Saturday, October 12, 2024

బొల్లోజు బాబా గారు సనాతన ధర్మం అంశం పై వ్రాసిన పోస్టు - నా సమాధానం

 

బాబా గారి పోస్టు లింకు -


సనాతన ధర్మం అంటే ఏమిటి? - కొన్ని చర్చనీయాంశాలు


ఆ బ్లాగులో పోస్టు చేసిన నా సమాధానం. మరికొన్ని అంశాలు జోడించడం జరిగింది.

-------

అయిష్టంగా నైనా సనాతన ధర్మం మానవాళికి అందించిన కొన్ని గొప్ప విషయాలను ఏకరువు పెట్టారు. సంతోషం.

అయితే సనాతన ధర్మాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం, బ్రాహ్మణ వ్యతిరేక భావనల వ్యాప్తి వ్యాసం ఉద్దేశ్యంగా కనబడుతుంది. 


1) వేదరాశిని పరమ పవిత్రంగా, పరమ ప్రామాణ్యంగా స్వీకరించడం, గోవులను మాతృ భావంతో వ్యవహరించడం, గోసంరక్షణ సనాతనధర్మంలో  అతి ముఖ్యమైన అంశాలు. 


2) పునర్జన్మ సిద్ధాంతం హిందువులు విశ్వసిస్తారు. మరణానంతరం జీవాత్మ  ప్రయాణం గురించి సనాతన ధర్మాన్ని ఆచరించేవారి విశ్వాసాన్ని చార్వాకులు అంగీకరించక పోతే పోనివ్వండి. సమాజం లో అందరూ ఏకాభిప్రాయం ఉండాలని లేదు  కదా. ఇందులో బలవంత మేమీ లేదు.


చాగంటి, సామవేదం వంటి సనాతన ధర్మ ఆచార్యుల ప్రవచనం అనేకమంది ఇష్టపడి సాత్విక ధార్మిక భావాలు అలవరచుకుంటున్నారు. ధర్మచార్యుల బోధనలతో హైందవ సమాజానికి ధర్మ మార్గ నిర్దేశ్యం చేస్తున్నారు. ప్రకృతిలోని అణువణువు లో పరమాత్మను దర్శించి ఆరాధించే దర్శనం సనాతన ధర్మం అందిస్తున్నది. అయితే


కొంతమందికి రాం గోపాల్ వర్మ వంటి వారి భావాలు ఇష్టం కావచ్చు. మరికొందరికి గోగినేని బాబు అభిప్రాయాలు ప్రియం కావచ్చు. ఎవరి స్వభావం అనుసరించి వారికి ఆయా మార్గాలు నచ్చుతాయి. లోకో భిన్న రుచి:


3) ప్రపంచ వ్యాప్తంగా శాఖాహారం పట్ల సానుకూల భావన, స్వీకరించే వారి సంఖ్య పెరుగుతున్నది. ఆరోగ్య రీత్యా, మానవ శరీర నిర్మాణ రీత్యా, జీవ హింస దృష్ట్యా మాంసాహారం కంటే శాఖాహారం మంచిది అన్న విషయం అనేక పరిశోధన లలో తెలుస్తుంది. మానవాళి సాత్విక ఆహార అలవాట్లు దిశగా మళ్లటం మంచిదే కదా. హిందువులకు పరమ పవిత్రమైన గోమాత ను హింసించడం, గోమాంస భక్షణ చేయడం  అత్యంత క్లేశం కలిగిస్తుంది. అందుకే రాజ్యాంగం లో కూడా గో సంరక్షణ కోసం ఇలా పొందుపరిచారు


Article 48 of the Constitution of India States that the State shall endeavour to organise agriculture and animal husbandry on modern and scientific lines and shall, in particular, take steps for preserving and improving the breeds, and prohibiting the slaughter, of cows and calves and other milch and draught cattle.


నిజానికి మేకలు, గొర్రెలు వంటి జంతువులను కూడా సంరక్షించుకోవడం బాగుంటుంది. అయితే సమాజం లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వీలైనంత తక్కువ జీవహింస చేయడం ధర్మం మానవాళికి శ్రేయోదాయకం అవుతుంది.


4) వర్ణ వ్యవస్థ : చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ: అని భగవద్గీత లో ఉంది. గుణము కర్మ బట్టి వర్ణ విభజన అని గీతాచార్యుడు తెలిపాడు. అయితే దేశ కాల పరిస్థితులను అనుసరించి వర్ణ వివక్ష జరిగి ఉండవచ్చు. ఒక్క భారత దేశం లోనే కాదు ప్రతి దేశం లో ప్రతి మతావలంబీకులలో కూడా ఏదో ఒక రూపంలో వివక్ష అనేది కనబడుతుంది. దానికి వ్యతిరేకంగా సంఘ సంస్కర్తలు చేసిన పోరాటం కనబడుతుంది. 

మనుస్మృతి లోని అభ్యంతర కరమైన విషయాలను హైందవ సమాజం నిరాకరిస్తుంది. Most of Hindu society has moved on by reforming  itself. A few leftist pseudo secular self declared  intellectuals refuse to acknowledge this and try to harp on non existent issues. ఆదిశంకరులు , రామానుజులు వంటి ఆచార్యులు కాలం నుండి, గాంధీ, అంబేద్కర్ వంటి నాయకులు కృషి వల్ల చాలావరకు వర్ణ వివక్ష అనేది ప్రస్తుత కాలంలో తగ్గిపోయింది. దళితులకు స్వతంత్ర భారత రాజ్యాంగంలో అనేక రక్షణలు కల్పించ బడ్డాయి. హైందవ సమాజంలో సమస్యలు లేవని కాదు. అయితే కొన్ని విభేదాలు, వైరుధ్యాలు ఉన్నప్పటికీ సూత్రే మణిగణా ఇవ అన్నట్లు సనాతన ధర్మం అంతస్సూత్రం గా ఒకటిగా ఉంచుతున్నది.


నిజానికి అనేక రాష్ట్రాలలో ప్రస్తుతం బ్రాహ్మణులు ఆర్థికంగా సామాజికంగా వివక్ష, దాడులకు గురి అవుతున్నారు. పౌరోహిత్యం  వృత్తి లో ఉన్న వారు, డిల్లీ వంటి చోట రిక్షా నడుపుకునే బ్రాహ్మణులు, ఎటువంటి రిజర్వేషన్లు లేక చిన్న చితక పనులు చేసుకుంటున్న బ్రాహ్మణులు, ఆర్థికంగా, సామాజికం గా దుర్భర పరిస్థితుల్లో ఉన్న GC కులాల వారు మేధావులకు కనిపించరా ?


GC Hindus and especially Brahmins are being discriminated against now. 


5) పితృ దేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు చేయడం అన్నది సనాతన ధర్మం లో ముఖ్య భాగం. ఏదో ఒక విధానం లో మరణించిన వారి పట్ల కృతజ్ఞతతో, వారికి ఆత్మ శాంతికోసం దాన ధర్మాలు, రిచువల్స్, ప్రార్థనలు చేయడం, అన్న సంతర్పణ చేయడం అన్ని మతాల లోనూ ఉంది. హిందువులలో వారి వారి సంప్రదాయం అనుసరించి శ్రాద్ధ కర్మలు నిర్వహించుకుంటారు. వారి విశ్వాసం పట్ల ఇతరులకు అభ్యంతరం ఎందుకు ? ఒక ప్రాణిగా కాకికి పిండం తినిపిస్తే తప్పేముంది. హిందువుల సంప్రదాయాలను చులకన చేయడం ఎందుకు ?


యోగి వేమన ఒక అవధూత స్థాయికి చెందిన వ్యక్తి. ఆయన చెప్పిన మాటను సందర్భం బట్టి అన్వయించుకోవాలి. ఆయన లాగా సర్వ సంగ పరిత్యాగి యైన వారికి  ఆచార వ్యవహార నియమాలు వర్తించవు. సామాన్యులు ఆచారాలను కట్టుబాట్లను వదిలివేస్తే సమాజం పతనమౌతుంది.


5) స్త్రీ మూర్తికి సనాతన ధర్మం అత్యున్నత స్థానం కల్పించింది. దైవాన్ని మాతృమూర్తి గా, శక్తి స్వరూపిణి గా భావన చేసి ఆరాధించే విధానం కేవలం సనాతన ధర్మం లో మాత్రమే ఉంది. స్వభావ, శారీరిక, సమాజ పరిస్థితుల దృష్ట్యా కొన్ని నియమాలు, ఆచారాలను ఏర్పరిచారు. అవి కాలానుగుణంగా మార్పులు చెందుతూ సంస్కరణలు జరిగాయి.


6) పురుషసూక్తములోని “ బ్రాహ్మణో స్య ముఖమాసీత్ బాహూ రాజన్య: కృతః/ఊరూ తథస్య యద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్ర: అజాయత" అనే శ్లోకం వివరిస్తుంది. బ్రాహ్మణుడు మహాపురుషుని ముఖంనుండి, క్షత్రియుడు భుజాలనుండి, వైశ్యుడు తొడలనుండి, శూద్రుడు పాదాల నుండి ఉద్భవించారని అర్ధం. More than in the literal meaning, it has to understood as a symbolic description.


ఈ శ్లోకాన్ని పరిశీలిస్తే సమాజం అనే పిరమిడ్ నిర్మాణం గోచరిస్తుంది. ఈ శ్లోకాన్ని కుల దృష్టితో చూడడం సరికాదు. శరీరం లోని అన్ని భాగాలు సమానమే. ముఖ్యమే.


ధర్మాన్ని బోధించి నిలబెట్టేవారు, సమాజానికి మార్గ నిర్దేశనం చేసే వారు ఒక వర్గం. దేశాన్ని ప్రజలను రక్షించి క్రమ శిక్షణతో ఉంచే వారు, శత్రువులను, దుర్మార్గులను శిక్షించే వారు ఒక వర్గం. వ్యవసాయం, వర్తకం చేసి ప్రజలను పోషించే వారు ఒక వర్గం, వివిధ మార్గాలలో శారీరిక శ్రమ, కృషి చేస్తూ సమాజానికి పునాది వంటి వారు ఒక వర్గం. పాదాల నుంచి ఉద్భవించిన వారు ముఖ్యమైన వర్గం. కార్మిక వర్గం లేని సమాజం కుప్ప కూలిపోతుంది. ఏ దేవతకైనా గురువుకైనా పాదాలకు నమస్కరించడం, పూజ చేయడం సనాతన ధర్మంలో  భాగం. పాదములకు సామాన్య లోక వ్యవహారం లోని అర్థాన్ని పై శ్లోకాన్ని అన్వయించడం సరికాదు. అందువల్ల పురుష సూక్తం లోని పై శ్లోకాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రోత్రియ బ్రాహ్మణులకు ధర్మ శాస్త్రాలు కఠినమైన నియమాలు, ఆచారాలు , విహితకర్మలు విధించాయి.


7) కర్మ సిద్ధాంతం అవగాహన చేసుకోవడం కష్టం. గహనా కర్మణో గతి: అని గీత లో ఉంది. కర్మ ఫలితం ఎప్పుడు లభిస్తుంది అన్నది చెప్పటం కష్టం. కర్మ సిద్ధాంతం హిందువులు నమ్ముతారు. ఆ విధంగా కష్టాలను సుఖాలను సమ దృష్టితో స్వీకరించే అవకాశం ఉంటుంది. బాధలు అనుభవిస్తున్న వారు నా కర్మ ఇంతే అని ఉండిపోరు. కష్టాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే పోరాటం చేస్తారు. కేవలం ఫలితం మీదే దృష్టి ఉంచకుండా కర్మలను కుశలత తో చేయమని గీత బోధిస్తుంది. ఫలితం ఒక్కోసారి అనుకూలం కావచ్చు కాకపోవచ్చు.

కర్మ సిద్ధాంతం పై నమ్మకం లేనివారు తమ అభీష్టం ప్రకారం జీవిస్తారు. ఇందులో వివాదానికి చోటెక్కడ.

8) వివిధ గ్రామ దేవతలు, గిరిజన దేవతలు కుల దేవతలు కూడా సనాతన ధర్మంలో భాగమే. ఈనాటికీ గిరిజనులు, గ్రామీణులు తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ సంప్రదాయాలను ఏ ధర్మాచర్యుడు నిరాకరించలేదు. అయితే గాసట బీసట గా ఉన్న ఆరాధనా పద్ధతులను ఒకరి కొకరు కలహించు కాకుండా ఆదిశంకరాచార్యులు పంచాయతనం పూజా విధానం స్థిరపరిచారు. షణ్మత స్థాపనాచార్య అని పిలిచారు. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య , సౌర, స్కంద అని ఆరు శాఖలు గా హిందూ దేవతల ఆరాధన ను వర్గీకరించారు. అయితే వేదాలు, పురాణాల ఆధారంగా ప్రధాన దేవతల ఆరాధన కొనసాగుతుంది. ఇతర దేవతా మూర్తులు వారి వారి సంప్రదాయం అనుసరించి చేసుకుంటున్నారు. హిందువులలో ఎవరికీ ఈ విషయం లో పేచీ లేదు. కేవలం కువిమర్శకులకు హిందూ వ్యతిరేకులకే సమస్యగా కనిపిస్తుంది.


హిందువులు మైనారిటీ గా మారితే భారత దేశం పరిస్థితి ఏమౌతుందో ఒకసారి ఊహించండి. India is secular in nature because of Hinduism and Sanatan Dharma. The so called critics cannot even raise a single issue about other religions.


సనాతన ధర్మం అందించిన జ్ఞానరాశి, అద్భుత సాహిత్యం, కళలు, గో సంరక్షణ, అన్య మతాలపట్ల సహనం, గౌరవం, యోగ, ఆయుర్వేదం, ఇత్యాది గొప్ప విషయాలు సకల మానవాళికి అందించిన అమూల్య సంపద . స్మృతులు లేక శాస్త్రాలలో అందించిన గొప్ప సమాజ హితమైన ధార్మికమైన భావనలను స్వీకరించుదాము. ఆమోదయోగ్యం కాని అంశాలను వదిలి వెద్దాము. న అన్య: పంథా అయనాయ విద్యతే.


నాకు చేతనైన విధంగా సనాతన ధర్మం పై మీ అపోహలను తొలగించే ప్రయత్నం చేశాను. అందులో తప్పులుంటే అంగీకరించడానికి, మార్చుకోవడానికి సిద్ధం.


Hope you read with open mind. Prejudice will blind one's vision.


సర్వే జనా సుఖినోభవంతు 🙏





Tuesday, October 1, 2024

దేవులపల్లి కృష్ణశాస్త్రి సినీ గీతాలు


Great masters.

Their work is laden with finesse. Emanates an unmissable radiance. Has a natural fragrance.

కృష్ణశాస్త్రి గారు వ్రాసిన సినీ గీతాలకు ప్రత్యేకత ఉంది.  దేవులపల్లి పల్లవులు వెంటనే ఆకట్టుకుంటాయి. ఎత్తుగడలు సంభాషణ రూపం లో విలక్షణంగా ఉంటాయి. 

సరళమైన భాష. లోతైన భావం.

సందర్భానికి తగినట్లుగా,  తెరపై కనిపించే పాత్రలు సహజంగా పాడుతున్నారు అనిపిస్తాయి. దర్శకుడి ఆలోచనను ఆవిష్కరించే విధంగా ఉంటాయి. 

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, మల్లాది రామకృష్ణశాస్త్రి గారు ఇరువురికి అచ్చ తెనుగు పదాలతో పాటలు అలవోకగా వ్రాయడం ఇష్టం కావచ్చు.  అయితే అద్భుత సంస్కృత గీతాలు కూడా వ్రాయగలిగిన మహా పండితులు.

ఆయనచేత మరిన్ని సినీ గీతాలు వ్రాయించుకొని ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది.

మల్లీశ్వరి చిత్రం లోని అన్ని పాటలు golden classics గా నిలిచి పోయాయి.

కొన్ని పాటల పల్లవులు 

--------------

తెరచి ఉంచేవు సుమా పొరబడి నీ హృదయము,  బిర బిరా ఏ సుందరియో చొరబడితే ప్రమాదము (ధనవంతులు గుణవంతులు)

 - who else can write such lines🙏

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు -(ఈ నాటి బంధం ఏనాటిదో ) 

ఎదుటనుంచి కదలను పదములింక వదలను కళ్లకు నా చిన్న తండ్రి కనిపించే తీరాలి (వాడే వీడు) - gem of a song. Excellent tune by satyam in suddha saranga /bangala ragam.

కుశలమా నీకు కుశలమేనా (బలి పీఠం)- probably GOAT.

ఘనా ఘన సుందరా, సడిసేయకో గాలి, రావమ్మా మహాలక్ష్మీ, ఆకులో ఆకునై, ముందు తెలిసినా ప్రభూ, ఈ గంగ కెంత దిగులు, ప్రతిరాత్రి వసంత రాత్రి, ఇది మల్లెల వేళయని, చీకటి వెలుగుల...

కొలువైతివా రంగశాయి గీతం కూడా దేవుల పల్లి రచన అని తెలుస్తుంది. ఇది సంప్రదాయ కీర్తన కాబోలు అనిపించేది.

కొలువైతివా... రంగశాయి...

చరణం 1:

సిరి మదిలో పూచి తరచి రాగము రేపి చిరునవ్వు విరజాజులేవోయి..ఏవోయి...

కొలువైతివా... రంగశాయి..

చరణం 2:

సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట

పరచేటి ఎలదేటులేవోయి... ఏవోయి

కొలువైతివా... రంగశాయి...

చరణం 3:

ఔరా.. ఔరౌరా......

రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి

వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి

సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి

ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి

జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి

ముజ్జగములు మోహంబున తిలకింపగ.. పులకింపగ

శ్రీ రంగ మందిర నవసుందరా పరా కొలువైతివా... రంగశాయి...హాయి..కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి

కొలువైతివా... రంగశాయి

----------------------

జయ జయ జయ ప్రియ భారత

జనయిత్రి - భరత మాత ను కీర్తిస్తూ రచించిన సుందర సుమధుర సంస్కృత గీతం. అందులో లాక్షారుణ పదయుగళా అన్న పదం అద్భుతం. పాదాలకు ఎర్రని పారాణితో భరతమాత ఎదురుగా వెలసిన భావన కలుగుతుంది 

పల్లవి :

జయ జయ జయ ప్రియ భారత

జనయిత్రి దివ్యధాత్రి

జయ జయ జయ శత సహస్ర

నరనారీ హృదయనేత్రి ||| జయ జయ జయ |||


చరణం 1 :

జయ జయ సశ్యామల

సుశ్యామచలచ్చేలాంచల

జయ వసంత కుసుమ లతా

చలిత లలిత చూర్ణకుంతల

జయ మదీయ హృదయాశయ

లాక్షారుణ పద యుగళ ||| జయ జయ జయ |||


చరణం 2 :

జయ దిశాంత గత శకుంత

దివ్యగాన పరితోషణ

జయ గాయక వైతాళిక

గళ విశాల పద విహరణ

జయ మదీయ మధుర గేయ

చుంబిత సుందర చరణ |||

జయ జయ జయ |||

దేవులపల్లిగారి విశాల సాహితీ క్షేత్రం లో సినీ గీతాలు మల్లె తీగల వంటివి.  పుస్తకంలో ఒక అధ్యాయం వంటిది అని చెప్పవచ్చు. 

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?చంద్రికలనేల వెదజల్లు చందమామ?ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను? 

(ఏల ప్రేమింతును? - కృష్ణ పక్షము)

🙏