Brahmin who played the part with authenticity. కార్తీ జయరామ్ మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి.

విక్రమ్ అపరిచితుడు mode లో చెప్పే monologues , his screams to express anguish don't really strike a chord with viewers.

చిత్రం లో అక్కడక్కడ వచ్చే short conversations లో మణి రత్నం ముద్ర కనిపిస్తుంది.

చిత్రం చివర్లో వచ్చే ఓడ మీద యుద్ధం దృశ్యాలు అంత గొప్పగా లేవు. ప్రథమ భాగం ముగింపు  రెండవ భాగం కోసం మరీ ఎదురు చూసేలా లేదు కానీ there is enough interest. 

శివ కేశవులకు మధ్య భేదం లేదని జయరామ్ పరిచయ సన్నివేశం లోనే వచ్చే సీన్ బాగుంది. అలాగే జయరామ్ కు తనికెళ్ళ భరణి గాత్రం బాగుంది. 

Surprise. సంభాషణలు డబ్బింగ్ వాసన అంతగా లేకుండా బాగున్నాయి. ( తనికెళ్ళ భరణి ). పాటల సాహిత్యం బాగా లేదు. అక్కడక్కడ ఇనుప గుగ్గిళ్ళ వంటి పదాలు ఉన్నాయి. 

పాటల చిత్రీకరణ అంతగా ఆకట్టుకోదు. మహేశ్వర్ ఘాట్ కట్టడాల వద్ద  లో కృష్ణుడు కంసుడు theme తో చిత్రీకరించిన పాటలో concept  modern dance లాగా అనిపిస్తుంది. 

సంగీతం. Overall an underwhelming score. నేపథ్య సంగీతం  అక్కడక్కడ బాగుంది.  కార్తీ మీద చిత్రీకరించిన రహమాన్ పాడిన ' పొన్ని నది  పాట stands out for beat and music. Other songs are not so good.  Music feels out of sync with the theme and period of the movie.

Photography - Good but not great.

Sets - Some good. Some look tacky.

చిత్రం చూడవచ్చు. PS-1 is a movie  worth seeing  on big theatre screen.

బాహుబలి తో పోలిక అవసరం లేదు. The scope and aim of both the movies are quite different.

అయితే రాజమౌళి ఈ చిత్రం తీసి ఉంటే ఎలా ఉండేది అని అనుకుంటే ? Yes.  It is an interesting proposition.




Saturday, September 17, 2022

పూర్వి కల్యాణి - ముత్తుస్వామి దీక్షితుల కృతి-మీనాక్షి మే ముదం దేహి



ముత్తుస్వామి దీక్షితులు మధుర మీనాక్షి అమ్మవారిని ఉద్దేశ్యించి కూర్చిన కృతులలో పూర్వి కల్యాణి రాగం లోని

' మీనాక్షి మే ముదం దేహి ' కృతి ప్రముఖమైనది. దీక్షితుల వారు గొప్ప కృతి కర్త, సంస్కృత పండితులు, దేవీ ఉపాసకులు, బహు భాషావేత్త మరియు గొప్ప వైణికులు. వారి కృతులు అధిక భాగం గమక ప్రధానంగా వీణా వాదన కు అనుకూలంగా ఉంటాయి. 

వారు రచించిన ప్రతి కృతిలో ఉపాసనా బలం, అక్షర రమ్యత, శబ్ద సౌందర్యం, భావ సాంద్రత, సంస్కృత  భాషా ప్రావీణ్యం ద్యోతకమవుతుంటాయి. గొప్ప గాయకుల గాత్రంలో ఆ కృతులను విన్నప్పుడు  భక్తి భావన అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతి ముప్పిరిగొని రసికుల హృదయాలను పరవశింప జేస్తాయి. అప్రయత్నంగా ధ్యాన స్థితిని కలుగజేస్తాయి.

పూర్వి కల్యాణి రాగం ప్రాచీన మైన గంభీరమైన రాగం. ఆధ్యాత్మిక, భక్తి, ధ్యాన ఉపాసన భావనలు కలుగజేస్తుంది. 

గమనాశ్రమ అన్న ప్రతిమధ్యమ మేళకర్త రాగ జన్యము.

దీక్షితుల వారి మేళకర్త పద్ధతిలో ఈ రాగం ' గమక క్రియ '  అని పిలువబడుతున్నది. 

మీనాక్షి మే ముదం - (శ్రీమతి ఎం. ఎస్. సుబ్బలక్ష్మి గారి గాత్రం) రాగం  పూర్వి కల్యాణి /గమక క్రియ - తాళం ఆది
------------------------
పల్లవి


మీనాక్షి మే ముదం దేహి
మేచకాంగి రాజ మాతంగి

అనుపల్లవి


మాన మాతృ మేయే మాయే

మరకత ఛాయే శివ జాయే


మీనలోచని పాశమోచని
మానిని కదంబ వనవాసిని

చరణం


మధురా పురి నిలయే మణి వలయే
మలయ ధ్వజ పాండ్య రాజ తనయే
విధు విడంబన వదనే విజయే
వీణాగాన దశ గమకక్రియే

మధు మద మోదిత హృదయే, సదయే
మహా దేవ సుందరేశ ప్రియే
మధు ముర రిపు సోదరి శాతోదరి
విధి గురు గుహ వశంకరి శంకరి

-----------------------

కీర్తన లోని పదాల నడక  హాయిగా కర్ణ పేయంగా సాగుతుంది. చదివినా విన్నా ఒక అనిర్వచనీయ మైన అనుభూతి కలుగుతుంది.

మీనలోచని పాశ మోచని - ఈదృశమైన పదాలు ఆ అమ్మవారే దీక్షితుల వారి నోట పలికించి ఉంటుంది అనిపిస్తుంది.

శ్రీ లలితా సహస్ర నామావళి లోని మాయా, పాశమోచని, కదంబవన వాసిని, విజయ, శాతోదరి నామాలు ఈ కృతిలో ఉన్నాయి. అలాగే ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ రూపా అన్న నామానికి అనురూపంగా మాన మాతృ మేయా అన్న నామం వ్రాసినట్లు తోస్తుంది.

వీణా వాదన లో ప్రముఖంగా వినిపించే కంపిత, ఆందోళిత, స్ఫురిత ఇత్యాది దశ గమకాలు మరియు గమకక్రియ రాగం స్ఫురించేలా ఈ కృతిలో ' దశ గమక క్రియే ' అన్న నామం కనిపిస్తుంది.

దీక్షితుల వారు ఎనిమిది విభక్తులలో కూడా కీర్తనలు రచించారు. ఈ కృతి సంబోధనా ప్రథమా విభక్తి లో కూర్చబడినది. 

దీక్షితుల వారు అనేక ఆలయాలు సందర్శించి ఆయా ఆలయాలలో వెలసిన అధిష్టాన దేవతా మూర్తుల పై కీర్తనలు రచించి గానం చేశారు.

ఈ కృతి గురించి దీక్షితుల వారి జీవితంలో  ఒక ఘటన చెప్పబడినది. 1835 సంవత్సరం అక్టోబర్ 21 దీపావళి నాడు వారి శిష్యులు ' మీనాక్షి మే ముదం దేహి ' కృతిలో అనుపల్లవి ' మీనలోచని  పాశ మోచని ' అని గానం చేస్తుండగా దీక్షితుల వారు తనువు చాలించినట్లుగా చెప్పడం జరిగింది.🙏





Sunday, August 28, 2022

ఆధ్యాత్మిక మ్యూజింగ్స్ - తెలిసి రామ చింతన

శ్రవణం, మననం తదుపరి విచారణ చేస్తూ ఉంటే ఆత్మ యొక్క నిజ స్వరూపం పైన కొంత అవగాహన వస్తుంది.

మనిషి చేసే లౌకిక మైన అనేక రకాల పనులన్నిటి వెనుక ఉండే మౌలిక ఉద్దేశ్యం ఏమిటి అని ఆలోచిస్తే 

1) అనంతం గా వ్యాపించాలనే కోరిక 

2) శాశ్వతం గా ఉండాలి అనే కోరిక 

3) ఆనందంగా ఉండాలి అనే కోరిక 

ఈ మూడూ ప్రధానం గా కనిపిస్తున్నాయి.

మనిషి, ఆ మాటకొస్తే ఇతర ప్రాణికోటి కూడా నిరంతరం ఈ మూడు సాధించడానికి తమ తమ పరిమితుల మేరకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.

సంతానోత్పత్తి, ధనం, వస్తువులు, ఆస్తులు సంపాదన, వివిధ లౌకిక విద్యలు, ఆహార విహారాదులు, శత్రు మిత్రత్వాలు, పూజ, ప్రార్థన, ఇతర మత కర్మలు.. ఒకటి కాదు అన్ని పనుల వెనుక ఉన్న  చోదక శక్తులు ఈ మూడు మాత్రమే. ఇది ఘంటాపథంగా చెప్పవచ్చు.

ఏ కర్మ అయినా ఇంద్రియాలు, ప్రాణం లేదా మనస్సు ప్రమేయంతో నే చేస్తున్నాము. ఆలోచన చేయడం, ఊపిరి తీయడం, వివిధ శారీరిక కర్మలు అన్నీ కూడా  జ్ఞానం వెలుగులో మాత్రమే సాధ్యపడుతున్నాయి. ఆ జ్ఞాన స్వరూపమే సత్ చిత్ ఆనంద పరమాత్మ గా ప్రతి జీవిలోను స్వత: సిద్ధంగా ఉంది. అది అనంతం, శాశ్వతం, ఆనంద స్వరూపంగా ఉండగా అది  'తెలియక '  బాహ్య ప్రపంచం లో రకరకాల కర్మలు ఆచరిస్తూ అవస్థలు పడుతున్నది ప్రాణికోటి.  ' తెలిసి ' న  మనిషికి ఈ అంతులేని పరుగు నుంచి బయటపడే అవకాశం ఉంది అని ఆచార్యులు చెప్పారు. కానీ పరుగే పరమానందంగా భావించే మనిషి ఆ పరుగు ఆపే ప్రయత్నం కూడా చేయడు. ఈ పరుగు జన్మ జన్మలకు కొనసాగిస్తూ పైకి లేస్తూ కిందికి పడుతూ జీవి నలిగిపోతాడు. 

అయితే ఏనాటికైనా ఏదో ఒక సాధన మార్గం ఎంచుకుని ఈ రంగులరాట్నం దిగిపోయే ప్రయత్నం చేయక తప్పదు.

- ఆత్మ విచారణ, భక్తి, ధ్యానం, యోగం, పరోపకారం, తపస్సు, జపం, యజ్ఞం, సేవ, వైరాగ్యం, దీక్ష,సత్కర్మ, ధర్మాచరణ..  ఏ మార్గంలో అయినా నిజాయితీగా సాధన చేస్తూ ఉంటే ఏదో ఒక నాటికి ' తెలిసి ' ఈ పరుగు ఆపగలుగుతాము అని పెద్దలు చెప్పారు. 

త్యాగరాజ స్వామి  ' తెలిసి రామచింతన చేయవే ఓ మనసా ' అని  అన్నమయ్య 'తెలిసితే మోక్షము తెలియకున్న బంధము ' అని  చెప్పడం వెనుక భావం ఏమిటి?

త్యాగరాజు, అన్నమయ్య కీర్తనలలో మూర్తి ఆరాధన, ద్వైత భావన, కేవలం ఇష్టదైవ పారమ్యం మాత్రమే కనిపిస్తాయి అనడం సరికాదు. వారు శ్రీరాముని లోను, వేంకటేశ్వరస్వామి లోను సర్వాంతర్యామి అయిన పరమాత్మను అద్వితీయంగా,  దర్శించారు అని భావించాలి.

అసలు సర్వులకు ఉన్న సామాన్య సమస్య  జనన మరణ చక్రం నుంచి బయటపడడం. ఇది సమస్య అని గుర్తించడం ఒక తొలి అడుగు.

సనాతన ధర్మం ఈ సమస్య పరిష్కారానికి విశ్వజనులకు అచరణీయమయిన మార్గం చూపుతుంది.

అయితే సంకుచిత మతాలు తమ దేవుడు, ప్రవక్త లేదా ఆచార్యుడు మాత్రమే సత్యం అంటూ ఇతర మార్గాలలో సాగేవారిని దూషించడం, హింసించడం, బాధించడం వారిపై అకృత్యాలు చేయడం జరుగుతుంది. 

తమ మతం లో ఉన్నవారికి మరణానంతరం స్వర్గ సుఖాలు, తక్కిన వారికి నరకాగ్ని ప్రాప్తి కలుగుతుంది అని ప్రచారం చేయడం, ప్రలోభాల, బలవంతపు మత మార్పిడులు సాగుతున్నాయి. 

ధర్మాచార్యులు, ధార్మిక ప్రవచన కర్తలు సనాతన ధర్మ రక్షణకోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ,

మన దేశంలో ఉన్న లౌకిక  వ్యవస్థ హిందువులకు, సనాతన ధర్మ పరిరక్షణకు అనుకూలంగా లేదు. హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనం లో ఉన్నాయి. హైందవ ధర్మ విద్యా సంస్థల ఏర్పాటుకు అవకాశం లేదు. . వామపక్ష, కుహానా లౌకికవాదుల, మత మౌఢ్యుల నియంత్రణ లో ఉన్న పత్రికలు, సినిమాలు, ప్రసార మాధ్యమాలు, పాఠ్యాంశాలు అన్నీ కూడా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి.

రాజకీయ నాయకుల అధికార కాంక్ష కారణంగా  హిందువులపై వివక్షాపూరిత ధోరణి, అన్య మత సంతుష్టీకరణ పెరిగిపోతుంది. హిందువులకు, సాధువులకు  రక్షణ కల్పించలేక పోతున్నారు.

హిందువులలో కూడా అనేకులు తమ మనుగడ ప్రమాదం లో ఉంది అన్న సత్యం గుర్తించ లేకున్నారు. 

భారతదేశం హిందువులకు ఉన్న ఏకైక దేశం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ దేశం లో కూడా హైందవ మతం క్షీణించి పోయే ప్రమాదం ఉంది. అది ప్రపంచ మానవాళికి మహా విపత్తు అవుతుంది.  

ప్రపంచంలోని అత్యధిక దేశాల లో మెజారిటీ గా ఉన్న రెండు మతాలు మన దేశం లో మైనారిటీ గా గుర్తించడం సరైనదేనా? 

సమస్త చరాచర సృష్టి ని దైవంగా భావించే మార్గం సనాతన ధర్మం మాత్రమే.

విశ్వ మానవ శ్రేయస్సు కోసం సనాతన ధర్మం పరిరక్షింపబడాలి. 🙏


(ఆదిశంకరుల తత్వ చింతన ను బోధించే సద్గురువుల ప్రవచనాలు, ఇతర సామాజిక మాధ్యమాల్లో ని విషయాల  ఆధారంగా)










Tuesday, August 2, 2022

కవిత్వం made easy - పఠనం made difficult

ఇటీవలి నెలలలో  3-4 లఘు రచనలు వ్రాశాను. ( కొన్ని పంక్తుల సముదాయం అనవచ్చు). 

అవి సాక్షి దినపత్రిక ఆదివారం పుస్తకం లో వచ్చాయి. 

వచన కవితలు అనబడే రచనలు ఈ రోజులలో ఎంతమంది చదువుతారో తెలియదు.

అప్పుడప్పుడు మంచి రచనలు ఆలోచింపజేసే పంక్తులు కనిపిస్తాయి.

సాహిత్యానికి కవిత్వానికి ఒక పుట సాక్షి పత్రికలో కేటాయించారు.

ఎందుకో గానీ ఈనాడు పత్రిక లో సాహిత్యానికి కవిత్వానికి పేజీ లేదు. పుస్తక పరిచయం మాత్రమే ఉంటుంది. 

దాదాపు నలభై ఏళ్ల క్రితం  రెండు మూడు మినీ కవితలు, కొన్ని కార్టూన్లు ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో వచ్చాయి. ఆ సమయం లో భలే థ్రిల్ గా అనిపించింది.  ఇప్పుడు ఆ రచనలు తలుచుకుంటే హాస్యాస్పదం గా అనిపిస్తుంది.

గొప్ప రచనలు కొన్ని చదివాక నేను ఎందుకు వ్రాయకూడదో అర్థమైంది.

ఆ తరువాత ఇక ప్రయత్నించలేదు. అయితే some habits die hard and surface later.  

ఒకటి రెండు ఈ మాట కు పంపాను. అవి ఏమాత్రం బాగాలేవు అని నాకే అనిపించింది. వారు పాపం ఎంతో మృదువుగా అదేమాట చెప్పారు.

ఆ తరువాత కొంచెం సాధన చేసి కొంత ఆద్వైతం, ఆధ్యాత్మికత కలిపి కొన్ని పంక్తులు వ్రాసి సాక్షికి పంపాను. వారు ఎందుకో మరి ప్రచురించారు.

నాకు ఆనందం కంటే ఆశ్చర్యం కలిగింది.

క్రింది రచన సంగీతం, నాదం ఆధారంగా వ్రాశాను. గంభీరంగా ఉండాలి అని కొన్ని సంస్కృత సమాసాలు ఉపయోగించాను. అవి

అసందర్భంగా లేవు అని అనుకుంటున్నాను.

నా రచనల సంగతి అలా ఉంచితే, అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన వాక్యాలు చదవగలిగాను.

కొందరు రచయితల భావుకత, వారి భావ వ్యక్తీకరణ, వారి రచనలలో వస్తు వైవిధ్యం, పద చిత్రాలు  బాగుంటాయి.

తనకు కలిగిన భావనకు అక్షర రూపం ఇవ్వాలి అన్న బలమైన కోరిక రచనకు పురికొల్పుతుంది అనుకుంటాను.

ఏమైనా సంప్రదాయ సాహిత్యం, గొప్ప రచయితల రచనలు కొంత మేరకైనా చదివి అర్థం చేసుకోకుండా రచనలు చేయడం అవివేకమైన పని అని నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. Creative art may work as a type of catharsis for artists. Sometimes audience may also feel the same.

















Tuesday, May 31, 2022

కాలం కదలికల సాక్షిగా - three magic songs

గత ఇరవై ఏళ్లలో వచ్చిన సినిమా పాటల్లో నాకు బాగా నచ్చిన పాటలు which really impressed me are very few. Maybe less than ten.


Only a few songs seem to achieve that magic mix of good music, lyrics, singing, recording, acting and picturization.


I am not against new age songs per se. Still I feel the present day songs lack the soul and melody of 70s and early 80s.


Cine music trends keep changing. Only a few songs live forever.


నాకు నచ్చిన ఈ పాటలు of not so distant past.


1) నువ్వేలే నువ్వేలే - దేవుడు చేసిన మనుషులు - శ్రేయా ఘోషల్ - రఘు కుంచే 

భాస్కర భట్ల - పూరీ జగన్.Really appreciate the efforts of all who collaborated for this beautiful song.


ప్రతి సంగీత దర్శకుడికి career best songs కొన్ని ఉంటాయి. I don't know if Raghu Kunche will have an occasion to compose such a song again.  Shreya Goshal is a gifted singer who did full justice to this song. Puri Jagan, the actors, songwriter.. everything seems to fall into place. 


2) ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే - నిన్ను కోరి - గోపి సుందర్ - రామ జోగయ్య శాస్త్రి - కార్తీక్ - చిన్మయి.

Gem of a song. Superb music, lyrics, acting, picturization.  The lead actors Nani and nivetha Thomas are likeable. No wonder this song struck a chord with young and not so young alike.

-----------

ఆనందం సగం...ఆశ్చర్యం సగం.. ఏమైనా నిజం... బాగుంది నిజం..

కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలినది జీవితం

-------------

3) ఎవ్వరే నువ్వు నన్ను కదిపావు - రాజు భాయ్ - యువన్ శంకర్ రాజా - రామ జోగయ్య శాస్త్రి - హరీష్ రాఘవేంద్ర

such a lovely song. Beautiful lyrics, vocals, music, choreography, acting. A forever song for Manoj.

 ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను.  

రామ జోగయ్య శాస్త్రి, చంద్ర బోస్ - carry on the legacy of legends వేటూరి , సీతారామ శాస్త్రి.


ఇటీవల చదివిన ఒక కవితలోని  పంక్తి.

పరుగు తీయడం అలవాటై నడక మరచిపోయాము. 

Watch and listen to these songs on  a pleasant night  and end up gazing into the starry sky.