Tuesday, March 3, 2020

వేగమే నను బ్రోచేవారెవరురా - ఎందుకే నీకింత తొందరా

ఖమాస్  రాగం పై కొన్ని సంగీత కబుర్లు :

కర్ణాటక సంగీతం లో అధికంగా జన్య రాగాలు కలిగిన / అతి పురాతన మైన  పెద్ద ముత్తయిదువ  రాగాలు.

1) కల్యాణి 2) శంకరాభరణం 3) హరి కాంభోజి 4) మాయా మాళవ గౌళ 5) ఖరహర ప్రియ 6) తోడి 7) భైరవి .( భైరవి రాగం అతి సనాతనమైన రాగం.) 

అందులో హరికాంభోజి జన్యమైన  ఖమాస్  రాగమంటే తెలుగు వారికి  ప్రీతి  ఎక్కువే. ఆర్తి ,ఆర్ద్రత , భక్తి భావాలు ఈ రాగం లో ధ్వనిస్తాయి. 

ఈ రాగం లో మిక్కిలి ప్రసిద్ధమైన " బ్రోచేవారెవరు రా" (మైసూరు వాసుదేవాచార్య కృతి) శంకరాభరణం సినిమా ద్వారా బహుళ ప్రజాదరణ పొందింది. 

ఖమాస్ రాగం లో నాకు బాగా ఇష్టమైన రెండు గీతాలు. 

(1) జి. బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన అన్నమయ్య గీతం

 'మెరుగు వంటిది అలమేలు మంగ'  

(పాట  గానం, సంగీతం, ధ్వని ముద్రణ మొదటి శ్రేణి లో ఉన్నాయి ఈ పాట లో)

(2)" పల్లవియే సరణం " (SP బాలు - S జానకి - ఇళయరాజా)

The trio SP బాలు - S జానకి - ఇళయరాజా weave magic in this beautiful song. 

సంగీత దృశ్య కావ్యం  'మల్లీశ్వరి' లోని "ఎందుకే నీకింత తొందర' పాట ను స్మరించకుండా ఖమాస్  రాగం పై కబుర్లు పూర్తి కావు. 

( రాజేశ్వర రావు - భానుమతి - దేవులపల్లి గారులు )

The genius of Rajeswara rao and Bhanumathi garu in bringing out the nuances and subtle variations of khamas ragam is evident in the song. 

Immortal lines from the song.

"బాధ లన్నీ పాత గాధలై  పోవునే 
వంతలన్నీ వెలుగు పుంతలో మాయునే "

ఒకవైపు   వేగమే నను బ్రోచేవారెవరురా .... 

మరోవైపు ఎందుకే నీకింత  తొందరా 

అని వింటూ ఉంటే నవ్వు వస్తుంది. 


No comments:

Post a Comment