Thursday, August 25, 2011

మోహనరాగమహా -మూర్తిమంతమాయే

మోహనరాగం. ఈ రాగం లోని పాటలు వింటే మనసు ఎంతో ఆహ్లాదకరంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా మారిపోతుంది. హాయిగా అనిపిస్తుంది. ఇట్టే ఆకట్టుకుంటుంది. గోవిందుడు అందరివాడేలే అన్నట్టుగా మోహనరాగం అందరికీ ఇష్టమైనదే. ఒకసారి కొత్తపాళీ గారి బ్లాగులో మోహనరాగాన్ని వంకాయకూరతో పోలికతెచ్చి ఎంతో బాగా వ్రాశారు.

సినీ గీతాలవరకూ చూస్తే మోహనం హిందోళం మమ్మీ డాడీ రాగాలు.

ఎన్నో వందలపాటలు స్వరపరచబడ్డాయి మోహనంలో.



అందరికీ తెలిసిన పాటలు కాకుండా రెండు కన్నడ పాటలు పరిచయం చేయాలనిపించింది నాకు. రెంటికీ స్వరకర్తలు రాజన్ నాగేంద్ర. వీరు జనరంజకంగా పాటలు కట్టడంలో సిద్ధహస్తులు.

’నన్న ఆశె హణ్ణాగి’అనే ఈ పాట ఒక చక్కని యుగళగీతం. బాలు గారి గొంతు ఎంతబాగుంటుందో మాటల్లో చెప్పలేను. ఈ పాట తరువాత తెలుగులో, తమిళంలో కూడా వచ్చింది. (విశేషమేమంటే బాలు కన్నడంలో జానకిగారితో, తెలుగులో సుశీలగారితో,అరవంలో వాణీ జయరాం గారితో ఈ పాట పాడారు. ఈ పాటలో నటించిన శంకర్ నాగ్ (అనంతనాగ్ తమ్ముడు) తరువాతి కాలంలో కారు ప్రమాదంలో చనిపోయాడు.). మూడు భాషలలోనూ, కన్నడపాటే ఉత్తమంగా ఉంది. బాలు గొంతుకోసమే ఈ పాట నేను చాలాసార్లు విన్నాను.

యుగళగీతం చివర్లో గాయనీ గాయకులు ఇద్దరినీ తప్పకుండా కలిపి పాడించటం రాజన్ నాగేంద్ర ప్రత్యేకత.

’జేనిన హొళెయో హాలిన మళెయో’ఈ పాట కన్నడ కంఠీరవ డా. రాజకుమార్ పాడినది. కన్నడ దేశపు ఔన్నత్యాన్ని తెలిపే ఈ పాటకూడా చాలా బాగుంటుంది.
రానా స్వరపరచిన పంతులమ్మ గీతాలు ఎంత బాగుంటాయో అందరికీ తెలుసును. ’సిరిమల్లె నీవె’ పాట చరణాల్లో కొన్ని అన్య స్వరాలు వచ్చినా మోహనరాగం ఆధారితమే.

పాటలు విన్నతరువాత మోహనమీ ప్రకృతి. మోహనమీ జగతి. అనిపిస్తుంది.

No comments:

Post a Comment