Saturday, July 11, 2026

విఖ్యాత గాయని ఎస్ జానకి గారు అస్తమయం



మహా గాయకురాలు, సహజ  మధుర సినీ నేపథ్య గాయని ఎస్ జానకి గారు నిన్న  11-7-2026 సాయంత్రం మైసూరు నగరంలో ప్రశాంతంగా 88 సంవత్సరాల జీవిత యాత్ర ముగించారు.  ఆమె కొన్నేళ్లుగా మైసూరులో నివసిస్తున్నారు అని తెలుస్తుంది.

One of the all time greats. Legend in the true sense. 

దక్షిణ భారత దేశంలో అతి గొప్ప సినీ నేపథ్య గాయనిగా  సుశీల గారు జానకి గారు సుస్థిర స్థానం పొందారు. We are fortunate to be born in the era of these legends. వారు ఇరువురు తెలుగింటి మహిళలు అన్నది తెలుగు వారికి ప్రత్యేకమైన ఆనందం కలిగిస్తుంది.

ఆమె 1957 వ సంవత్సరంలో తొలి పాట పాడారు. 60 -70 లలో సుశీలగారు peaks లో ఉన్నారు. తెలుగు తమిళం లో విశేషించి సుశీల గారు ఎక్కువగా పాడారు. Slowly  Janaki garu came into her own. మలయాళ, కన్నడ సినీ రంగాలలో ఆమె విశేష ఆదరణ పొందారు. 

76 సం.లో ఇళయరాజా అన్నక్కిళి చిత్రం మొదలుకుని ఆమె నేపథ్య గాయనిగా విజృంభించారు. కన్నడ రంగం లో  సంగీత దర్శకులు  రాజన్ నాగేంద్ర, ఎం. రంగారావు, తమిళంలో ఇళయరాజా, MSV సంగీతం లో ఆమె ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. 80 లలో ఆమె నెంబర్ వన్ గాయనిగా రాణించారు. 

ముఖ్యంగా ఎస్ జానకి - ఎస్. పి బాలు కలయికలో ఎన్నో మధుర యుగళ గీతాలు వచ్చాయి. Especially the duet songs in their combination under the baton of of Rajan Nagendra and Ilayaraja are considered as evergreen classics. Pure gold.

I always believe that great singers elevate even an average song. Whereas average singers spoil even a great composition.

SPB - SJ కలిసి పాడిన మలరే మౌనమా, కీరవాణి, హొస బాలిగే...  ఇలాంటి పాటలు timeless classics గా నిలిచిపోయాయి.

70-80 ల సినీ సంగీతపు స్వర్ణయుగం లో సుశీల, జానకి, బాలు, జేసుదాసు, వాణీ జయరాం, జయచంద్రన్ గార్లు అతి ముఖ్యమైన పాత్ర పోషించారు 

జానకి గారు మలయాళ సినీ పరిశ్రమలో జేసుదాసు, జయచంద్రన్ గార్లతో కలిసి కొన్ని వందల మధుర గీతాలు పాడారు. కేరళ రాష్ట్రంలో జానకి గారిని అభిమానులు ఆరాధిస్తారు.

పగలే వెన్నెల, ఈ పగలు రేయిగా, జయమీవే జగదీశ్వరి, నడిరేయి ఏ జాములో, నీ లీల పాడెద దేవా, సిరిమల్లె పూవల్లే నవ్వు...

శంకరాభరణం, సప్తపది, ఆనంద భైరవి, సాగర సంగమం, స్వాతిముత్యం, అన్వేషణ, సితార, ఆలాపన, నీరాజనం, శ్రీ సాయి మహిమ, ఆత్మ బంధువు, ఆరాధన ... ఈ చిత్రాలలో జానకి గారు పాడిన గీతాలు అజరామరం. తన గాత్రంలో సహజంగా వినిపించే శృతి, మాధుర్యం  ఆమెకు దేవుడిచ్చిన వరం.

As an individual also she comes across as a very likeable person. Very affable and down to earth in nature.

ఆమెకు తెలుగు వారికి మించిన అభిమానులు మలయాళ, కన్నడ, తమిళ రంగాలలో  ఉన్నారు. 

నా అంచనా ప్రకారం ఆమె దాదాపు 8000  సినిమా+ ఇతర పాటలు పాడి ఉంటారు. Some sources report a higher number though. 

శాస్త్రీయ సంగీతం విశేషంగా అధ్యయనం చేయక పోయినా జానకి గారు క్లిష్టమైన లలిత శాస్త్రీయ గీతాలు పాడిన తీరు అద్భుతం. కున్నకూడి వైద్యనాథన్ వంటి విద్వాంసులు కూడా ఆమె ప్రతిభను ప్రశంసించారు. 

I doubt whether we can ever see the singers of such calibre in future. 

Though I am a die hard fan of Susheela garu, I have immense respect and liking for S Janaki garu also. 

నీరాజనం చిత్రం లోని ఈ గీతం ' ఘల్లు ఘల్లున గుండె ఝల్లన' నాకు ఎంతో ఇష్టం. I think Janaki garu was outstanding in this song. 

జానకి గారి పాటలు కలకాలం నిలిచి ఉంటాయి.

🙏🙏🙏



No comments:

Post a Comment