Sunday, August 26, 2012

సాయి ఈ జగమే నీ ద్వారకా మాయి.- నాగార్జున సాయి పాటలు

 నాగార్జున శిరిడి సాయి పాటల గురించి చెప్పాల్సి ఉంది. నాగ్ first look లో చాలా బాగున్నాడు అనిపించింది. కానీ తెచ్చిపెట్టుకున్నట్టు లేకుండా , unwanted gait లేకుండా హాయిగా సహజంగా నటిస్తే ఇంకా బాగుంటుంది.

కీరవాణి stable నుంచి వచ్చిన ఈ album బాగుంది అని చెప్పవచ్చు. నాకు ముఖ్యంగా నాలుగు పాటలు నచ్చాయి.

1) నీ పదముల ప్రభవించిన గంగా యమున : చిలుక పలుకుల composer chose to sing the best song of the album. కీరవాణికి ఈ ’పాడు’ గుణం ఎప్పటికి పోతుందో. పాట ఎత్తుగడ పీలగా అందుకోవటం బాగాలేదు. ఈ పాట బాలు పాడితే గొప్పగా ఉండేది. సునీత మంచి గాయని కానీ గొంతులో పీచు మిఠాయి లేదా నెమలి ఈక పెట్టుకుని పాడినట్టు ఉంటుంది. స్పష్టత తక్కువ. కొంతమంది perform చేస్తే బాగుంటుంది. మరికొందరు mentors లేదా tutors గా ఉంటేనే నయం. కళాకారులు ఈ విషయం గుర్తెరగాలి. అయితే ఒకటి. నలుగురి ముందు ప్రదర్శన ఇచ్చి మెప్పుపొందాలనుకోవటం అత్యంత సహజమైన విషయం. అయితే ఇప్పుడు సునీత గారికి ఉన్న matured voice మరొకరికి లేదు.

పాటలో మనసును తాకే రెండు పదాలు:" నీవులేని చోటు లేదు సాయి. ఈ జగమే నీ ద్వారకా మాయి". రచన రామ జోగయ్య. పాటలో ’ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు ఏకమనేకమ్ముగా విస్తరించినావు’ అన్న చోట ఎంతో హృద్యంగా కళ్యాణి రాగం వినిపించింది.

2) వస్తున్నా బాబా వస్తున్నా: పాటలో pathos పలకాలంటే శుభపంతువరాళి సరైన రాగం. భక్తులను సాయి అనునయిస్తూ, అభయమిస్తూ పాడటం బాగుంది. నానావళికి (?) మాత్రం కీరవాణి గొంతు బాగానే నప్పింది.

3) ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి : పాట బాగుంది. మధు బాలకృష్ణ గొంతు హాయిగా ఉంటుంది. కానీ శ్రుతి కొంచెం sine wave లా ఉంటుంది. తిన్నగా సరళరేఖలా ఉంటే ఇంకా బాగుంటుంది. పాట మధ్యలో శహన లో సునీత గొంతు కలపటం బాగుంది.

4) మానవసేవే మాధవసేవని : విన్నవెంటనే ఆకట్టుకునే గుణం ఉన్న పాట ఇది. దీపు, అదితి పాల్ . బాగానే పాడారు కానీ పదాల ఉచ్చారణ leaves a lot to be desired. సత్వమూర్తి అన్న పదం స్పష్టంగా పలకొద్దూ. for once the composer chose not sing this song and wrote the lyrics instead. ఈ పాట వింటూ హాయిగా నిద్దురలోకి జారుకోవచ్చు.

బాలు సునీత పాడిన సాయి అంటే తల్లి పాట కూడా బాగుంది. సాయి పాదం పాట సాహిత్యం అత్యుత్తమంగా (వేద వ్యాస) ఉంది. పాట ఎత్తుగడ మాండ్ రాగంలో బాగుంది. కానీ ఎందుకో మాండ్ రాగాన్ని bits and pieces లోనే ఎప్పుడూ వాడుతున్నారు.

తక్కిన పాటలు కథాగమనానికి తోడ్పడేలా ఉన్నాయి. చూస్తూ వింటేనే బాగుంటాయి. శంకర్ మహదేవన్ పాడిన పాట అంతగా ఆకట్టుకోలేదు. తనకు ఇంకా మంచి బలమైన పాట ఉండాలి.

ముక్తాయింపు: కీరవాణి మంచి సంగీతం కూర్చాడు. ఇళయరాజా, ఆదిత్య పౌడ్వాల్ బాణీలు కట్టిన సాయిబాబా చిత్రాలపాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ పాటలు కూడా  వింటే బాగున్నాయి.   cinema లో రాఘవేన్ద్రరావు మార్కు crudeness లేకుండా ఉంటే బాగుంటుంది అని ఆశిస్తున్నాను.





Wednesday, July 18, 2012

షణ్ముఖప్రియ- చెంబై-చౌడయ్య- కుంచెం confusion

now something divine :

మహాగాయకుడు చెంబై (వైద్యనాథ భాగవతారు),  మహా వయొలిన్ విద్వన్మణి మైసూరు చౌడయ్య  కలయిక లో ఒక కీర్తన షణ్ముఖప్రియలో ఇక్కడ చూసి వినవచ్చు. చెంబై గొంతులోని timbre నాదపుష్టి అనుపమానంగా ఉంటుంది.

ఇద్దరు శాస్త్రవేత్తలు కలిసి god's particle  కనుగొనటమంటే ఇదేనేమో.  (God's particle అన్న పదం scientist లే coin చేసే సరికి హేతువాదులకు పొలమారింది)

జేసుదాసు చెంబై గారి ప్రముఖ శిష్యుడు.

now , the mundane :

మంచి గీతం విన్నతరువాత ఇది వింటే కుంచెం నడ్డి మీద ఛంపేసినట్టున్నా పాట బానే ఉంటుంది.

summer in bethleham అనే మళయాళ చిత్రంలో(1998) విద్యాసాగర్ బాణీ కట్టిన ’confusion  తీర్కణమే’ పాట ఇక్కడ

తెలుగులో ’తిరువేంకటాధీశ జగదీశ’ (ఘంటసాల), తకిట తధిమి తందాన (సాగర సంగమం) ప్రాచుర్యం పొందినవి.
అణురేణు పరిపూర్ణమైన, అణిమాది సిరివంటిది షణ్ముఖ ప్రియ.

Friday, March 23, 2012

పాపనాశం శివన్ + కద్రి గోపాల్ నాథ్ +’జ్ఞాన వినాయకనే’ - ఒక దివ్యానుభూతి.



ఇద్దరు మహా సంగీత విద్వాంసుల కలయికలో ఒక పరమాద్భుతమైన కీర్తన ఒక్కసారి పునశ్శ్రవణం చేసుకుంటే ఆ’నందనం’ గా ఉంటుంది అనిపించింది.


పాపనాశం  శివన్-- తమిళ త్యాగరాజు గా పేర్కాంచిన ఈ వాగ్గేయ కారుడు అద్భుత కీర్తనలను రచించి స్వరపరిచాడు. వీరు  (1890 -1973) కూర్చిన  ’జ్ఞాన వినాయకనే’  కృతిలో వేగం + మాధుర్యం + కద్రి గోపాల్ నాధ్ శాక్సోపోన్ వాదనం పామరులనైనా పరవశింపజేస్తాయి.
కద్రి గోపాల్ నాథ్ (కద్రి గోపాల్ నాథ్ జాలపుట చిరునామా) saxophone maestro అన్న విషయం సంగీత ప్రేమికులందరికీ తెలుసును. వారికి వారే సాటి.

రాగం. గంభీరనాట. కొంచెం తిలాంగ్ రాగంలా అనిపిస్తుంది. అవరోహణలో నిషాదం మార్పుతో.


duet సినిమాలో వీరు sax వాయించి చిత్ర సంగీతాన్ని అమాంతం elevate చేశారు. ఈ పాటలో అక్కడక్కడ వినవచ్చు.


మరికొన్ని అమృత పాణీలు ఇక్కడ-- పురందర దాసర కృతి ’వెంకటాచల నిలయం’
 
’కృష్ణా నీ బేగనే బారో’ -
 
ఆకాశంలో శబ్దం తన అంశ అని గీతాచార్యుని ఉవాచ. ఆ శబ్దం ఇటువంటి మహా విద్వాంసుల సంగీతమేనేమో.

Friday, November 25, 2011

ఇళయరాజాకు కీరవాణి అంటేనే ఎందుకో అంత ఇష్టం..కొన్ని సంగీత కబుర్లు.

శ్రీరామ రాజ్యం చిత్రంలోని ఈ పాట further proof of that.

పంచభూతాలు అచ్చ తెలుగులో నింగి,నేల,నీరు,నిప్పు, గాలి (ఈ ఒక్క పదం నకారంతో దొరికితే బాగుంటుంది). గాలి నింగి నీరు, నేల నిప్పు మీరు. పాట బాగుంది. ఎన్ని పాటలు కీరవాణిలో స్వరపరిచాడో ఇళయరాజా.

జగదానందకారక పాట చాలా బాగుంది.(శుద్ధ ధన్యాసి). పాట సాహిత్యం,బాణీ, సంగీతం, చిత్రీకరణ ఉత్కృష్టంగా ఉన్నాయి. బాలు చక్కగా పాడితే. శ్రేయ గోశాల్ క్రూనింది.

అలాగే వసంత రాగంలోని శ్రీరామ లేరా పాటను కూడా ఇద్దరూ (రాము, శ్రేయ) స్పష్టతలేకుండా గొణిగేశారు.

ఈ చిత్రంలో నాకు ముఖ్యంగా జొన్నవిత్తుల సాహిత్యం బాగా నచ్చింది. ఆత్రేయలా, సినారెలా వ్రాశాడు ఆయన. వేటూరిలా వింత పోకడలు పోకుండా, సిరివెన్నెలలా నారికేళపాకాలు కాకుండా బాగున్నాయి. (వేటూరి, సిరివెన్నెల కు నేను కూడా అభిమానినే కానీ.. వేటూరి చక్రవర్తి కలిపి వండి వార్చిన కుంభీపాకాలు చప్పున గుర్తుకు వస్తాయి.)


కానీ కీరవాణికి కీరవాణి అంటే పెద్దగా నచ్చదేమో. నే విన్నంతలో వెతికితే ఈ ఒక్క పాటే దొరికింది. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని.(అనుకోకుండా ఒక రోజు). పాట ఎత్తుగడ, సాహిత్యం బాగుంది (సిరివెన్నెల) స్మిత చక్కగా పాడింది. song would have been better if it were a tad slow paced.తన voice culture బాగుంటుంది. కానీ ఎందుకో తను సినిమాలలో పాడదు.

Wednesday, November 2, 2011

తెలుగు లో 10 అత్యుత్తమ సంగీతభరిత చిత్రాల జాబితా--నా దృష్టిలో

తెలుగు లో 10 అత్యుత్తమ సంగీతభరిత చిత్రాల జాబితా కూర్చాలి అనిపించింది. (పదే ఎందుకు అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు).
ఈ జాబితా తయారు చేయటంలో నేను పరిగణన లోకి తీసుకున్న అంశాలు 1) ఎక్కువ శాతం పాటలు మాధుర్యంతో నిండి ఉండాలి 2) సాహిత్యం అర్థవంతంగా కుదరాలి 3) గాయనీ గాయకుల అద్భుత గానం 4) ఎంతకాలం గడచినా ఇంకా వినాలి అనిపించాలి.

కొన్నేళ్ళ క్రితమైతే ఈ జాబితా వేరుగా ఉండేది. ఇప్పుడు బేరీజు వేయటం లో కొంత పరిపక్వత వచ్చిందని (really?) అనుకుంటున్నాను.

1) లవకుశ : ఘంటసాల సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి అగ్ర తాంబూలం. ఎవ్వరూ ఎన్నటికీ అధిగమించలేని divine music. లీల,పి సుశీల, ఘంటసాల గార్ల సంగీత యాత్రకు పరమపదం గా చెప్పవచ్చు. ఈ సంగీతం న భూతో న భవిష్యతి

2) మల్లీశ్వరి : ఈ చిత్రంలోని పాటలు ఇప్పుడు కొద్దిగా jaded గా అనిపించవచ్చు. కానీ puritan ల దృష్టిలో ఇవి అజరామరమైన పాటలు. దేవులపల్లి, రాజేశ్వరరావు,ఘంటసాల, భానుమతి గారు. "ఊరు చేరాలి", మనసున మల్లెల మాలలూగెనే, ఆకాశవీధిలో.. పాటలు ఎన్నటికీ మరువలేము. దేవులపల్లి సంస్కృతంలో పండితులై ఉండి అచ్చతెనుగులో వ్రాయటం గొప్పవిషయం.

3) మాయాబజార్: అన్నిపాటలు ఆణి ముత్యాలే. రాజేశ్వరరావు, ఘంటసాల స్వరరచన. నాకు ప్రత్యేకించి ’చూపులు కలసిన శుభవేళ’ పాట చాలా ఇష్టం. అలాగే లాహిరిలాహిరి, వివాహ భోజనంబు అన్నీ super duper hits.

4) గుండమ్మకథ: చిత్రంలోని అన్ని పాటలు haunting మెలొడీలే. ఎప్పటికీ నిలిచిఉండే జనరంజకమైన బాణీలను కట్టడంలో ఘంటసాల గారికి అగ్రాసనం. my favourite : కనులు తెరచినా నీవాయె.

5)అక్బర్ సలీం అనార్కలి: ఈ చిత్రం ఒక గొప్ప musical అని నా అభిప్రాయం. సినారె సాహిత్యం, సుశీల, రఫి గానం, సి రామచన్ద్ర సంగీతం అన్నీ అద్భుతంగా కుదిరాయి. తానే మేలి ముసుగుతీసి ఒక జవ్వని, తారలెంతగా మెరిసేనో, రేయి ఆగిపోని, సిపాయీ సిపాయీ.. ఎంత గొప్ప పాటలవి.

6) అన్నమయ్య : నేదునూరి గారు, మల్లిక్, రాళ్ళపల్లి గారు, బాలకృష్ణప్రసాద్ వంటి పండితులు కట్టిన బాణీలనే అన్నమయ్య చిత్రంలో దాదాపుగా వాడినా అవి ఎన్నటికీ వాడిపోని పూలలాంటివి గనుక శాశ్వతంగా నిలిచిపోయాయి. pick of the album : అంతర్యామి పాట.

7) మేఘసందేశం: దాసరి నారాయణరావు తీసిన అత్యుత్తమ చిత్రం ఇదే. నాగేశ్వరరావు గారు, జయప్రద, జయసుధ, జగ్గయ్య.. అందరూ దిగ్గజాలే. రమేశ్ నాయుడు సంగీతం. తెలుగుదనం ఉట్టిపడే లలిత సంగీతం. మాధురీ లహరి. ఆకులో ఆకునై,పాడనా వాణి కళ్యాణిగా, సిగలో అవి విరులో, ముందు తెలిసెనా ప్రభూ, నిన్నటిదాకా శిలనైనా, ప్రియే చారుశీలే, శీత వేళ రానీయకు అన్ని మంచిపాటలు ఒకే చిత్రంలోనే. జేసుదాస్, సుశీల గారు. simply the best.

8) శ్రీ షిర్ది సాయిబాబా మహత్యం : విజయచందర్ సాయిబాబా పాత్రలో జీవించిన ఈ చిత్రంలో అన్ని పాటలూ హిట్సే. ఇళయరాజా సంగీతం, ఆత్రేయ సాహిత్యం పడుగు పేక లాగా కలిసిపోయి చక్కటి పాటలు వెలిశాయి. మా పాపాల తొలగించు, నువ్వు లేక అనాథలం,సాయి శరణమ్, బాబా సాయిబాబా,దైవం మానవ రూపంలో అన్నీ మేలిమి వజ్రాలే. ప్రత్యేకించి : బాలు పాడిన బాబా సాయిబాబా పాట.

9) శ్రీ సాయి మహిమ: అంతగా వెలుగులోకి రాని ఈ చిత్రం లోని పాటలకు నేను పెద్ద పీటే వేస్తాను. అత్య్తుత్తమ సంగీతం అనటంలో ఏమాత్రం సందేహం లేదు. సంగీతం అనూరాధ పౌడ్వాల్ కుమారుడైన ఆదిత్య పౌడ్ వాల్. అంత చిన్న కుర్రవాడు ఈ స్థాయి సంగీతం అందించాడంటే నేను ఇప్పటికీ నమ్మలేను. సినారె సాహిత్యం అత్యుత్తమంగా ఉంది. బాలు, జానకి, అనురాధ గార్లు అన్నిపాటలకు ప్రాణం పోశారు.
నిజం చెప్పాలంటే ఈ గీతమాలికలోని అన్నిపాటలు నాకు చాలా ఇష్టం. సాయిదివ్యరూపం, నిన్ను గని శరణమని, సాయి దేవా, ఎంతెంత దయనీది ఓ సాయి. divine music.

10) శంకరాభరణం: విశ్వనాధ్ గారి చిత్రం లేకుండా ఈ జాబితా పూర్తి చేయటం పెద్ద తప్పు అవుతుంది. అన్నీ గొప్ప బాణీలు అని చెప్పలేను కానీ పవిత్రత, నిబద్ధత కలిగిన సంగీతం. ముఖ్యంగా సామజవరగమన పాటమధ్యలో చరణాలు కల్పించటం చాలా చక్కగా కుదిరింది. దొరకునా ఇటువంటి సేవ పాట అత్యుత్తమం. కానీ రెండు అసంతృప్తులు ఉన్నాయి. సుశీలగారికి ఈ చిత్రంలో పాట లేక పోవటం. అలాగే ఓంకారనాదానుసంధానమౌ, రాగం తానం పల్లవి ఈ రెండు పాటల బదులు సంప్రదాయ గీతాలు పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది.

almost there : భక్త ప్రహ్లాద, మహాకవి కాళిదాసు.

అమ్మయ్య. ఎప్పటినుంచో వ్రాయాలి అనుకున్న ఈ టపా ఇప్పటికి నెరవేరింది. ఈ జాబితా నా personal choice మాత్రమే. సంగీత ప్రేమికుల జాబితాలో తప్పక ఇతర చిత్రాలు ఉండటం perfectly possible and okay.

Saturday, September 24, 2011

కారుచీకటిలో కాంతి రేఖవై మూగగుండెలో దివ్యవాణివై

70 వ దశకం చివర్లో ఆకాశవాణి కడప కేంద్రంలో ప్రతి ఆదివారం ఏసు ప్రభువు పాటలు పెట్టేవారు ఉదయం ఎనిమిదింటికి అనుకుంటా. అవి ఈ నాటికి నా మదిలో పదిలంగా ఉన్నాయి. అద్భుతమైన బాణీలు. అంతకు మించిన గానం సుశీల బాలు గార్లది. ఈ పాటలకు స్వరకర్త ఎవ్వరో నాకు ఇప్పటికీ తెలియలేదు. బహుశ: పాలగుమ్మి విశ్వనాథంగారేమో అని నా ఊహ. జాలం పుణ్యమా అని ’హృదయమే నీ ఆలయం క్రీస్తు’ ఆదిగా గల అన్నిపాటలు మళ్ళీ వినగలుగుతున్నాను.

ఈ క్రీస్తుపాటల సంకలనం లో నాకు అమితంగా నచ్చిన కొన్ని పాటలు.

హృదయమే నీ ఆలయం క్రీస్తూ.

ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో

శాశ్వతమా ఈ దేహం

ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం

నేనే మార్గము సత్యము జీవముని

ఈ లంకెలో పాటలు వినవచ్చు

ముఖ్యంగా ’మధుర మధుర సేవ ’ అనే పాట ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. దేశ్ రాగంలోని వినసొంపుదనం. బాలుగారి అద్భుతగానం ఈ పాటకు ప్రాణం పోశాయి. ఒకే గీత సంకలనంలో ఇన్ని ఆణిముత్యాలు పొదిగిన స్వరకర్తకు పాదాభివందనం చేయాలనిపిస్తుంది.
సుశీలగారు, బాలుగారు ఈ పాటలను గొప్పగాపాడారో చెప్పటానికి మాటలు చాలవు. ఈ తరం శ్రోతలు తప్పక విని శాశ్వతంగా భద్రపరచుకోవాల్సిన పాటలు ఇవి. సాహిత్యం కొంచెం typically క్రైస్తవంగా అనిపిస్తుంది కానీ బాణీల లోని మాధుర్యం మాటలను అధిగమిస్తుంది.

తెలుగుదనం, భారతీయత ఉట్టిపడే ఈ పాటలు తప్పక ఒకసారి స్మరించుకోవటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కరుణామయుడైన యేసు ప్రభువు ప్రశాంత వదనం కళ్ళకు కట్టించే పాటలు ఇవి.

నేను క్రైస్తవుడిని కాను కాని ఈ పాటలు మాత్రం నేను అమితంగా అభిమానిస్తాను. స్వస్తి.

Thursday, August 25, 2011

మోహనరాగమహా -మూర్తిమంతమాయే

మోహనరాగం. ఈ రాగం లోని పాటలు వింటే మనసు ఎంతో ఆహ్లాదకరంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా మారిపోతుంది. హాయిగా అనిపిస్తుంది. ఇట్టే ఆకట్టుకుంటుంది. గోవిందుడు అందరివాడేలే అన్నట్టుగా మోహనరాగం అందరికీ ఇష్టమైనదే. ఒకసారి కొత్తపాళీ గారి బ్లాగులో మోహనరాగాన్ని వంకాయకూరతో పోలికతెచ్చి ఎంతో బాగా వ్రాశారు.

సినీ గీతాలవరకూ చూస్తే మోహనం హిందోళం మమ్మీ డాడీ రాగాలు.

ఎన్నో వందలపాటలు స్వరపరచబడ్డాయి మోహనంలో.



అందరికీ తెలిసిన పాటలు కాకుండా రెండు కన్నడ పాటలు పరిచయం చేయాలనిపించింది నాకు. రెంటికీ స్వరకర్తలు రాజన్ నాగేంద్ర. వీరు జనరంజకంగా పాటలు కట్టడంలో సిద్ధహస్తులు.

’నన్న ఆశె హణ్ణాగి’అనే ఈ పాట ఒక చక్కని యుగళగీతం. బాలు గారి గొంతు ఎంతబాగుంటుందో మాటల్లో చెప్పలేను. ఈ పాట తరువాత తెలుగులో, తమిళంలో కూడా వచ్చింది. (విశేషమేమంటే బాలు కన్నడంలో జానకిగారితో, తెలుగులో సుశీలగారితో,అరవంలో వాణీ జయరాం గారితో ఈ పాట పాడారు. ఈ పాటలో నటించిన శంకర్ నాగ్ (అనంతనాగ్ తమ్ముడు) తరువాతి కాలంలో కారు ప్రమాదంలో చనిపోయాడు.). మూడు భాషలలోనూ, కన్నడపాటే ఉత్తమంగా ఉంది. బాలు గొంతుకోసమే ఈ పాట నేను చాలాసార్లు విన్నాను.

యుగళగీతం చివర్లో గాయనీ గాయకులు ఇద్దరినీ తప్పకుండా కలిపి పాడించటం రాజన్ నాగేంద్ర ప్రత్యేకత.

’జేనిన హొళెయో హాలిన మళెయో’ఈ పాట కన్నడ కంఠీరవ డా. రాజకుమార్ పాడినది. కన్నడ దేశపు ఔన్నత్యాన్ని తెలిపే ఈ పాటకూడా చాలా బాగుంటుంది.
రానా స్వరపరచిన పంతులమ్మ గీతాలు ఎంత బాగుంటాయో అందరికీ తెలుసును. ’సిరిమల్లె నీవె’ పాట చరణాల్లో కొన్ని అన్య స్వరాలు వచ్చినా మోహనరాగం ఆధారితమే.

పాటలు విన్నతరువాత మోహనమీ ప్రకృతి. మోహనమీ జగతి. అనిపిస్తుంది.